
మత్స్య వేటకు సై!
రెండు మాసాల మత్స్య వేట నిషేధ గడువు ముగింపునకు చేరుకుంది. నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట ప్రారంభం కానుంది. ఇప్పటికే బోట్లు, వలలకు మరమ్మతులు చేపట్టి, లంగరెత్తేందుకు గంగపుత్రులు సిద్ధమయ్యారు. ఈ రోజు రాత్రి నుంచే వేటకు వెళ్లనుండటంతో ఫిషింగ్ హార్బర్లో సందడి నెలకొంది. తమకు కావాల్సిన సామగ్రిని సిద్ధం చేసుకుంటూ మత్స్యకారులు హడావుడిగా ఉన్నారు. బాక్స్ల నిండుగా ఐస్ లోడ్ చేశారు. పక్షం నుంచి నెల రోజులకు సరిపడా వంట సామగ్రి బోటులో చేర్చారు. చిన్నచిన్న లోపాలు కూడా లేకుండా అంతా మరోసారి చెక్ చేసుకున్నారు.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

మత్స్య వేటకు సై!