రక్తదానంపై అపోహలకు పోవద్దు. రక్తదాతలకు ప్రాథమికంగా పరీక్షలు చేసిన తర్వాతే రక్తం తీసుకుంటాం. మగవారు ప్రతి 3 నెలలకు ఒకసారి, ఆడవారు 4 నెలలకు ఒకసారి రక్తం దానం చేయవచ్చు. ఒక వ్యక్తి దానం చేసిన రక్తం 35 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. అందువల్ల రక్తదానం నిరంతర ప్రక్రియగా సాగాలి. స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారు తక్కువగా ఉంటున్నారు. అందుకే విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. – ఎస్.కనకదుర్గ, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్,
ఎన్టీఆర్ ఆస్పత్రి, అనకాపల్లి