
బాల కార్మికుల వ్యవస్థపై అవగాహన ర్యాలీ
అనకాపల్లి: ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని అనకాపల్లిలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం, న్యాయ శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కలిగిస్తూ ర్యాలీ జరిపారు. ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.ధర్మారావు మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాల కార్మికులు పాఠశాలలో చేరి చదువుకుని విద్యావంతులు కావాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయ శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కల్పించారు. జిల్లా కార్మిక శాఖ అధికారి నరేంద్ర, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.