
క్రమం తప్పకుండా యోగా చేయాలి
● హోం మంత్రి అనిత పిలుపు ● ఏపీఐఐసీ కార్యాలయం ఆవరణలో యోగాంధ్ర
అచ్యుతాపురం రూరల్: ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. గురువారం అచ్యుతాపురం సెజ్ ముఖ ద్వారం వద్దనున్న ఏపీఐఐసీ కార్యాలయం ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్కుమార్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన దేశ యోగులు, రుషులు కనుగొన్న గొప్ప వ్యాయామమే యోగా అని అన్నారు. భారతదేశం ప్రపంచానికి యోగా అనే మహోన్నత వ్యాయామం బహుమతిగా ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సెజ్లోని పరిశ్రమల యాజమాన్యాలు, కార్మికులు, యోగా ప్రేమికులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.