
రైల్వే ఆస్పత్రిలో ఆధునిక పరికరాల ప్రారంభం
తాటిచెట్లపాలెం: ఈస్ట్కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో రైల్వే ఉద్యోగులు, సిబ్బంది సౌకర్యార్థం అధునాతన పరికరాలను డీఆర్ఎం లలిత్ బోరా గురువారం ప్రారంభించారు. ఫిజియోథెరపీ యూనిట్లో ఇథైలిన్ ఆకై ్సడ్ స్టెరిలైజర్, అడ్వాన్స్డ్ లేజర్ మెషీన్లను ఆయనతోపాటు, ఈకార్వో ప్రెసిడెంట్ జ్యోత్స్న బోరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అధునాతన పరికరాల సాయంతో రైల్వే ఉద్యోగులకు మరింత సుఖవంతమైన, శ్రేయస్కరమైన వైద్యసదుపాయాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డి.శరత్బాబు, ఏడీఆర్ఎం(ఇన్ఫ్రా) ఇ.శాంతారాం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.