బుచ్చెయ్యపేట : మండలంలో గల రాజాం, తట్టబంద (ఆర్టీ) రోడ్డులో గోతులకు మోక్షం కలిగింది. రాజాం నుండి తురకలపూడి వరకు పెద్దపెద్ద గోతులు పడి రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. గోతులను పూడ్చాలని పలువురు కోరినా అధికారులు, పాలకులు పట్టించికోలేదు. ఈ రహదారిలో రాకపోకలు సాగించే రావికమతం, బుచ్చెయ్యపేట మండలాలకు చెందిన 25 గ్రామాల ప్రజలు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. రోడ్డు గోతుల వల్ల అనకాపల్లి ఆర్టీసీ అధికార్లు బస్సులు నడపడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతుల్లో పడి పలువురు వాహనదారులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. రావికమతం మండలం జీడిపిక్కల ఫ్యాక్టరీ యజమాని ప్రభు ప్రయాణికులు కష్టాలను చూసి ముందుకొచ్చారు. సుమారు రూ.2 లక్షలతో ఐదు కిలోమీటర్లు పొడవున ఉన్న గోతులను కప్పించారు. గోతులను పొక్లెయిన్తో లెవిలింగ్ చేసి గ్రావెల్తో గోతులను పూడ్చారు. సజావుగా వాహనాలు రాకపోకలు సాగేలా చేశారు.
దాత సాయం.. గోతుల రోడ్డుకు మోక్షం
దాత సాయం.. గోతుల రోడ్డుకు మోక్షం