
నెట్ సెంటరే సచివాలయం?
ఎస్.రాయవరం : తల్లికి వందనం పథకానికి లబ్ధిదారులను నమోదు చేస్తామని రేవుపోలవరం గ్రామంలో ఓ ఇంటర్నెట్ దుకాణం వద్ద రూ.30 చొప్పున వసూలు చేసి వేలిముద్రలు వేయించుకుంటున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ మంగళవారం తెలిపారు. సచివాలయం లాగిన్ ఇంటర్నెట్ సెంటర్లో ఓపెన్ చేసి గ్రామస్తులందరినీ పిలిపించి రూ.30 చొప్పున తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సచివాలయం సిబ్బంది, సచివాలయాల్లో చేయాల్సిన పనులు ఇంటర్నెట్ సెంటర్లో చేయడం, పైగా నగదు వసూళ్లు చేయడం ఏమిటని ధ్వజమెత్తారు. స్థానిక కూటమి నేతలు ఈ రకమైన పనులను ప్రోత్సహించడం వల్ల సచివాలయ సిబ్బంది విధులకు సక్రమంగా హాజరుకాకపోవడమే కాకుండా పనులు పక్కదారి పడుతున్నాయన్నారు. ఈ సమస్యను మండల అధికారులు దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు.
తల్లికి వందనం వేలిముద్రకు
రూ.30 చొప్పున వసూళ్లు
అక్రమాలను ప్రోత్సహిస్తున్న కూటమి నేతలు
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బాలాజీ ధ్వజం