
విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలు
అనకాపల్లి టౌన్: విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలని, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్స హించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ ఏడాది పది, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులకు అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమ వారం షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. 10వ తరగతిలో 153 మంది, ఇంటర్లో 32 మంది అవార్డులు అందుకున్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులకు ఒక్కొక్కొరికి రూ.20 వేలు చెక్, ప్రోత్సాహక సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ ఈ షైనింగ్ స్టార్స్ ఇక్కడితో ఆగకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర
185 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం

విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలు