తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆదివాసీల ధర్నా | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆదివాసీల ధర్నా

Jun 10 2025 7:01 AM | Updated on Jun 10 2025 7:01 AM

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆదివాసీల ధర్నా

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆదివాసీల ధర్నా

మాడుగుల రూరల్‌ : శంకరం పంచాయతీ శివారు కృష్ణంపాలెం గ్రామానికి సంబంధించి ప్రభుత్వ బంజరు భూములను స్థానిక ఆదివాసీలకు కేటాయించాలని కోరుతూ సోమవారం ర్యాలీ నిర్వహించారు. మాడుగుల గాంధీ పార్కు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీల సమస్యలు గురించి నినాదాలు చేశారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం తహసీల్దారు రమాదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. శంకరం పంచాయతీ శివారు కృష్ణంపాలెం గ్రామంలో గల సర్వే నెంబరు 188–3 లో గల భూమిని ఆదివాసీలకు కేటాయించాల ని, సివిల్‌ కేసులలో ఆదివాసీలను ప్రతిసారి పోలీసుస్టేషన్‌కు పిలిపించి పోలీసులు తమని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తహసీల్దా రుకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. త హసీల్దార్‌ రమాదేవి మాట్లాడుతూ ఎస్‌ఐ, ఇతర సిబ్బందితో మాట్లాడుతానని వారికి హామీ ఇచ్చారు. అలాగే కృష్ణంపాలెం గ్రామానికి చెందిన 46 మంది వ్యక్తిగతంగా దరఖాస్తులు అందజేశారు. సీపీఐ ఎంఎల్‌ లిబిరేషన్‌ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌.గణేష్‌ పాల్గొన్నారు.

గ్రామీణ మెరుపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement