
సింహాచలం దేవస్థానం ఈవో బదిలీ
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈవో వి. త్రినాథరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ని దేవదాయశాఖ రాజమహేంద్ర వరం మల్టీ జోన్–1 రీజనల్ జాయింట్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి వి. వినయ్చంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సింహాచలం దేవస్థానానికి కొత్త ఈవో నియమితులయ్యే వరకు త్రినాథరావే ఇన్చార్జి ఈవోగా కొనసాగాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. త్రినాథరావు 2024 సెప్టెంబర్ 22 నుంచి సింహాచలం దేవస్థానం ఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 31 వరకు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్న ఆయన, గత నెల 26వ తేదీనే తిరిగి విధుల్లో చేరారు. కాగా, తనను సింహాచలం దేవస్థానం నుంచి బదిలీ చేయాలని త్రినాథరావే దేవదాయశాఖకు దరఖాస్తు చేసుకున్నందువల్లే ఈ బదిలీ జరిగిందని ప్రచారం జరుగుతోంది.