
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు
తుమ్మపాల: ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వినియోగించడం ఎంతో ఆరోగ్యకరమని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ను ఆమె సోమవారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.శచీదేవి, ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.