
ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో చౌడువాడ విద్యార్థిని ప్రతిభ
కె.కోటపాడు : ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో మండలంలో చౌడువాడ గ్రామానికి చెందిన రాజి మనీషా సాయి కుమారి ప్రతిభను కనబర్చింది. అగ్రికల్చర్ ఫార్మసీలో రాష్ట్ర స్థాయిలో 144వ ర్యాంక్ను సాధించింది. ఇంటర్లో బైపీపీ చదివి, 986 మార్కులు సాధించినట్టు ఆమె తండ్రి సత్యనారాయణ తెలిపారు. కుమార్తె అగ్రికల్చరల్ పార్మసీలో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ను సాధించడం ఆనందంగా ఉందని తండ్రి సత్యనారాయణ, తల్లి సోనియా పేర్కొన్నారు.
అగ్రికల్చర్ ఫార్మసీలో రాష్ట్ర స్థాయిలో 144వ ర్యాంక్