
అర్ధరాత్రి గ్రావెల్ అక్రమ రవాణా
అచ్యుతాపురం రూరల్ : మండలంలో ఆదివారం అర్ధరాత్రి గ్రావెల్ దొంగలు రెచ్చిపోయారు. కొండకర్ల, చీమలాపల్లికి మధ్యలో ఉన్న కొండ ప్రాంతాన్ని అర్ధరాత్రి వేళ అక్రమార్కులు యథేచ్ఛగా దోచేస్తున్నారు. నిర్మాణాలకు, ఖాళీ స్థలాల్లో నింపేందుకు ఉపయోగకరమైన మట్టిని దర్జాగా కొండల్ని పిండిచేసి తరలించుకుపోతున్నారు. స్థానికంగా ఉన్నవారు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం లేకపోతోంది. సుమారు 10 ట్రాక్టర్లతో మట్టిని ఇక్కడి కొండ ప్రాంతాన్ని తవ్వి తరలించుకుపోయారు. ఈ దందా కూటమి నాయకుల కనుసన్నల్లో జరుగుతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రావెల్ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.