
ఈదురు గాలుల బీభత్సం
మాడుగుల రూరల్/మాడుగుల: మండలంలో ఆదివారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గరికిబంద చెక్పోస్టు వద్ద భారీ వృక్షాలు నేల కొరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్అండ్బీ అధికారులు స్పందించి చెట్లను తొలగించకపోవడంతో ప్రయాణికులు సుమారు మూడు గంటలు పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాడుగుల నుంచి ఎం.కోడూరు వెళ్లే రహదారిలో పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద మినీట్రాన్స్ఫార్మర్ నేలకొరిగింది. తాటిపర్తి పంచాయతీ శివారు చిన కూర్మానాథపురం, శంకరం, జేడీ పేట పంచాయతీ శివారు కొండలపాడు, ఎం.కోడూరులలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, ఎం.కోడూరు, సాగరం తదితర చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. పక్వానికి వచ్చిన మామిడి కాయలు పూర్తిగా రాలిపోయి రైతులు నష్టపోయారు. ఎం.కోడూరు, మాడుగులలో సమారు 13 స్తంభాలు విరిగిపోయాయని, తమ సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపట్టారని విద్యుత్ శాఖ ఏఈ ఎం. రాంబాబు తెలిపారు.
పలు చోట్ల నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు

ఈదురు గాలుల బీభత్సం

ఈదురు గాలుల బీభత్సం

ఈదురు గాలుల బీభత్సం