యోగాతో సమస్యలు తీరవు | - | Sakshi
Sakshi News home page

యోగాతో సమస్యలు తీరవు

Jun 8 2025 12:52 AM | Updated on Jun 8 2025 12:52 AM

యోగాతో సమస్యలు తీరవు

యోగాతో సమస్యలు తీరవు

ఎస్‌.రాయవరం: యోగాసనాలతో ప్రజల సమస్యలు తీరిపోవు..కేవలం ప్రజల దృష్టి మరల్చిందుకు ప్రధాని నరేంద్రమోదీ యోగా జపం చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ అన్నారు. వెంకటాపురం గ్రామంలో ఉపాఽధి కూలీలతో శనివారం సత్యనారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మే 21 నుంచి జూన్‌ 21 నెలరోజులు పాటు యోగా కార్యక్రమాలు చేపట్టేందుకు పిలుపునిచ్చిందన్నారు. ఎద్దు ఈనిందంటే దూడను కళ్లెంతో కట్టేయమన్నట్లుగా కేంద్రం ఇలా పిలపునిచ్చిందో లేదో వెంటనే యోగాంధ్ర అంటూ రాష్ట్రం ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమం ముగింపురోజున విశాఖకు నరేంద్రమోదీ వస్తున్నారన్నారని, ఆ రోజున రెండు లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.

లోటు బడ్జెట్‌తో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంటే.. విశాఖలో యోగా ఎందుకని ప్రశ్నించారు. ఆంధ్రుల హక్కుగా పిలిచే విశాఖ ఉక్కు ఖర్మాగారాన్ని ఆదుకునే సమయం లేదు, కాని యోగాసనాలకు సమయం ఎలా వచ్చిందని విమర్శించారు. ఇకనై మోదీ ఆంధ్రాను ఎలా ఆదుకుంటారో ప్రకటన చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement