
5న వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
అనకాపల్లి టౌన్: అనకాపల్లి రింగ్రోడ్ పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఈ నెల ఐదున ఉదయం 10 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థ్ధాయి సమావేశం జరుగుతుందని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాఽథ్ తెలిపారు. ఈ మేరకు గురువారం సమావేశం జరిగే హాల్ను పార్టీ క్యాడర్తో కలిసి పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. ముందుగా రింగ్రోడ్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశంలో ముఖ్యంగా జరిగిన సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం లబ్ది చేకూరలేదన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం చంద్రబాబు మార్క్ రాజకీయానికి నిదర్శనమన్నారు. అలాగే రాబోయే కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టాలి, అందుకు కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల నుంచి పార్టీ ముఖ్య కార్యకర్తలు, బూత్ కమిటీ ఏజెట్లు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. రెండు వేల మందితో నిర్వహించే ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కో– ఆర్డినేటర్ కురసాల కన్నబాబు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మలసాల భరత్ కుమార్, అనకాపల్లి పార్లమెంట్ నియోజకర్గ సమన్వయకర్త కరణం దర్మశ్రీ, అల్లూరి జిల్లా పరిశీలకులు బోడ్డేడ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, జిల్లా కార్యదర్శి జాజుల రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్, పార్టీ సీనియర్ నాయకులు మళ్ళ బుల్లిబాబు, కె.ఎం. నాయుడు, బొడ్డేడ శివ, గండిరవి, ఉగ్గిన అప్పారావు పాల్గొన్నారు.