
మన్యం అభివృద్ధిలో టెలికాం కీలకం
సాక్షి,పాడేరు: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి విద్యుత్, రహదారులతో పాటు టెలికాం కూడా కీలకమని మినిస్ట్రీ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ అదనపు కార్యదర్శి గుల్జార్ నటరాజన్ తెలిపారు. జిల్లాలో గురువారం పర్యటించిన ఆయన పలు సెల్ టవర్లను పరిశీలించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రగతితో పాటు ఎన్జీవో ఫామ్ ఏర్పాటు సంతృప్తినిచ్చిందన్నారు.జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో మంచి ప్రగతి ఉందన్నారు. ప్రజలకు కమ్యూనికేషన్ ఎంతో అవసరమన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్య, వైద్యం, పీఎం జన్మన్, టూరిజం, సెల్టవర్లు, రోడ్డు తదితర అంశాల్లో ప్రగతిని వివరించారు. జిల్లాలో 1591 సెల్టవర్లు మంజూరు అయ్యాయని, 50వేలమంది గిరిజన రైతులు సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి నాగ వెంకట సాహిత్, బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం, జియో డీజీఎం సత్యప్రసాద్, ఎయిర్టెల్ డీప్యూటీ డీఎం మృణాల్, డీఆర్డీఏ పీడీ మురళీ, విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్ఈ ప్రసాద్, డీఈవో పి.బ్రహ్మాజీరావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, ఇన్చార్జి డీడీ రజనీ పాల్గొన్నారు.
టెలీ కమ్యూనికేషన్స్ అదనపు కార్యదర్శి గుల్జార్ నటరాజన్