
వెదురు పెంపకంతో అధిక లాభాలు
అనకాపల్లి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ
రావికమతం(అనకాపల్లి) : డీఆర్డీఏ పీడీ అదేశాల మేరకు గురువారం రావికమతం వెలుగు కార్యాలయంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ,జీవనోపాదుల విభాగం మరియు ఇండస్ట్రీయల్ ఆప్ బాంబుస్ అఫ్ బెంగళూరు వారు సంయుక్తంగా మండలంలో వెదురు పంటపై అవగాహన కల్పించారు.మండలంలో వెదురు పెంపకానికి 200 మంది రైతులను గుర్తించాలని బెంగళూరుకు చెందిన ఇండస్ట్రియల్ ఆప్ బ్యాంబుస్ సంస్థ ప్రతినిధి కుసుమ కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు త్రిపుర రకానికి చెందిన వెదురు మొక్కలను ఉచితంగా రైతులకు అందజేస్తామన్నారు. ఈ మెక్కలు నాటాడానికి ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఒక రైతు వెదురును పెంచేందుకు కనీసం 37 సెంట్లు భూమి ఉండాలన్నారు. నాటిన నాలుగు ఏళ్ల తరువాత ఎదిగిన వెదురును తమ సంస్థ కొనిగోలు చేస్తుందని వివరించారు. ఒక్కసారి నాటితే 100 సంవత్సరాలు వరకు వెదురును అమ్ముకోవచ్చుని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ , ఏపీఎం ఈశ్వరరావు, సీసీలు, సిబ్బంది పాల్గొన్నారు.