
జూలో సీడ్ బాల్స్ తయారీ
ఆరిలోవ(విశాఖ): ఇందిరాగాంధీ జూ పార్కులో జూ, గ్రీన్ కై ్లమేట్ సంస్థ సంయుక్తంగా మంగళవారం సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం నిర్వహించాయి. ఎన్సీసీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సీడ్ బాల్స్ తయారు చేసి జూలోని వివిధ ప్రాంతాల్లో చల్లారు. జూ క్యూరేటర్ మంగమ్మ మాట్లాడుతూ విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం అభినందనీయమన్నారు. ఏపీ ఎన్సీసీ పదమూడో బెటాలియన్ ఎల్.టి కల్నల్ నీరజ్కుమార్ మాట్లాడుతూ సామాజిక వనాల పెంపులో అందరి భాగస్వామ్యం అవసరమని తెలిపారు. కార్యక్రమంలో ఎన్సీసీ డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్ట్నెంట్ కల్నల్ స్వర్నిం, సుభేదార్లు మేజర్ శ్రీనివాస్, సుహాస్సింగ్, సునీల్సింగ్ రవీంద్రసింగ్, సుహాస్ సింగ్, జూ అధికారులు, సిబ్బంది, గ్రీన్ క్లైమేట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

జూలో సీడ్ బాల్స్ తయారీ