
ఎస్హెచ్జీ మహిళలు సాధికారత సాధించాలి
కలెక్టర్ దినేష్కుమార్
సాక్షి,పాడేరు: స్వయం సహాయక సంఘాల మహిళలు చిరువ్యాపారాలు చేసి సాధికారత సాధించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ తెలిపారు.కలెక్టరేట్ నుంచి వీడియో సమావేశం నిర్వహించారు.బ్యాంకు లింకేజీ రుణాలు,వ్యాపారాలు,రుణాల చెల్లింపులు,ఇతర సమస్యలపై సమీక్షించారు.ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీడీవోలు ... వెలుగు ఎపీఎంలతో రెండు వారాలకు ఒక సారి బ్యాంకు లింకేజీలపైన ,ఐటీడీఏ ఏపీవోలు ఏపీఎంలు,ఎంపీడీవోలతో 15రోజులకు ఒకసారి వెలుగు కార్యక్రమాలపై సమీక్షించాలన్నారు.జిల్లాలో 28వేల మంది చిన్నారులకు ఆధార్ నమోదు, 8,895మంది చిన్నారులకు జనన ధ్రువీకరణ పత్రాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అంగన్వాడీ సేవలు విస్తృతమవ్వాలని, పిల్లలకు భోజనం పెట్టి, పడుకోబెట్టడం కాదని,అక్షరాభ్యాసాలు జరపాలన్నారు.పీహెచ్సీల్లో వైద్యఆరోగ్య కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. మాతాశిశు మరణాలు సంభవిస్తే వైద్యులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవోలు డాక్టర్ అభిషేక్గౌడ, సింహాచలం, అపూర్వభరత్, డీఆర్డీఏ పీడీ మురళీ, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
పర్యాటక ప్రాంతాల్లో యెగా
జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నామని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ తెలిపారు.ఈనెల 29వతేదీన బొర్రాగుహల ప్రాంతంలోని బొర్రా పాఠశాల మైదానంలోను, జూన్ 4న అరకులోయ గిరిజన మ్యూజియం,జూన్ 11న చాపరాయి జలపాతం,జూన్ 17న మారేడుమిల్లి వన విహారి పర్యాటక ప్రాంతాల్లో 1,000మంది పర్యాటకులతో యోగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు.పర్యాటక కేంద్రాల్లో యోగా సాధనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, జిల్లా యోగా నోడల్ అధికారి ఎం.వి.వి.ఎస్.లోకేశ్వరరావు,జిల్లా పర్యాటక అధికారి దాసులను కలెక్టర్ ఆదేశించారు.