
ఘనంగా బసవేశ్వరుడి జయంతి
సాక్షి,పాడేరు: 12వ శతాబ్దపు కవి,సంఘ సంస్కర్త బసవేశ్వరుడి జయంతిని కలెక్టరేట్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. బసవేశ్వరుడి చిత్రపటానికి కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్, పలువురు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఏప్రిల్ 30న బసవ జయంతిని ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. లింగాయత్ ఉద్యమ స్థాపకుడైన బసవన్న శక్తివంతమైన బోధనల ద్వారా సమానత్వం, న్యాయం, శివభక్తి ప్రచారం కోసం కృషి చేశారన్నారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ కుల వివక్ష రహిత సమాజం కోసం అందరం కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి నాగ వెంకట సాహిత్,డీఆర్వో పద్మలత, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధకశాఖ అధికారులు నందు, రమేష్కుమార్రావు, నరసింహులు, కలెక్టరేట్ ఏవో తిరుమలరావు, డీటీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.