
‘మంత్రి జూపల్లి చెప్పినవన్నీ అబద్దాలే’
ఆదిలాబాద్టౌన్: తెలంగాణ రాష్ట్ర అప్పులపై జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పి న మాటలన్నీ అబద్దాలేనని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రోజుల ఆయన పర్యటనతో జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చే కూరలేదని విమర్శించారు. నూతన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులను ప్రస్తావించకుండా ఈ ప్రాంతవాసులకు నిరాశ మిగిల్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8లక్షల కోట్లు అప్పు చేసిందని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో రూ.5 వేల కోట్లతో అభివృద్ధి జరిగిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇందులో పార్టీ నాయకులు నారాయణ, అజయ్, నర్సింగరావు, ప్రహ్లాద్ తదితరులున్నారు.