‘వన’లక్ష్యం నెరవేరేనా! | - | Sakshi
Sakshi News home page

‘వన’లక్ష్యం నెరవేరేనా!

Jun 29 2025 2:38 AM | Updated on Jun 29 2025 2:38 AM

‘వన’లక్ష్యం నెరవేరేనా!

‘వన’లక్ష్యం నెరవేరేనా!

● ‘మున్సిపల్‌’లో వన మహోత్సవం జాడేది ● ఈ ఏడాది ఏర్పాటు చేయని నర్సరీలు ● మొక్కల కొనుగోళ్లపైనే బల్దియా దృష్టి ● ఇంకా ఖరారు కాని టెండర్ల ప్రక్రియ

రేపటి వరకు టెండర్లు ఖరారు

వనమహోత్సవంలో భాగంగా పట్టణ పరిధిలో నాటనున్న మొక్కల సరఫరాకు సంబంధించి ఆసక్తి గల వారి నుంచి టెండర్లు స్వీకరించాం. ఏడుగురు కొటేషన్లు అందజేశారు. వాటిని పరిశీలిస్తున్నాం. తక్కువకు కోట్‌ చేసి మొక్కలు సరఫరా చేసే సామర్థ్యం కలిగిన వారికే అప్పగిస్తాం. నిర్దేశిత లక్ష్యాలు సాధించేలా మొక్కలు నాటి సంరక్షించడంపై దృష్టి సారిస్తాం.

– కార్తీక్‌, మున్సిపల్‌ డీఈ

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో వన మహోత్సవ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది బల్దియా ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేయలేదు. పట్టణ పరిధిలో నాటేందుకు అవసరమై న మొక్కలను ప్రైవేట్‌ నుంచి కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రూ.25లక్షల నిధులు కేటాయించారు. ఆసక్తి గల వారి నుంచి టెండర్లు స్వీకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో జాప్యం అవుతుండడంతో నిర్ణీత సమయంలో మొ క్కల సరఫరా సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హరిత లక్ష్యం నెరవేరుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది.

5 లక్షల మొక్కలు నాటేలా కార్యాచరణ..

పచ్చదనం పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా వర్షాకాలంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. గ్రేడ్‌–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో ఈ ఏడాది 7.50లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే మొక్కల సంరక్షణ కష్టతరమవుతుందనే ఉద్దేశంతో ఐదు లక్షలు నాటాలని మున్సిపల్‌ అధికారులు కా ర్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో హోం ప్లాంటేష న్‌ కింద ఇళ్లలో నాటేందుకు 2లక్షల పూలు, పండ్ల మొక్కలు అందించాలని నిర్ణయించారు. ఇంటికి ఐదు మొక్కలు పంపిణీ చేయాలని భావించారు. అవెన్యూ ట్రీ ప్లాంటేషన్‌ కింద 2.50లక్షలు, మీడియన్‌ ప్లాంటేషన్‌ కింద మరో 50వేల చొప్పున నా టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో నీడనిచ్చేవాటితోపాటు భారీవృక్షాలుగా ఎదిగే స్పటోడియా, గుల్‌మొహర్‌, మహగని, టేబుషియా రోషియా, న ల్లమద్ది,కానుగ,రావి,మర్రివంటివి ఉండనున్నాయి.

మొక్కల కొనుగోలుకు టెండర్లు ..

పట్టణ పరిధిలో నాటేందుకు అవసరమైన మొక్కలను ప్రైవేట్‌ నర్సరీల నుంచి కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రూ.25లక్షలు కేటాయించారు. పట్టణానికి చెందిన ఏడుగు రు వ్యక్తులు అధికారులు సూచించిన ఆయా రకాల మొక్కలను వివిధ ధరలకు సరఫరా చేస్తామని పే ర్కొంటూ ఆయా నర్సరీల పేరిట కొటేషన్లు సమర్పించారు. బల్దియా అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. ఇందులో తక్కువ ధరకు కోట్‌ చేసిన వారికి మొక్కల సరఫరా బాధ్యతలు అప్పగించేలా కసర త్తు చేస్తున్నారు. అయితే ఈప్రక్రియలో జాప్యం అ వుతోంది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నందున పలు శాఖల ఆధ్వర్యంలో వనమహోత్సవం ప్రారంభించారు. త్వరితగతిన ఈప్రక్రియ పూర్తి చేసినట్లయితే సకాలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే చిన్నపాటి నర్సరీలు కలిగిన వారికి సరఫరా బాధ్యతలు అప్పగిస్తే వారు సకాలంలో ఎలా సరఫరా చేస్తారనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అధికారులు కొటేషన్లు చూసి కాకుండా క్షేత్రస్థాయిలో నర్సరీలను పరిశీలించి చర్యలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement