
మనపై మనకు నమ్మకం ఉండాలి
మాది ఉట్నూర్. మా పాప ప్రియాన్షి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నాను. గతంలో నార్నూర్ మండలంలోని చిత్తగూడ ఉమ్రి పాఠశాలలో పనిచేసే సమయంలో అక్కడే చేర్పించాను. ఇటీవల బదిలీల్లో భాగంగా ఉట్నూర్ ప్రాథమిక పాఠశాలకు వచ్చాను. మనపై మనకు నమ్మకం ఉండాలి. మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తేనే తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అడగవచ్చు. వారిని మోటీవేట్ చేయవచ్చు. లేకుంటే వారు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు కంప్యూటర్ విద్యతో పాటు ఏఐ బోధన సైతం అందుతుంది.
– చిరివెల్ల రవికుమార్, ఉపాధ్యాయుడు