
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులతో
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ఆదిలాబాద్టౌన్: వాహన డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అ న్నారు. స్థానిక పీఆర్టీయూ భవన్లో ది రాష్ట్రీయ చాలక్ ఏక్తా మంచ్ డ్రైవర్ల మహాసభ ముగింపు కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. సామాజిక వేత్త ముడుపు మౌనిష్రెడ్డి ఏర్పాటు చేసిన వైద్యశిబిరంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. డ్రైవర్లు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలో డ్రైవర్లు ర్యాలీ చేపట్టారు. ఇందులో ఏక్తామంచ్ ఆలిండియా వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ హబీబ్, రాష్ట్ర అధ్యక్షుడు సంజు, నాయకులు సోఫి, ఇర్ఫాన్, బాలాజీ, అభిమన్యు, మహబూబ్, మొయిన్ తదితరులున్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. శనివారం జూమ్ ద్వారా జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, వైద్యసిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు ప్రారంభమైనందున పారిశుద్ధ్య నిర్వహణ లోపించి వ్యాధులు ప్రబలే అవకాశముందని పేర్కొన్నారు. అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజల కు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సిబ్బంది తమ పరిధిలోని అన్ని గ్రామాల్లో జూలై 30 వరకు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలన్నారు. అవసరమైన వారికి ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్లు అందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, వైద్యాధికారులు పాల్గొన్నారు.
అక్రిడిటేషన్ గడువు పొడిగింపు
కైలాస్నగర్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడు వు మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీపీఆర్వో తిరుమల ప్రకటనలో తెలిపారు. జూన్ 30తో గడువు ముగియనున్నందున సెప్టెంబర్ 31 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అక్రిడిటేషన్ కార్డుదారులు ఈ నెల 30న డీపీఆర్వో కార్యాలయంలో సంప్రదించి కార్డుపై స్టిక్కర్ వేయించుకోవాలని ఆమె సూచించారు.