
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్టౌన్: న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్గౌడ్ అన్నా రు. గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు బార్ అసోసియేషన్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు కేటాయించిందని, కానీ అవి బార్ కౌన్సెలింగ్కు రాలేదన్నారు. న్యాయవాదులకు ఆరోగ్యపరంగా ప్రైవేట్ చికిత్సలు చేయించుకోవడానికి రూ.10లక్షల వరకు నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, ప్రధాన కార్యదర్శి డీఎస్పీ శర్మ, బార్ అసోసియేషన్ సభ్యులు చందుసింగ్, రమణయ్య, అఖిలేశ్, ముజాహి ద్, తదితరులు పాల్గొన్నారు.