
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ఇంద్రవెల్లి: వ్యవసాయ మార్కెట్ యార్డు ద్వారా ఉపాధి పొందుతున్న హమాలీలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఉట్నూ ర్ సబ్కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. ఇంద్రవెల్లి, నార్నూర్ మార్కెట్ యార్డులకు హమాలీల ఎంపిక ప్రక్రియను స్థానిక మా ర్కెట్ యార్డులో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ హమాలీ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో డీసీవో బి మోహన్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ మారుతి డొంగ్రె, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్, పీఏసీఎస్ సీఈవో ధరంసింగ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.