
పార్టీ పటిష్టతకు పాటుపడాలి
ఇచ్చోడ: పార్టీ పటిష్టత కోసం నాయకులు, కా ర్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని పీసీసీ జిల్లా పరిశీలకులు తాహెర్బిన్ హందాన్ అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం ఆయనను స్థానిక నాయకులు శాలువాతో సన్మానించారు. ఇందులో పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం నారాయణ రె డ్డి, నాయకులు ముస్తాఫా, భీంరెడ్డి, మహబూ బ్, ఆసీఫ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.