● ఈనాడు ప్రతులను దహనం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు ● ఇలాంటి పత్రికలు రాష్ట్రంలో ఉండరాదన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి
నరసరావుపేట: చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతో 90 ఏళ్ల రామోజీరావు తన ఈనాడు దినపత్రికలో నీతి, నిజాయితీతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషపురాతలు రాయిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ పిలుపు మేరకు గురువారం సాయంత్రం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం ఎదుట ఈనాడు దినపత్రిక ప్రతులను నాయకులు, కార్యకర్తలతో కలిసి దహనం చేశారు. పాత ఫొటోలు జోడించి తప్పుడు కథనం వండివార్చిన ఇలాంటి పత్రికలు రాష్ట్రంలో ఉండరాదన్నారు. చంద్రబాబు, రామోజీరావు, డాక్టర్ అరవిందబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉండగా ప్రజావ్యతిరేక పనులు చేయడంతోనే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని తిరస్కరించారన్న విషయాన్ని రామోజీరావు గుర్తించాలని చెప్పారు. పట్టాభికి దెబ్బలు తగిలాయంటూ పాత ఫొటోలతో వార్త రాసి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి రామోజీ ఒడిగట్టి పత్రికలకు ఉన్న ప్రాధాన్యతను చంపేశాడన్నారు. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాల్సిన పత్రికను చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలనే తపనతో సీఎం జగన్మోహన్రెడ్డిపై రోజుకొక కట్టుకథను అల్లి ప్రచారం చేస్తున్నాడన్నారు. వివేకానందరెడ్డి హత్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జరిగిన సంఘటనని, అప్పుడేమి వార్తలు రాయకుండా ఇప్పుడు సీబీఐ చెప్పినట్లుగా సీఎం జగన్పై రోజుకొక కట్టుకథను ప్రజల్లోకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా 15వ తేదీ జీతాలు ఇస్తుండగా ఒక్క వార్త రాసేందుకు ధైర్యం చేయని రామోజీరావు, ఏపీలో మాత్రం జీతాలు ఆలస్యమంటూ రాస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును మోస్తూ లోకేష్ను జాకీలతో లేపేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నా లేవట్లేదన్నారు. ఇక్కడ ఒక టీడీపీ నాయకుడి హత్య జరిగి, అది చేసింది టీడీపీ నాయకులేనని, మరణవాంగ్మూలంలో చెప్పినా, ఈ విషయంలో తాము చాలెంజ్ విసిరినా వైఎస్సార్సీపీ నాయకులే చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పౌడా చైర్మన్ మిట్టపల్లి రమేష్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.సుజాతాపాల్, మాజీ కౌన్సిలర్లు నెలటూరి మురళి, మాడిశెట్టి మోహనరావు, షేక్ మస్తాన్వలి, ఎస్సీ సెల్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు మల్లెల అశోక్,, అచ్చిశివకోటి, నాయకులు తలారి నాని, మారూరి శివారెడ్డి, సయ్యద్ ఖాదర్బాషా, బత్తుల విష్ణు పాల్గొన్నారు.
Published Fri, Feb 24 2023 3:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement