-
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
బాలాఘాట్: మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో కడ్లా అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వీరిని ఏరియా కమిటీ సభ్యురాలు(ఏసీఎం), భోరందేవ్ కమిటీ కమాండర్ సునీత, విస్తార్ దళానికి చెందిన ఏసీఎం సరితా ఖటియా మోచాగా గుర్తించారు. వీరిద్దరి తలలపై రూ.14 లక్షల చొప్పున రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. వీరి వద్ద తుపాకులు, మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యం దొరికిందన్నారు. వీరిద్దరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన వారిగా భావిస్తున్నారు. -
హైదరాబాద్లో ముగ్గురు మహిళా మావోయిస్టుల అరెస్ట్
-
మౌలాలీలో ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపాయి. మౌలాలీ ప్రాంతంలో ముగ్గురు మహిళా మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానస్పందంగా ఉన్న వీరిని ఈనెల 23న విశాఖపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనుషా, అన్నపూర్ణ, భవాని అనే ముగ్గురు మావోయిస్టులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు వారు ప్రకటించారు. ఇదివరకే వీరిపై పాడేరు పోలీస్ స్టేషన్లో పలుకేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. వారితో పాటు కుర్రా కామేశ్వరరావు అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు వీరేనా.. విశాఖలో సంచలనం రేపిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము ఎన్కౌంటర్లో వీరి పాత్ర కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో పూర్తి సమాచారం రావాల్సిఉంది. మావోయిస్టు కీలక నేత రామకిృష్ణ (ఆర్కే) ఆధ్వర్యంలో పలు ఎన్కౌంటర్లలలో వీరు ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారని పోలీసులు భావిస్తున్నారు. అరెస్టయిన వారిలో అనుషా దళకమాండర్గా పలు ఎన్కౌంటర్లలో పాల్గొన్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో ముగ్గురు మావోయిస్టులు పట్టుపడటం సంచలనంగా మాదిన నేపథ్యంలో పోలీస్ శాఖ అలర్టయింది. -
మహిళా మావోయిస్టు నాయకత్వంలో తొలి ఆపరేషన్!
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో పూర్తిగా ఓ మహిళ నాయకత్వంలో ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. గతంలో ఎక్కడ ఏ ఆపరేషన్ నిర్వహించాలన్నా కేంద్ర కమిటీ లేదా జోనల్, ఏరియా కమిటీ బాధ్యుల నాయకత్వంలోనే జరిగేవి. అందులో పాల్గొనే మావోయిస్టుల్లో కూడా ఎక్కువమంది పురుషులే ఉండేవారు. మహిళా మావోయిస్టులు ఉన్నా నేరుగా వారే ఆపరేషన్లో పాల్గొన్న ఘటనలు లేవనే చెప్పాలి. మావోయిస్టు ఆపరేషన్లో 150 మంది! తాజా ఘటనలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది మహిళా మావోయిస్టులేనని ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టి తెలుస్తోంది. ఘటనలో 60 నుంచి 70 మంది పాల్గొన్నట్టు చెబుతున్నప్పటికీ ఈ ఆపరేషన్లో సుమారు 150 మందికి ఉన్నట్టు సమాచారం. వీరంతా గ్రూపులుగా విడిపోయి కదలికలను పసిగట్టేందుకు వేర్వేరు ప్రాంతాల్లో మోహరించినట్టు సమాచారం. ఆజాద్ సోదరి అరుణ నేతృత్వం 2015లో కొయ్యూరు ఎన్కౌంటర్లో పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు అగ్రనేత అజాద్ సోదరి అరుణ అలియాస్ వెంకట రవి చైతన్య ఈ ఆపరేషన్కు నాయకత్వం వహించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను బట్టి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దగ్గరి నుంచి కాల్చింది కూడా అరుణగానే భావిస్తున్నారు. అరుణ ఈ ఘటనలో క్రియాశీలకంగా వ్యవహరించిందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న ఆమె పలు ఆపరేషన్స్లో పాల్గొన్నప్పటికీ నేరుగా ఆపరేషన్కు నాయకత్వం వహించింది మాత్రం ఇదే మొదటిసారని చెబుతున్నారు. -
ఆ మావోయిస్టులలో 70% మహిళలే!
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో దాడిచేసి, 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న మావోయిస్టులలో.. 70 శాతం మంది మహిళలే ఉన్నారట. భారీ స్థాయిలో ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లలాంటి అత్యాధునిక ఆయుధాలతో కూడిన 300-400 మంది వరకు మావోయిస్టులు సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దక్షిణ బస్తర్ ప్రాంతంలోని కాలాపత్తర్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ భీకర దాడి మొదలైంది. గిరిజన ప్రాంతాలకు రవాణా సదుపాయం కల్పించేందుకు రోడ్లు వేస్తున్న బృందానికి రక్షణగా వచ్చిన సీఆర్పీఎఫ్ 74వ బెటాలియన్లో 25 మంది మావోయిస్టుల ఘాతుకానికి బలైపోయారు. మావోయిస్టులకు అనుకూలం చింతగుఫ - బుర్కపాల్ - భేజి ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి పట్టుంది. ఇక్కడ గతంలోనూ చాలా దాడులు జరిగి, పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. భౌగోళికంగా ఆ ప్రాంతం మావోయిస్టులకు అనుకూలంగా ఉంటుంది. రోడ్డు వేస్తున్న ప్రాంతం కొంత దిగువన ఉండటం.. ఎగువన గుట్టలు ఉండటంతో పైనుంచి దాడి చేసేవారికి ఆ గుట్టలు రక్షణగా ఉంటాయి. కింద ఉన్నవాళ్లు సులభంగా టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నివైపుల నుంచి కమ్ముకున్న మావోయిస్టులు హేండ్ గ్రనేడ్లు, ఆటోమేటిక్ రైఫిళ్లు, రాకెట్ లాంచర్లతో దాడులు చేసినట్లు తెలిసింది. నల్ల యూనిఫాంలు, అత్యాధునిక ఆయుధాలు ముందుగా తాము ఎంతమంది ఉన్నామో తెలుసుకోడానికి గ్రామస్తులను పంపారని, తర్వాత వచ్చినవారిలో ఎక్కువ మంది మహిళా మావోయిస్టులే ఉన్నారని వాళ్లంతా నల్లటి యూనిఫాంలు ధరించి ఏకే సిరీస్, అసాల్ట్ రైఫిళ్ల లాంటి అత్యాధునిక ఆయుధాలు తీసుకొచ్చారని గాయపడిన సీఆర్పీఎఫ్ జవాను ఒకరు చెప్పారు. ఇంతకుముందు సుక్మాకు పొరుగునే ఉన్న దంతేవాడ జిల్లాలో 2010 ఏప్రిల్ 96వ తేదీన జరిగిన దారుణమైన దాడిలో 75 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఒక ఛత్తీస్గఢ్ పోలీసు మరణించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- షుగర్ పేషెంట్స్ పళ్లు తినకూడదా? తింటే ఏవి తినాలి?
- పవన్ కల్యాణ్కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
Advertisement