Weed control
-
సమగ్ర కలుపు నిర్వహణ పద్ధతులు
కలుపు.. అంటే రైతులు ఆ పొలంలో ఆ పంట సాగు కాలంలో అవాంఛితంగా పెరుగుతున్న రకరకాల మొక్కలను కలుపు మొక్కలు అని పిలుస్తున్నాం. వేల సంవత్సరాల సుసంపన్న సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానం కలిగిన భారతీయ రైతాంగానికి ఒక్క గ్రాము కలుపు మందును వాడకుండా వ్యవసాయం చేసే వారసత్వం ఉంది. అయినా, ఆధునిక వ్యవసాయ పోకడల నేపథ్యంలో కలుపు మొక్కలను నియంత్రించే మందుల వినియోగం పెరిగిపోయింది. రసాయనిక లేదా పారిశ్రామిక వ్యవసాయం ఊపందుకున్నాక.. ఏదో ఒకటే పంటను పొలమంతా వేసి పండించే ఏక పంటల (మోనోకల్చర్) సాగు విస్తృతం అయిన తర్వాత.. గడ్డి లేదా కలుపు నిర్మూలన మందుల వాడకం పెరిగింది. అప్పటికి ఇది రైతుకు సులువైన పరిష్కారంగా, ఖర్చు తక్కువతో పూర్తయ్యే పనిగా తోచినప్పటికీ.. గడ్డి మందులకు అనేక రకాలుగా దుష్పరిణామాలు ఉంటాయని ప్రపంచ దేశాల అనుభవాలు చెబుతున్నాయి. మట్టిలో సూక్ష్మజీవరాశి నశించి వ్యవసాయం సమస్యల్లో పడుతుంది. గాలి, నీరు కలుషితమవుతుంది. మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుంది. పారాక్వాట్, గ్లైఫొసేట్ వంటి కలుపు మందుల వాడకంతో రైతులు, రైతు కూలీలు, వినియోగదార్లలో కేన్సర్లు, ప్రాణాంతక జబ్బులు ప్రబలుతున్నాయని చెప్పటానికి ప్రపంచ దేశాల్లో ఆధారాలకు కొదువ లేదు. కాబట్టి, రసాయనాలు చల్లకుండా కలుపు నిర్వహణపై భారతీయ వ్యవసాయ వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం అవసరమని కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విస్తరణకు గతంలో కన్నా ఎక్కువగా కృషి జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఇది ఒక అనివార్యం. కలుపు మందుల నిరోధకత, కలుపు మందులతో వ్యవసాయ – పర్యావరణ ప్రభావాలు, కలుపు మొక్కలపై ప్రాకృతిక దృక్పథం, సమగ్ర కలుపు నిర్వహణ పద్ధతులు ఏమిటో చర్చించటమే ఈ కథనం లక్ష్యం. కలుపు మొక్కల ‘ఉపయోగాలు’ మీకు తెలుసా! రైతులు సాగుచేసే పంటలతో సూర్యరశ్మి, తేమ, పోషకాల కోసం కలుపు మొక్కలు పోటీ పడుతుంటాయి. తద్వారా పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పంటకు తెగుళ్ళు, ఇతర చీడపీడలను కలిగిస్తాయని కూడా భావిస్తారు. కలుపు మొక్కలు మామూలు పంటలకన్నా చాలా ఎక్కువ మొత్తంలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి, చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని గడ్డి మొక్కలు రకాలు మొలకెత్తిన ఒక నెల కంటే తక్కువ సమయంలోనే విత్తనాల ఉత్పత్తిలో చివరి దశకు చేరుకోగలవు. ఇంకా కొన్ని కలుపు మొక్కలు అల్లెలోపతి (రసాయనాలను ఉత్పత్తి చేసే లక్షణం) ప్రభావాలను కూడా సృష్టిస్తాయి. తద్వారా ఆర్థికంగా రైతుకు ముఖ్యమైన పంటల పెరుగుదలకు సవాళ్లు విసురుతాయి. అవి మనం తీసుకునే నియంత్రణ చర్యల కంటే ఒక అడుగు ముందే ఉంటాయి!మనకు అవసరమైన పంట మొక్కల కన్నా వేగంగా పెరిగే ఈ కలుపు మొక్కలు వాటిని నియంత్రించటానికి మనం చేసే ప్రయత్నాలన్నింటినీ తప్పించుకుంటాయి. అన్నిటికంటే నష్టం కలిగించే వార్షిక కలుపు మొక్కలు బతికేది స్వల్పకాలమే కావచ్చు, కానీ వాటి విత్తనాలు మార్గం దీర్ఘ కాలం బతికి వుండి చాన్నాళ్ల తర్వాత కూడా మొలకెత్తుతాయి. అందువల్ల కలుపును పూర్తిగా నిర్మూలించడం దాదాపు అసాధ్యం అవుతోంది. ఒక సంవత్సరం విత్తనంతో ఏడు సంవత్సరాల పాటు కలుపు మొక్కలు మొలుస్తూనే ఉంటాయట. స్థానిక వాతావరణంలో పుట్టి పెరిగే కలుపు మొక్కలు కొన్నయితే, విదేశాల నుంచి వచ్చి చేరి స్థానిక మొక్కలకు చోటివ్వకుండా విపరీతంగా పెరిగిపోయే పార్థీనియం/ వయ్యారిభామ వంటి ప్రమాదకరమైన కలుపు మొక్కలు కొన్ని.కలుపు మొక్కల వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది. మట్టి పైపొరలో క్షీణించిన ఖనిజాలను భూగర్భం నుంచి పైపొర మట్టిలోకి తీసుకువచ్చి, పంట మొక్కలకు అందుబాటులో ఉంచుతాయి. కలుపు మొక్కలు గట్టి మట్టిపెడ్డలను విచ్ఛిన్నం చేసి నేలను గుల్లచేస్తాయి. తరువాత వేసే పంటల వేర్లు లోతుగా వెళ్లడానికి మార్గం సుగమం చేసాయి. సూక్ష్మజీవులకు మంచి వాతావరణాన్ని అందించడానికి అవి నేలను వదులుగా, పొరలుగా చేస్తాయి. తద్వారా నేలను సుసంపన్నం చేస్తాయి. నేల స్థితిగతులు ఎలా ఉన్నాయో, మట్టిలో పోషక లోపాలు ఏమిటో సూచిస్తాయి.భూమి లోతుల్లోకి వేర్లను చొప్పించే కలుపు మొక్కలు పోషకాలను తీసుకుంటూ.. పైపైన వేర్లతో ఉండే ఇతర జాతుల మొక్కలు కరువు బారిన పడకుండా తట్టుకునేలా దోహదం చేస్తాయి.సాగు చేసే పంటల వేర్లకు అందుబాటులో లేని పోషకాలను అందుకోవటానికి ‘సహచర పంటలు’గా కలుపు మొక్కలు సహాయపడతాయి.కలుపు మొక్కలు మట్టి పైపొరను కప్పి ఉంచటం ద్వారా ఆ మట్టి నుంచి ఖనిజాలు, పోషకాలు కొట్టుకుపోకుంగా నిల్వ చేస్తాయి, అందుబాటులో ఉంచుతాయి.కలుపు మొక్కల వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది. మట్టి పైపొరలో క్షీణించిన ఖనిజాలను భూగర్భం నుంచి పైపొర మట్టిలోకి తీసుకువచ్చి, పంట మొక్కలకు అందుబాటులో ఉంచుతాయి.కలుపు మొక్కలు గట్టి మట్టిపెడ్డలను విచ్ఛిన్నం చేసి నేలను గుల్లచేస్తాయి. తరువాత వేసే పంటల వేర్లు లోతుగా వెళ్లడానికి మార్గం సుగమం చేసాయి. సూక్ష్మజీవులకు మంచి వాతావరణాన్ని అందించడానికి అవి నేలను వదులుగా, పొరలుగా చేస్తాయి. తద్వారా నేలను సుసంపన్నం చేస్తాయి.నేల స్థితిగతులు ఎలా ఉన్నాయో, మట్టిలో పోషక లోపాలు ఏమిటో సూచిస్తాయి.భూమి లోతుల్లోకి వేర్లను చొప్పించే కలుపు మొక్కలు పోషకాలను తీసుకుంటూ.. పైపైన వేర్లతో ఉండే ఇతర జాతుల మొక్కలు కరువు బారిన పడకుండా తట్టుకునేలా దోహదం చేస్తాయి. సాగు చేసే పంటల వేర్లకు అందుబాటులో లేని పోషకాలను అందుకోవటానికి ‘సహచర పంటలు’గా కలుపు మొక్కలు సహాయపడతాయి. కలుపు మొక్కలు మట్టి పైపొరను కప్పి ఉంచటం ద్వారా ఆ మట్టి నుంచి ఖనిజాలు, పోషకాలు కొట్టుకుపోకుంగా నిల్వ చేస్తాయి, అందుబాటులో ఉంచుతాయి.నేలను కప్పి ఉంచుతూ సూర్యకాంతి నుంచి రక్షిస్తాయి. ప్రవహించే వాన నీరు, గాలుల వల్ల నేల కోతకు గురికాకుండా కలుపు మొక్కలు కాపాడతాయి. అనేక ప్రయోజనకరమైన కీటకాలు, మాంసాహారులు, పరాన్నజీవులు, పరాగ సంపర్కాని ఉపయోగపడే జీవులకు కలుపు మొక్కలు ఆహారాన్ని, ఆశ్రయాన్ని కల్పిస్తాయి.చాలా జంతువులకు, మానవులకు ఆహారంగా, ఔషధాలుగా ఉపయోగపడతాయి. వాటి ఔషధ విలువలు తెలియక మనం అవి కలుపు మొక్కలనుకొని నిర్మూలిస్తుంటాం.చాలా రకాల కలుపు మొక్కలు నిజానికి పుష్కలంగా పోషక విలువలను కలిగి వుంటాయి. సాగు చెయ్యని ఆకుకూరలుగా, మందు మొక్కలుగా వ్యవసాయ కుటుంబాలకు గొప్పగా దోహదపడతాయి. అలాగే కరువు సమయాల్లో ఆహారాన్ని కూడా అందిస్తాయి. వీటిలో చాలా వాటిని కొందరు గ్రామీణులు సేకరించి మార్కెట్లలో కూడా అమ్ముతారు.కేరళలోని వాయనాడ్ జిల్లాలో ‘థనల్’ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో, 83 రకాల ఆకుకూరలను (సాధారణంగా కలుపు మొక్కలుగా వర్గీకరించబడినవి) ఆ ప్రాంత ప్రజలు ఆహారంగా వినియోగిస్తున్నట్లు కనుగొన్నారు. వాటిలో 20 రకాలు వరి పొలాల్లో లభించాయి.ప్రకృతిలో అన్నీ మొక్కలే.. ‘కలుపు’ మొక్కల్లేవు! ప్రకృతి దృష్టికోణంలో ‘కలుపు మొక్కలు’ అనేవి ఉండవు. కలుపు అనేది మానవుల భావన. ఎందుకంటే మనం ఒక పంటను ΄పొలంలో పెంచుకుంటూ ఉంటే మనం కోరకుండా వాటంతట అవే పెరిగే మొక్కలను మనం ‘కలుపు మొక్కలు అని పిలుస్తున్నాం. అయితే, మనం కలుపు అనుకునే మొక్కలు ఒక ప్రత్యేక వాతావరణంలో, ప్రత్యేకమైన మట్టిలో కొన్ని కలుపు మొక్కలు పెరగడానికి ప్రకృతి సంబంధమైన కారణాలు అనేకం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటికి ప్రకృతిపరంగా ముఖ్యమైన పాత్రలు, విధులు ఉంటాయి. కలుపు మొక్కలు ప్రకృతిపరంగా బాగా అనుకూలతను కలిగి ఉంటాయి. మనం విత్తనాలు/మొక్కలు నాటి సాగు చేసే పంటలు జీవించడం కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఆ పొలంలోనే అనేక కలుపు మొక్కలు పెరగడానికి ఇదే కారణం. కొన్ని పరిస్థితులలో పంట మొక్కల కంటే కలుపు మొక్కలు మరింత దృఢంగా ఉంటాయి. కలుపు మొక్కలు సూక్ష్మమైన శక్తులు. అవి ప్రకృతి సమతుల్యతకు సహాయపడతాయి.అందుకనే, ‘నేలపై నియంత్రణ సాధించడంలో కలుపు మొక్కలు మానవ వైఫల్యాన్ని సూచిస్తాయి. ప్రజలు తప్పులు చేసిన చోట అవి సమృద్ధిగా పెరుగుతాయి. అవి మన తప్పులను, ప్రకృతి చేపట్టిన దిద్దుబాట్లను సూచిస్తాయి’ అంటారు అమెరికాకు చెందిన ప్రసిద్ధ బయోడైనమిక్ శాస్త్రవేత్త డా. ఎహ్రెఫ్రై డ్ ఫైఫర్.ఉదాహరణకు.. సియామ్ కలుపు మొక్క లేదా ఫ్లాస్ ఫ్లవర్ (క్రోమోలీనా ఒడోరాటా) అనేది ఒక భయంకరమైన కలుపు మొక్క. ఇది అడవులను అక్రమిస్తూ అక్కడ అనాదిగా సహజంగా పెరిగే మొక్కలు, చెట్ల జాతుల జీవవైవిధ్యాన్ని తగ్గించడానికి కారణమవుతుంది. అయితే, ఇది చెట్లు లేని వాలు ప్రాంతాల్లో పెరిగి, నేలను త్వరగా ఆక్రమించుకుంటుంది, ఇతర మొక్కలు పెరగడానికి అనుమతించదు. చాలా సందర్భాలలో, ఇది నేలను పట్టి ఉంచి, నేల కోతను నిరోధించే ఏకైక మొక్క. త్వరగా కుళ్ళిపోయే దాని ఆకులు తూర్పు భారతదేశంలో ఝుమ్ వ్యవసాయ పద్ధతిలో పండించే వివిధ రకాల పంటలకు మంచి ఎరువుగా ఉయోగపడుతుంటాయి. కొన్ని రకాల పోషకాలు లోపించిన నేలల్లో కొన్ని రకాల ప్రత్యేక కలుపు మొక్కలు పెరుగుతాయట. రైతులు సాగుచేసే పంటలతో సూర్యరశ్మి, తేమ, పోషకాల కోసం కలుపు మొక్కలు పోటీ పడుతుంటాయి. తద్వారా పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పంటకు తెగుళ్ళు, ఇతర చీడపీడలను కలిగిస్తాయని కూడా భావిస్తారు. కలుపు మొక్కలు మామూలు పంటలకన్నా చాలా ఎక్కువ మొత్తంలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి, చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని గడ్డి మొక్కలు రకాలు మొలకెత్తిన ఒక నెల కంటే తక్కువ సమయంలోనే విత్తనాల ఉత్పత్తిలో చివరి దశకు చేరుకోగలవు. ఇంకా కొన్ని కలుపు మొక్కలు అల్లెలోపతి (రసాయనాలను ఉత్పత్తి చేసే లక్షణం) ప్రభావాలను కూడా సృష్టిస్తాయి. తద్వారా ఆర్థికంగా రైతుకు ముఖ్యమైన పంటల పెరుగుదలకు సవాళ్లు విసురుతాయి. అవి మనం తీసుకునే నియంత్రణ చర్యల కంటే ఒక అడుగు ముందే ఉంటాయి! మనకు అవసరమైన పంట మొక్కల కన్నా వేగంగా పెరిగే ఈ కలుపు మొక్కలు వాటిని నియంత్రించటానికి మనం చేసే ప్రయత్నాలన్నింటినీ తప్పించుకుంటాయి. అన్నిటికంటే నష్టం కలిగించే వార్షిక కలుపు మొక్కలు బతికేది స్వల్పకాలమే కావచ్చు, కానీ వాటి విత్తనాలు మార్గం దీర్ఘ కాలం బతికి వుండి చాన్నాళ్ల తర్వాత కూడా మొలకెత్తుతాయి. అందువల్ల కలుపును పూర్తిగా నిర్మూలించడం దాదాపు అసాధ్యం అవుతోంది. ఒక సంవత్సరం విత్తనంతో ఏడు సంవత్సరాల పాటు కలుపు మొక్కలు మొలుస్తూనే ఉంటాయట. స్థానిక వాతావరణంలో పుట్టి పెరిగే కలుపు మొక్కలు కొన్నయితే, విదేశాల నుంచి వచ్చి చేరి స్థానిక మొక్కలకు చోటివ్వకుండా విపరీతంగా పెరిగిపోయే పార్థీనియం/ వయ్యారిభామ వంటి ప్రమాదకరమైన కలుపు మొక్కలు కొన్ని.కలుపు మందులకు నిరోధకతకలుపు మందుల మార్కెట్ మన దేశంలో 2025లో 393 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి 608 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. పెరుగుతున్న కలుపు కూలీల ఖర్చు తగ్గించుకోవటానికి రైతులు కలుపు మందులు చల్లుతున్నారు. అయితే, కలుపు కూలీల ఖర్చే కాదు మొత్తంగా సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. రైతు అధికంగా ఖర్చు పెట్టిన తర్వాత గిట్టుబాటు ధర లభించనప్పుడు కూలీల ఖర్చు భరించటం వారికి సమస్యగా మారుతోంది. కలుపు మందుల మార్కెట్లో సింహభాగం గ్లైఫోసేట్, 2,4–డి ఆక్రమిస్తున్నాయి. గ్లైఫోసేట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన వ్యవసాయ రసాయనం. 2024లో రైతులకు వచ్చిన ఆదాయంలో నేల కోసం పెట్టిన ఖర్చు వాటా 46.5%కు పెరిగిందని అంచనా. కలుపు మందును తట్టుకునే నిషిద్ధ బీటీ పత్తితో సహా వాణిజ్య పంటల విస్తరణ ఏటా 9.31% పెరుగుతున్నట్లు చెబుతున్నారు.కలుపు మందులు కొట్టినా కలుపు చనిపోకుండా నిరోధకత పెంచుకోవటం ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారింది. దీర్ఘకాలికంగా బీటీ పంటలను సాగుచేస్తున్న దేశాల స్థాయిలో మన దేశంలో ఇంకా నిరోధకత లేదు. అయినప్పటికీ, కలుపు మందును తట్టుకునే నిషిద్ధ పత్తి సాగు వ్యాప్తితో పెరుగుతున్న కలుపు మందుల వాడకం ఆందోళన కలిగిస్తున్నది. వరి పొలాల్లో కూలీలతో కలుపు తీసే పద్ధతిలో కూడా కలుపు మొక్కలు రంగు మార్చుకొని తప్పించుకుంటున్నాయి.మన దేశంలో కలుపు మందులకు నిరోధక శక్తిని పెంచుకున్న కలుపు మొక్కల సంఖ్య పెరుగుతున్నది. తట్టుకునే శక్తిని పెంచుకున్న కలుపు మొక్కలను లక్ష్యంగా చేసుకునే కొత్త కలుపు మందుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మొండి కలుపుపై చల్లటానికి అనేక కొత్త మందులు అభివృద్ధి చెందే క్రమంలో ఉన్నాయి. గ్లైఫోసేట్ కలుపు మందుకు 50కి పైగా కలుపు జాతులు ఇప్పుడు నిరోధకతను ప్రదర్శిస్తున్నాయి. పాత కలుపు మందులు పనిచేయకపోతే మరింత విషపూరిత కలుపు మందులను రైతులు వాడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది పొలంపై, పంటపై రసాయనాల భారాన్ని తీవ్రతరం చేస్తోంది. ఈ పొలాల్లో నుంచి నీరు పొంగి పొర్లిన సందర్భంలో నాచుకు, ఉభయచరాలకు ఈ రసాయనాలు హాని చేస్తాయి.ప్రాక్వాట్ అనే కలుపు మందు మట్టికి గట్టిగా అంటుకుంటుంది. అది పై పొరలలో ఉండి ఉత్పాదకతకు కీలకమైన నత్రజనిని స్థిరీకరించే మంచి బ్యాక్టీరియాకు హాని కలిగిస్తుంది. తక్కువ సాంద్రతలలో కూడా ఈ మందు జలచరాలు, తేనెటీగలు, ప్రయోజనకరమైన కీటకాలకు అత్యంత విషపూరితమైనది. 30 కంటే ఎక్కువ కలుపు జాతులు ఇప్పుడు దానికి నిరోధకతను సంతరించుకున్నాయి. అంటే, ఈ మందు కొట్టినా ఈ కలుపు మొక్కలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఎక్కువసార్లు పిచికారీ చేయటం వల్ల కలుపు మొక్కల రకాలు తట్టుకొని దీర్ఘకాలం బతికే జాతులుగా మారుతున్నాయి. ప్రాక్వాట్ నేల ఆరోగ్యాన్ని, వాన పాముల సంఖ్యను భారీగా తగ్గిస్తుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిషేధం విధించటం హర్షదాయకం. అదే విధంగా, 2,4 డిని 80 సంవత్సరాలకు పైగా ఉపయోగించిన తర్వాత 40 కంటే ఎక్కువ కలుపు జాతులు దానికి నిరోధకతను పెంచుకున్నాయి. పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలురసాయనిక కలుపు మందులకు అనేక పర్యావరణ హితమైన సమర్థ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కొందరు రైతులు కలసి సహకార యాజమాన్యంలో యంత్రాలతో కలుపుతీసే పద్ధతులతో పాటు సేంద్రియ/ప్రకృతి సేద్య మిశ్రమ పంటల సాగు పద్ధతులను అనుసరించవచ్చు. కలుపు మొక్కలు పెరగనీయకుండా అంతరాయం కలిగించే అంతర పంటలు, పంటల మార్పిడి, నేలను కప్పి వుంచే పంటలు సాగు చెయ్యటం, పంట వెయ్యటానికి ముందు పొలానికి నీటి తడి పెట్టి కలుపు మొలిచిన తర్వాత దుక్కి చేసి ఆ తర్వాత పంట వేసుకోవటం ద్వారా కలుపు సమస్యను అధిగమించటం వంటి అనేక పద్ధతులు కలుపు మందులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఈ పద్ధతులు కలుపు మొక్కలను అణచివేయటం, నేల ఆరోగ్యాన్ని పెంపొందించటంతో పాటు విలువైన పర్యావరణ సేవలను అందిస్తాయని గుర్తించడం అవసరం.ఎద్దులతో గుంటకలు తోలి కలుపు నివారించే సాధనాలను ఉపయోగించే సాంప్రదాయ పద్ధతులు, కోనో–వీడర్లు, రోటరీ వీడర్లు, సైకిల్ వీడర్లు వంటి ఆధునిక ఆవిష్కరణలతో కలిపి సమర్థవంతమైన కలుపు తొలగింపు మార్గాలను అనుసరించవచ్చు. దానితో పాటు ఈ పనుల ద్వారా మట్టి లోపలికి గాలిని ప్రసరింపజేయటం, తెగుళ్లు కలిగించే పురుగుల జీవిత చక్రాలకు అంతరాయం కలిగించటం, కలుపు మొక్కలను పచ్చి రొట్ట ఎరువుగా తయారుచేసి నేలలో కలపటం ఈ పద్ధతుల్లో సాధ్యపడుతుంది. తద్వారా రసాయన ఉత్పాదకాలపై ఆధారపడకుండా బహుళ వ్యవసాయ ప్రయోజనాలను ఈ పద్ధతులు సాధిస్తాయి.అంతేకాదు, ఈ విధానాలు రైతు స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేస్తాయి. గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. తరతరాల పర్యావరణ జ్ఞానాన్ని కాపాడతాయి. నేల సారానికి నష్టం చేయకపోగా పెంపొందిస్తాయి. విషం లేని ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి.రసాయనాలు లేకుండా కలుపు మొక్కలను నియంత్రించటం అనేది సాంకేతికమైన విషయమా లేదా రాజకీయ, ఆర్థిక విషయమా అనేది ప్రాథమిక ప్రశ్న. వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు పర్యావరణ మార్పును తట్టుకునే స్థితిని కల్పించటానికి ఉపయోగపడే వ్యవసాయ పర్యావరణ శాస్త్రం అభివృద్ధిపై భారతదేశం పెట్టుబడి పెడుతుందా లేదా రసాయనాల వాడకాన్ని పెం΄÷ందించే పద్ధతులను ప్రోత్సహిస్తుందా అన్నది కాలం తేల్చాల్సిన విషయం.హెక్టారులో 40 కోట్ల పార్థీనియం విత్తనాలు!ఒక పార్థీనియం మొక్క 15 వేల నుంచి 20 వేల విత్తనాలను ఉత్పత్తి చేయగలదు. ఇది పొలంలోనే లేదా నేలలోనే ఒక భారీ, నిరంతర విత్తన బ్యాంకు ఏర్పడటానికి దారి తీస్తుంది. హెక్టారు భూమిలో విత్తనాల దశ వరకు పార్థీనియం మొక్కలను పెరగనిస్తే ఆ పొలంలో 40 కోట్ల విత్తనాలు తయారు చేసినట్లే. అవి మైళ్ళ దూరం ప్రయాణించి, అనేక దశాబ్దాల పాటు జీవిస్తాయి. అవి మానవులను, జంతువులను అంటుకొని ప్రయాణిస్తాయి. మరికొన్ని మన పొలాల్లో వాలే పక్షుల ద్వారా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి.చాలా ఏళ్లపాటు బతికే కలుపు మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా వేర్ల ద్వారా, ఊడల్లాంటి (రన్నర్లు లేదా స్టోలన్) తీగల ద్వారా వ్యాప్తిచెందుతాయి. తెల్ల క్లోవర్ కలుపు మొక్క 50 మీటర్ల పొడవున తీగను పాకించగలదు. వేరు దుంపల ద్వారా కొన్ని కలుపు మొక్కలు నిరంతరం విస్తరిస్తూ ఉంటాయి. హార్స్టెయిల్ వేరు దుంపలు 5 మీటర్ల లోతులో 100 మీటర్ల దూరం వరకు చొచ్చుకెళ్లి మొక్కల్ని మొలిపించగలదు. నేలపై ఒక చోట కలుపు మందుతోనో, చేతితోనే తీసేసి నిర్మూలించినా నేలలో దుంప నుంచి మళ్లీ పెరుగుతూనే ఉంటుందన్న మాట. చాలా కలుపు మొక్కలు లోతైన వేర్లను కలిగి ఉంటాయి. ఇవి కొమ్మలు, రెమ్మలను తొలగించినప్పుడు కూడా పునరుత్పత్తి చేయగలవు. ఆక్సాలిస్ జాతి దుంప రకం కలుపు మొక్క ఒక సీజన్లో 6900 మొక్కలుగా పెరుగుతుంది. నేలకు కరుచుకొని, పొట్టిగా, పాకుతూ పెరుగుతుండటం వలన యంత్రాలతో వీటిని తొలగించినప్పటికీ తప్పించుకుని బతుకుతాయి. -
రైతుకు చేదోడుగా మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్
పంటసాగులో రైతన్నకు కలుపు సవాలుగా మారుతున్న నేపథ్యంలో ఈ సమస్యను కట్టడి చేసేందుకు కొన్ని కంపెనీలు కలుపు మందులు తయారు చేస్తున్నాయి. పంటపోలాల్లో కలుపు తొలగించేందుకు కూలీల ఖర్చులు పెరుగుతున్న తరుణంలో గోద్రేజ్ కంపెనీ అశితాకా పేరుతో కలుపు మందును ఆవిష్కరించింది. ఇది మొక్కజొన్న సాగులో పంట నష్టం వాటిల్లకుండా కలుపు నివారణకు ఎంతో ఉపయోగపడుతుందని గోద్రేజ్ ఆగ్రోవెట్ సీఈఓ(క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్) ఎన్కే రాజావేలు తెలిపారు.‘మొక్కజొన్న పంటలో గడ్డి, పెద్ద ఆకులతో ఉన్న కలుపు మొక్కలను నివారించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గడ్డి జాతి మొక్కలు 2-4 ఆకుల వచ్చిన దశలో ఉన్నప్పుడు మరింత సమర్థంగా పని చేస్తుంది. ఈ మందును నేరుగా పంటపై స్ప్రే చేసుకోవచ్చు. నిబంధనలకు తగినట్లు తగిన మోతాదులో దీన్ని ఉపయోగించి కలుపు నివారించుకోవచ్చు. స్ప్రే చేసే క్రమంలో గాలికి పంటపై మందు పడినా మొక్కజొన్నకు నష్టం జరగదు. ఎక్కువకాలం జీవించి, తిరిగి పెరిగే కలుపు జాతులపై ఇది ఎంతో ప్రభావం చూపుతుంది. 400 ఎంఎల్ సర్ఫక్టెంట్తోపాటు 50 ఎంఎల్ అశితాకా కలిపి ఎకరాకు పిచికారి చేసుకోవాలి’ అని రాజావేలు చెప్పారు.వర్షాభావ ప్రాంతాల్లో హెచ్చుతగ్గులకు లోనయ్యే రైతుల ఆదాయాన్ని స్థిరంగా వృద్ధి చెందించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని కంపెనీ జీఎం(మార్కెటింగ్) అనిల్ చౌబే తెలిపారు. దేశవ్యాప్తంగా మొక్కజొన్న అధికంగా పండించే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ముందుగా ఈ ప్రొడక్ట్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. సమీప భవిష్యత్తులో దీన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు.ఇదీ చదవండి: టాప్ కంపెనీలో 2,800 ఉద్యోగాలు కట్ -
ఆకు రసాలతోనే కలుపు నిర్మూలన!
కలుపు మందు అంటే.. రసాయనిక కలుపు మందులే ఇటు శాస్త్రవేత్తలు, అటు రైతుల మదిలో మెదులుతాయి. అయితే, కొన్ని రకాల రసాయనిక కలుపు మందులు కేన్సర్ కారకాలని తేలటంతో సేంద్రియ కలుపు మందుల ఆవశ్యకత ఏర్పడింది. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయంలో కలుపు యాజమాన్యం సమస్యాత్మకంగా మారిన నేపథ్యంలో గ్రామీణ ఆవిష్కర్తలు రసాయనాల్లేని కలుపు మందును ఆవిష్కరించటం, దీనిపై శాస్త్రవేత్తల బృందం పండ్ల తోటలు, ఖాళీ భూముల్లో క్షేత్రస్థాయి ప్రయోగాలకు ఉపక్రమించటం హర్షదాయం. రైతు కుటుంబంలో పుట్టిన గళ్లా చంద్రశేఖర్ తదితర గ్రామీణ ఆవిష్కర్తల బృందం చాలా ఏళ్లుగా స్వతంత్రంగా పరిశోధనలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి దగ్గరలోని కారాకొల్లు గ్రామానికి చెందిన వీరు తమ గ్రామ పరిసరాల్లో వుండే రకరకాల మొక్కలతో పంటలపై చీడపీడల నివారణకు ఏమైనా అవకాశం ఉందా అనే రీతిలో సొంత ఖర్చుతోనే పరిశోధనలు కొనసాగించారు. ఈ బృందంలో చంద్రశేఖర్తోపాటు చిరంజీవులు, భాస్కర్, బత్తినాయుడు, మురళి, వెంకటేశ్వర్లు, శివ, శ్రీధర్ ఉన్నారు. ఈ పరిశోధనల క్రమంలో గతంలో ఆకురసాలతో నులిపురుగుల నిర్ములన ద్రావణం తయారు చేయటం వంటి అనేక ఆవిష్కరణలను వెలువరించారు. హెర్బల్ కలుపు మందు కొన్ని రకాల మొక్కల రసాలు కలుపు మొక్కల మీద వేసినప్పుడు అవి చనిపోయాయి. ఆ విధంగా పరిశోధించి కలుపు నిర్మూలన మందును కనుగొన్నామని ఇన్నోవేటర్ చంద్రశేఖర్ ‘సాక్షి’తో చెప్పారు. ‘రసాయనిక కలుపు మందులు చల్లితే కలుపు చనిపోయినా అవి ప్రధాన పంట పెరుగుదలను కొన్ని రోజుల పాటు నిరోధిస్తున్నాయి. కానీ, ఆకురసాలతో తాము తయారు చేసిన కలుపు మందు వల్ల కలుపు నిర్మూలన జరగడమే కాకుండా పంట ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుందని, 15–20 శాతం అధికంగా దిగుబడి వస్తుండటం గమనించాం..’ అని ఆయన వివరించారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ప్రయోగాలు రైతులకు ఉపకరించే గ్రామీణ ఆవిష్కరణలను ఎంపిక చేసి, వాటి పనితీరుపై వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయటం ద్వారా ఆ ఆవిష్కరణలను మరింత పరిపుష్టం చేసి, విస్తృతంగా రైతాంగానికి అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో ‘రఫ్తార్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇంక్యుబేషన్ విభాగం ఉంది. ‘పండ్ల తోటల్లో, బంజరు, ఖాళీ భూముల్లో కలుపును నిర్మూలించే కలుపు మందును ఆకు రసాలతో చంద్రశేఖర్, ఆయన మిత్రులు రూపొందించి, మాకు చూపించారు. ఇది మంచి ఫలితాలనే ఇస్తున్నప్పటికీ, మరింత లోతుగా పరిశోధించాల్సిన అవసరం ఉంది అని ‘రఫ్తార్’ ఇంక్యుబేషన్ విభాగం ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డా. పోలు బాలహుస్సేన్ రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. కలుపు యాజమాన్య నిపుణులు, సీనియర్ శాస్త్రవేత్తలు డా. మహేశ్వరరెడ్డి, డా. సుబ్రమణ్యం పర్యవేక్షణలో ఈ కలుపు మందు పనితీరుపై మరింత లోతైన పరిశోధనకు ఇటీవలే శ్రీకారం చుట్టామన్నారు. కలుపు మొక్కలపై ఈ మందును ప్రయోగించి ఫలితాలను అనేక కోణాల్లో నమోదు చేస్తామన్నారు. దీని ఉత్పాదక వ్యయాన్ని తగ్గిం^è డంపై కూడా దృష్టి సారిస్తున్నామని డా. పోలు బాలహుస్సేన్ రెడ్డి వివరించారు. అన్నీ సవ్యంగా జరిగితే.. కొద్ది నెలల్లో తక్కువ ధరలోనే ప్రకృతికి నష్టం కలిగించని హెర్బల్ కలుపు మందు రైతులకు అందుబాటులోకి వస్తుంది. విషరసాయనాలతో కూడిన కలుపు మందులను పూర్తిగా వదిలించుకునే దిశగా విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని ఆశిద్దాం. గ్రామీణ ఆవిష్కర్తల బృందానికి ‘సాక్షి సాగుబడి’ జేజేలు పలుకుతోంది. ఇది సమర్థవంతంగా పనిచేస్తోంది చంద్రశేఖర్ బృందం తయారు చేసిన హెర్బల్ కలుపు మందు వినూత్నమైన ఆవిష్కరణ. ఇది పండ్ల తోటల్లో, బంజరు భూములు, ఖాళీ స్థలాల్లో వాడటానికి ఉద్దేశించినది. ఇది నాన్ సెలక్టివ్, కాంటాక్ట్ హెర్బిసైడ్. ఇది ఏ మొక్క మీద పడితే ఆ మొక్క చనిపోతుంది. పంట మొక్కలు సహా ఏ మొక్కనైనా చంపేస్తుంది. ప్రాధమిక పరిశీలనలో ఇది సమర్థవంతంగా∙పనిచేస్తున్నట్లు గ్రహించాం. అయితే, క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తున్నదీ అనేక కోణాల్లో పరీక్షించదలచాం. ‘రఫ్తార్’ ప్రోగ్రామ్లో భాగంగా ఇద్దరు కలుపు శాస్త్ర నిపుణుల పర్యవేక్షణలో అందుకు ఏర్పాట్లు చేశాం. రూ. 6 లక్షల నిధుల కేటాయింపు కూడా జరిగింది. ఇది ఏయే కలుపు మొక్కలపై, ఎంత ఉష్ణోగ్రత ఉన్నప్పుడు పనిచేస్తుంది? వర్షం పడినప్పుడు, మబ్బులు ఉన్నప్పుడు పనిచేస్తుందా లేదా? దీని ప్రభావం ఎన్ని రోజులుంటుంది? వర్షం వచ్చిన వారం తర్వాత ప్రభావం చూపుతుందా? ఇలాంటి విషయాలన్నిటినీ 6–9 నెలల్లో పరిశీలిస్తాం. ఇప్పుడైతే దీని ధర ఎక్కువగా ఉంది. ధర తగ్గించగలిగే మార్గాలేమిటో కూడా పరిశీలిస్తాం. ఈ హెర్బల్ కలుపు మందును రైతులు పండ్ల చెట్ల మీద పడకుండా జాగ్రత్తగా చల్లుకోవాలి. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులకు ఈ కలుపు మందు ఉపయోగపడుతుంది. – డా. పోలు బాలహుస్సేన్ రెడ్డి(98484 20373), ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, రఫ్తార్ ప్రోగ్రామ్, ఇంక్యుబేషన్ సెంటర్, ఆర్.ఎ.ఆర్.ఎస్., తిరుపతి తొలి హెర్బల్ కలుపు మందు! కేవలం 3 రకాల ఆకుల రసాలతోనే ఈ కలుపు మందును తయారు చేశాం. కెమికల్స్ కలప లేదు. పండ్ల తోటల్లో చెట్ల మధ్య ఖాళీలో, ఖాళీ భూముల్లో కలుపు మొక్కలపై వాడి చూశాం. ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇదే తొట్టతొలి హెర్బల్ కలుపు మందు. పండ్ల తోటల్లో కలుపు నిర్మూలనకు ఇది బాగా పని చేస్తోంది. కానీ ఎకరాకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చవుతోంది. ఇంత ఖర్చు రైతులు భరించ లేరు. కాబట్టి ఈ ఖర్చు తగ్గించడానికి తిరుపతిలోని వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారం తీసుకుంటున్నాం. ‘రఫ్తార్’ కార్యక్రమంలో భాగంగా తదుపరి దశ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఇది పూర్తయ్యాక రైతులకు అందుబాటులోకి తెస్తాం. – గళ్లా చంద్రశేఖర్ (98495 41674), గ్రామీణ ఆవిష్కర్త, కారాకొల్లు, చిత్తూరు జిల్లా – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
రోహిణీలోనే దేశీ వరి
దేశీ వరి విత్తనాలను ఇంటి ఆహారపు అవసరాల కోసం కనీసం ఒక ఎకరంలో నైనా వేసుకొంటే మంచిదని, దేశీ వరి విత్తనాలను ఆరు తడి పద్ధతిలో మామూలు పద్ధతితో పోల్చితే 10 శాతం నీటితోనే సాగు చేయవచ్చని ప్రకృతి వ్యవసాయదారుడు, సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు విజయరామ్ తెలిపారు. ఈ పద్ధతిలో 90 శాతం నీటిని ఆదా చేయవచ్చు. కలుపు నియంత్రణ కోసం మొక్కకు మొక్కకు దూరం, అలానే వరుసకు, వరుసకు మధ్య దూరం 45 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలి. ఆరు తడి పద్ధతిలో వరిలో అంతర పంటలను కూడా వేయవచ్చు. అలా వేద్దాం అనుకున్న వారు మొక్కకు మొక్కకు దూరం, అలానే వరుసకు, వరుసకు మధ్య దూరం 60 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలన్నారు. 180 నుంచి 210 రోజుల పంట కాలం ఉండే వరి రకాలు (మా పిళ్లై సాంబ, మొలగొలుకులు, మడుమురంగి లాంటివి) రోహిణి కార్తె (మే 25 నుంచి ప్రారంభం)లో నాట్లు వేసుకుంటేనే అనుకూలం. అలా అయితేనే 2వ పంటకు వీలు దొరుతుందన్నారు. జనవరి ఆఖరు లోపు నేల స్వభావం, నీటి వసతిని బట్టి పుచ్చకాయ, దోస, కూరగాయలు, నువ్వులు లేక పశుగ్రాసపు పంటలు వేసుకోవచ్చు. కొత్తగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మొదట ఏడాది ఒక ఎకరంలో మాత్రమే ఈ పద్ధతిని అనుసరించాలన్నారు. దేశీ వరి విత్తనాలతో మొదటి సంవత్సరం దిగుబడి 10 బస్తాల నుండి 20 బస్తాల వరకు రావచ్చని, తదుపరి కొంత పెరుగుతుందన్నారు. కేవలం వరిని మాత్రమే కాకుండా పప్పు ధాన్యాలు, కూరగాయలు, నూనె గింజలు పండించే ప్రయత్నమూ చేయాలి. వర్షము పడినప్పుడు పొలములో కొన్ని రోజుల వరకూ నీరి నిలిచిపోయే పరిస్థితి ఉన్న వారు (మాగాణి భూముల వారు, కోస్తా ప్రాంతాల వారు) కనీసం 200 గజాల స్థలంలోనైనా 2 అడుగుల ఎత్తులో మట్టిని వేసి ఇంటి అవసరాల కోసం కూరగాయలు పెంచుకోవాలన్నారు. దేశీ వరి విత్తనాలను పండించే రైతులు ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఉన్నారని, వారి దగ్గరి నుంచి విత్తనాలు తీసుకోవచ్చని విజయరామ్ వివరించారు. వివరాలకు హైదరాబాద్లోని సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం కేంద్ర కార్యాలయానికి (04027654337 , 04027635867) ఫోన్ చేయవచ్చు. పొద్దున 10 గం. నుంచి సా. 6 గం. వరకు. గురువారం సెలవు. -
కలుపుతోనే కలుపు నిర్మూలన!
ఏ పంటకైనా కలుపు సమస్యే. కలుపు నివారణకు సంప్రదాయకంగా కూలీలతో తీయించడం లేదా గుంటక తోలటం చేస్తుంటారు. అయితే, కొద్ది సంవత్సరాలుగా కూలీల కొరత నేపథ్యంలో కలుపు నిర్మూలనకు రసాయనిక కలుపు మందుల పిచికారీ పెరిగిపోయింది. గ్లైఫొసేట్ వంటి అత్యంత ప్రమాదకరమైన కలుపు మందుల వల్ల కేన్సర్ వ్యాధి ప్రబలుతోందని నిర్థారణ కావడంతో ప్రభుత్వాలు కూడా దీని వాడకంపై తీవ్ర ఆంక్షలు విధించడం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో కొందరు ప్రకృతి వ్యవసాయదారులు సేంద్రియ కలుపు మందులపై దృష్టిసారిస్తున్నారు. కలుపుతోనే కలుపును నిర్మూలించవచ్చని ఈ రైతులు అనుభవపూర్వకంగా చెబుతుండటం రైతాంగంలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఒక పొలంలో ఏవైతే కలుపు రకాలు సమస్యగా ఉన్నాయో.. ఆ కలుపు మొక్కలు కొన్నిటిని వేర్లు, దుంపలతో సహా పీకి, ముక్కలు చేసి, పెనం మీద వేపి, బూడిద చేసి దానికి పంచదార, పాలు కలిపి మురగబెడితే తయారయ్యే ద్రావణాన్ని ‘గరళకంఠ ద్రావణం’ అని పిలుస్తున్నారు. ఈ ద్రావణాన్ని పొలం అంతటా పిచికారీ చేస్తే.. చల్లిన 12 రోజుల నుంచి 30 రోజుల్లో కలుపు మొక్కలు ఎండిపోతున్నాయని చెబుతున్నారు. ఈ ద్రావణంలో కలపని మొక్కలకు అంటే.. పంటలకు ఈ ద్రావణం వల్ల ఏమీ నష్టం జరగక పోవడం విశేషం. సీజన్లో రెండుసార్లు ఇలా కలుపు మొక్కల బూడిద నీటిని చల్లితే కలుపు తీయాల్సిన లేదా కలుపు మందులు చల్లాల్సిన అవసరమే ఉండదని ఈ రైతులు నొక్కి చెబుతున్నారు. ఇది తాము కనిపెట్టిన పద్ధతి కాదని, 6వ శతాబ్దం నాటి ‘వృక్షాయుర్వేదం’లో పేర్కొన్నదేనంటున్నారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి, భూసారానికి హాని కలిగించని ‘కలుపుతోనే కలుపును నిర్మూలించే పద్ధతి’పై రైతుల అనుభవాలు వారి మాటల్లోనే.. ‘సాగుబడి’ పాఠకుల కోసం..! ఇరవై రోజుల్లో కలుపు మాడిపోతుంది! నా పేరు మర్కంటి దత్తాద్రి (దత్తు). ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ఎన్.ఐ.ఆర్.డి. ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లి సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇచ్చి వస్తూనే.. నా వ్యవసాయం నేను చేసుకుంటున్నాను. ఈ ఏడాది పత్తి చేనులో కలుపు బాగా పెరిగింది. వృక్షాయుర్వేదంలో చెప్పినట్టు ఆచరించి ఫలితాలు పొంది సీనియర్ రైతులు మేకా రాధాకృష్ణమూర్తి, కొక్కు అశోక్ కుమార్ సూచించిన విధంగా నేను కలుపు మొక్కల బూడిద ద్రావణంతో నా ఎకరం పత్తి చేనులో కలుపును విజయవంతంగా నిర్మూలించుకుంటున్నాను. జూలై 15న ఈ ద్రావణాన్ని పత్తి పంటలో పిచికారీ చేశాను. నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి. అలాగే జూలై 15వ తేదీన పిచికారీ చేశాను. ఫలితాలు చాలా బాగున్నాయి. గడ్డి జాతి కలుపు మొక్కలు తొందరగా మాడిపోతున్నాయి. వెడల్పు ఆకులు/ వేరు వ్యవస్థ బలంగా ఉన్న మొక్కలు కొంచెం నెమ్మదిగా చనిపోతున్నాయి. మామూలుగా గరిక పీకినా రాదు. ఈ ద్రావణం చల్లిన ఆరో రోజు తర్వాత పట్టుకొని పీకగానే వస్తుంది. అప్పటికే దాని వేరు వ్యవస్థ మాడిపోయి ఉంది. 8–12 రోజుల నుంచి మొండి జాతుల కలుపు మొక్కలు చనిపోతాయి. కలుపు మొక్కల బూడిద ద్రావణం తయారీ ఇలా.. ఎకరం పత్తి చేను కోసం నేను ద్రావణం తయారు చేసుకున్న విధానం ఇది.. గరిక, బెండలం, వయ్యారిభామ, గూనుగ అనే నాలుగు రకాల కలుపు మొక్కలను.. రకానికి కిలో చొప్పున వేర్లు, దుంపలతో సహా పచ్చి మొక్కలను పీకి, మట్టిని కడిగేయాలి. నీటి తడి ఆరిపోయే వరకు కొద్దిసేపు ఆరబెట్టి.. ముక్కలు చేసి.. పెనం మీద వేసి.. బూడిద చేశాను. ఇలా తయారు చేసిన బూడిద 200 గ్రాములు, చక్కెర 200 గ్రాములు, లీటరు ఆవు పాలు కలిపితే.. నల్లటి ద్రావణం తయారవుతుంది. దీన్ని రెండు రోజులు బాగా, అనేకసార్లు కలియదిప్పాలి. మిక్సీలో పోసి.. తిప్పాలి. లేదా కవ్వంతో బాగా గిలకొట్టాలి. మూడో రోజు ఈ ద్రావణాన్ని.. ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల నీటిలో ఈ ద్రావణాన్ని కలిపి.. 2 రోజులు బాగా కలియబెడుతూ మురగబెట్టాలి. నీరు నీలి రంగుకు మారుతుంది. 3వ రోజు ఈ నీటిని నేరుగా కలుపుతో నిండిన పొలంలో పవర్ స్ప్రేయర్తో కలుపు మొక్కలు నిలువెల్లా బాగా తడిచి వేర్లలోకి కూడా ద్రావణం నీరు చేరేలా పిచికారీ చేయాలి. దీన్ని పిచికారీ చేసేటప్పుడు కచ్చితంగా భూమిలో తేమ ఉండాలి. తేమ లేనప్పుడు పిచికారీ చేస్తే దీని ప్రభావం ఉండదు. పంట కాలంలో రెండు సార్లు పిచికారీ చేసుకుంటే.. ఏయే రకాల కలుపు మొక్కలను పీకి మసి చేసి ద్రావణం తయారు చేసి వాడామో.. ఆయా రకాల కలుపు జాతుల నిర్మూలన అవుతుంది. ఇంకా మిగిలిన రకాలేమైనా ఉంటే.. వాటితో మరోసారి ద్రావణం తయారు చేసి చల్లితే.. అవి కూడా పోతాయి. ఆ భూమిలో పంటలకు ఎటువంటి హానీ ఉండదు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రధాన, అంతర పంటల మొక్కలను ఈ ద్రావణంలో వాడకూడదు. ఒక్కోసారి కలుపు మొక్కల విత్తనాలు గాలికి కొట్టుకు వచ్చి పడినప్పుడు, ఆ రకాల కలుపు మళ్లీ మొలవొచ్చు. అలాంటప్పుడు మరోసారి ద్రావణం తయారు చేసి వాడాలి. ప్రమాదకరమైన రసాయనిక కలుపు మందులు చల్లకుండానే కలుపు సమస్య నుంచి ఈ గరళకంఠ ద్రావణంతో నిస్సందేహంగా బయటపడొచ్చు. ఇది నా అనుభవం. ఒకసారి ఏవైనా తప్పులు జరిగితే, ఫలితాలు పూర్తిగా రావు.. అలాంటప్పుడు మళ్లీ ప్రయత్నించండి. చల్లిన తర్వాత ఫలితాలు పూర్తిగా కంటికి కనపడాలంటే.. కనీసం 20 రోజులు వేచి ఉండాలి. గరళకంఠ ద్రావణంతో కలుపు నిర్మూలన అద్భుతంగా జరుగుతుంది. లేత కలుపు మొక్కలను త్వరగా నిర్మూలించవచ్చు. ముదిరిన కలుపు మొక్కల నిర్మూలనకు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. బాగా ముదిరి విత్తనం వచ్చిన కలుపు మొక్కల నిర్మూలన కష్టం. – మర్కంటి దత్తాద్రి (దత్తు) (80084 84100), సేంద్రియ పత్తి రైతు, విఠోలి, ముదోల్ మండలం, నిర్మల్ జిల్లా (ఫొటోలు: బాతూరి కైలాష్, సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్) వయ్యారి భామ, తుంగ, గరిక నిర్మూలన! ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అరెకరంలో ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ.. కలుపు నిర్మూలనకు గరళకంఠ ద్రావణం పిచికారీ చేశాను. ఏ కలుపు రకాలను తీసుకొని, బూడిద చేసి చల్లానో ఆ రకాల కలుపు మొక్కలన్నీ నూటికి నూరు శాతం చనిపోయాయి. తుంగ, గరికతోపాటు వయ్యారిభామ కూడా చనిపోయాయి. అయితే, కలుపు మొక్కలను పీకి బూడిద చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పంటకు సంబంధించిన మొక్కలు కలవకుండా చూసుకోవాలి. అవి కూడా కలిస్తే ఈ ద్రావణం చల్లినప్పుడు పంట కూడా చనిపోతుంది. పిచికారీ చేసిన 48 గంటలు దాటాక.. వేర్ల దగ్గర నుంచి ప్రభావం కనిపించింది. కలుపు ఎదుగుదల అప్పటి నుంచే ఆగిపోయింది. 20–30 రోజుల్లో కలుపు మొక్కలు చనిపోయాయి. ఆ పంట కాలంలో ఆ కలుపు మళ్లీ పుట్టదు. – తుపాకుల భూమయ్య (96767 18709), జూలపల్లి, పెద్దపల్లి జిల్లా చిన్న, పెద్ద రైతులెవరైనా అనుసరించవచ్చు! కలుపు మొక్కలతో తయారు చేసిన గరళకంఠ ద్రావణంతో ప్రధాన పంట మొక్కలకు ఎటువంటి హానీ జరగదు. కలుపు మొక్కలు వేర్ల నుంచి మురిగిపోతాయి. కొద్ది రోజుల్లోనే పెరుగుదల ఆగిపోయి.. కలుపు మొక్కలు ముట్టుకుంటే ఊడిపోతాయి. తర్వాత కొద్ది రోజులకు ఎండిపోతాయి. ఎన్ని ఎకరాలకైనా బెల్లం వండే బాండీల్లో/పాత్రల్లో ఒకేసారి భారీ ఎత్తున కలుపు బూడిదను తయారు చేసుకొని.. దానితో ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది చిన్న, పెద్ద రైతులు ఎవరైనా ఆచరించదగిన ఖర్చులేని, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని లేని కలుపు నిర్మూలన పద్ధతి అని అందరూ గుర్తించాలి. కలుపు మొక్కల బూడిదను ఎప్పటికప్పుడు వాడుకోవాలన్న నియమం ఏమీ లేదు. ఈ బూడిదను నిల్వ చేసుకొని.. ఆ తర్వాతయినా వాడుకోవచ్చు. – కొక్కు అశోక్కుమార్ (98661 92761), సేంద్రియ రైతు, జగిత్యాల తుంగ వేర్లు 3 రోజుల్లో మాడిపోతాయి! 2011 నుంచి ప్రకృతి వ్యవసాయంలో వరి, తదితర పంటలు పండిస్తున్నాను. వరిలో తుంగ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. వృక్షాయుర్వేదంలో చెప్పిన ప్రకారం.. కలుపును కలుపుతోనే నిర్మూలించడం సాధ్యమేనని అనుభవపూర్వకంగా మేం తెలుసుకున్నాం. తుంగ, గరిక వంటి కలుపును సమర్థవంతంగా నిర్మూలించాను. కిలో తుంగ గడ్డలతో సహా వేర్లు, మొక్కలు మొత్తం పీకి.. వేర్ల మట్టిని కడిగి.. పెనం మీద కాల్చి బూడిద చేయాలి. 100 గ్రా. కలుపు మొక్కల బూడిద, 100 గ్రా. పంచదార, అర లీటరు నాటావు పాలు కలిపి.. రెండు రోజులు తరచూ కలియదిప్పుతూ ఉండాలి. 2 రోజుల తర్వాత ఆ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి మరో రెండు రోజులు పులియబెట్టాలి. తరచూ కలియదిప్పుతూ ఉండాలి. మూడో రోజున ఆ ద్రావణాన్ని వరి పొలంలో అంతటా పిచికారీ చేయాలి. ఈ ద్రావణం కలుపును దుంపను నాశనం చేస్తుంది. మొదట దుంపను, వేర్లను ఎండిపోయేలా చేస్తుంది. క్రమంగా మొక్క కాండం, ఆకులు కూడా ఎండిపోతాయి. తుంగ మొక్కను పట్టుకొని పీకితే తేలిగ్గా రాదు. నేను ద్రావణం చల్లిన తర్వాత మూడో రోజు తుంగ మొక్కను పట్టుకుంటే చాలు ఊడి వస్తుంది. దుంప, వేర్లు మాడిపోయాయి. ఇలా నిర్మూలించిన తర్వాత మా పొలంలో మళ్లీ ఇంత వరకు తుంగ రాలేదు. వరి మొక్కలకు ఎటువంటి హానీ జరగలేదు. గరికను పెనం మీద మాడ్చి ద్రావణం తయారు చేసి చల్లితే 10 రోజులకు వడపడింది. పీకి చూస్తే వేరు ఎండిపోయింది. సాధారణంగా రసాయనిక కలుపు మందులు పిచికారీ చేసిన తర్వాత 48 గంటల్లో మొదట ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు.. పై నుంచి కిందకు ఎండిపోతాయి. ఈ ద్రావణం చల్లితే ఇందుకు భిన్నంగా.. మొదట వేర్లు, గడ్డలు, కాండం, కొమ్మలు, ఆకులు చివరగా ఎండుతాయి. అయితే, భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు నిర్మూలన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చల్లిన ద్రావణం వేరు ద్వారా కిందికి దిగాలంటే భూమిలో పదును ఉండాలి. అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రైతులంతా రసాయనిక కలుపు మందులు వాడి భూములను నాశనం చేసుకోకుండా, స్వల్ప ఖర్చుతో ఈ ద్రావణం తయారు చేసుకొని వాడుతూ కలుపు నిర్మూలన చేసుకుంటున్నారు. – మేకా రాధాకృష్ణమూర్తి (84669 23952), మంత్రిపాలెం, నగరం మండలం, గుంటూరు జిల్లా. -
సిరుల వేరుశనగ!
విత్తన శుద్ధి ఇలా.. విత్తనాలు పురుగు పట్టినవి కాకుండా చూసుకోవాలి. ఎకరానికి 60 నుంచి 75 కిలోలు విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మంకోజబ్ పొడి మందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి. దీంతో పాటు విత్తనానికి రైజోబియం లేక 6.5 మిల్లిలీటర్ల క్లోరో ఫైరిఫాస్ కానీ, రెండు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కానీ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. దుక్కి తయారీ దుక్కి మెత్తగా చదును చేసుకున్న తర్వాత చివరి దుక్కిలో 4, 5 టన్నుల సేంద్రియ ఎరువులు వేయాలి. నీటి పారుదలకు కింద అయితే ఎకరానికి వంద కిలోల సూపర్ఫాస్పెట్, 33 కిలోల మ్యూరెట్ఆఫ్ పొటాష్ మరియు 20 కిలోల యూరియాను విత్తే సమయంలోనే వేయాలి. 9 కిలోల యూరియా, ఎకరానికి 200 కిలోల జిప్సంను పంట విత్తిన 30 రోజుల త ర్వాత అంటే తొలిపూత దశలో వేసుకోవాలి. కలుపు నివారణ కలుపు నివారణ కొరకు ఫ్లూక్లోరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున దుక్కిపై పిచికారీ చేసి కలియ దున్నాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల సమయంలో గొర్రుతో అంతరకృషి చేయాలి. విత్తిన 45 రోజులలోపు ఎలాంటి కలుపు మొక్కులూ లేకుండా చూడాలి. 45 రోజుల తర్వాత ఎలాంటి అంతరకృషి చేయకూడదు. ఆకుముడత తెగులు పురుగు ఆకు పొరల మధ్య తొలుస్తూ పత్రహరిత పదార్థాన్ని తింటుంది. దీంతో ఆకులు గోధుమ రంగులోకి మారి ముడతలుగా మారుతాయి. పురుగు లార్వా దశలో రెండు ఆకులను దగ్గరకు చేర్చి వాటి మధ్య గూడును ఏర్పాటు చేసుకుంటుంది. ఆకుపై పొరకు, కింది పొరకు మధ్య ఉన్న కణజాలాన్ని తింటుంది. దీంతో ఆకులు ఎక్కువ సంఖ్యలో రాలిపోయి మొక్కల పెరుగుదల కాయల అభివృద్ధి తగ్గుతుంది. నివారణ ప్రతి సంవత్సరం ఒకే పొలంలో వేరుశనగ పంట వేయకుండా పంట మార్పిడి చేయాలి. లీటర్ నీటికి 1.6 మిల్లిలీటర్ల మొనోక్రోటోఫాస్, రెండు మిల్లిలీటర్ల క్వినాల్ఫాస్ లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. లద్దె పురుగు.. లద్దె పురుగు నివారణకు వేసవిలో దుక్కి లోతుగా దున్ని నత్రజని, వేపపిండి వేసుకోవాలి. పురుగు తొలి దశ లలో ఐదు శాతం వేప గింజల కషాయాన్ని కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ఐదు మిల్లీ లీటర్ల వేపనూనే పిచికారీ చేసుకోవాలి. పురుగు లార్వా దశకు ఎదిగాక ఐదు కిలోల తవుడు, అరకిలో బెల్లం, అరలీటర్ మోనోక్రోటోఫాస్ లేదా అర లీటర్ క్లోరోపైరిఫాస్ కలిపి విషపు ఎరువు తయారు చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క మొదళ్ల వద్ద వేసినట్లయితే లద్దె పురుగును నివారించవచ్చు. తెగుళ్లు.. నివారణ చర్యలు పంటకు జింకులోపం ఏర్పడితే ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి. ఈ లోపాన్ని నివారించడానికి ఎకరాకు 400 గ్రాముల జింక్సల్ఫేట్ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. లేత ఆకుమచ్చ తెగులు.. మొక్కలు 20 నుంచి 30 రోజుల వయసులో ఉన్నప్పుడు ఆకుపై మచ్చలు కనిపి స్తే ఒక లీటరు నీటికి 2.5 గ్రామాలో మంకొజెబ్, లీటరు నీటికి ఒక గ్రాము కార్బడిజం కలిపి 200 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకొని ఒక ఎకరానికి స్ప్రే చేయాలి. ముదురు ఆకుమచ్చ తెగులు.. ఈ తెగులు విత్తిన 30 రోజుల తర్వాత వంద రోజుల్లోపు ఆశించే అవకాశం ఉంది. తెగులు ఆశించిన వెంటనే లీటరు నీటికి 2.5 గ్రాముల మంకోజెబ్ గానీ లీటరు నీటికి గ్రాము కార్బడిజం గానీ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. -
ఇలా చేస్తే.. కలుపుపై మనదే గెలుపు
వరిలో కలుపు నివారణకు ప్రస్తుతం ఎన్నో రసాయనిక మందులు అందుబాటులో ఉన్నాయి. ఆయా పద్ధతుల్లో వరి సాగుకు సంబంధించి కలుపు నివారణకు ఏఏ మందులు వాడాలో బాపట్ల మండల వ్యవసాయాధికారి పి. రఘు (8886614161) రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కాస్తంత దృష్టి పెడితే వరిలో కలుపు నివారణ చాలా తేలికైన పని అని చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. బాపట్లటౌన్: వర్షాభావ పరిస్థితులు నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వరిలో కలుపు సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. కూలీల కొరత కారణంగా కలుపు తీయడం ఖర్చుతో కూడుకున్న పనిగా మారుతోంది. ఈ నేపథ్యంలో కలుపు నివారణకు రైతులు రసాయనాలు వినియోగించాల్సిన అవసరం ఉంది. పలు పద్ధతుల్లో సాగు చేస్తున్న వరిలో కలుపు నివారణకు సంబంధించి రైతులు వేర్వేరు మందులు వాడాల్సి ఉంది. ప్రత్యేక పద్ధతులు అవలంబించాల్సి ఉంది. మెట్టవరిలో కలుపు యాజమాన్యం మెట్టపొలాల్లో వరిని రెండు పద్ధతుల్లో సాగుచేస్తున్నారు. వెదజల్లడం, గొర్రుతో విత్తడం.. ఇవే ఆ పద్ధతులు. ఇలా సాగుచేసిన పైరులో కలుపు నివారణకు వరి విత్తిన రెండు లేక మూడు రోజుల్లోగా లీటరు నీటికి ఐదు నుంచి ఆరు మిల్లీ లీటర్ల ఫెండీమిథాలిన్గానీ, రెండు మిల్లీలీటర్ల ప్రిటిలాక్లోర్ 50 శాతం ద్రావకాన్నిగానీ, 1.5 మిల్లీలీటర్ల అనిలోఫాస్గానీ పిచికారీ చేయాలి. ఊదలాంటి గడ్డిజాతి మొక్కలు ఉంటే.. - విధ పద్దతుల్లో సాగుచేసిన వరిలో విత్తిన 15 నుంచి 20 రోజుల మధ్య ఊదలాంటి గడ్డిజాతి మొక్కలు ఎక్కువుగా ఉంటే ఎకరాకు 400 మిల్లీలీటర్లసైహాలోపాప్ బ్యూటైల్ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - గడ్డిజాతి మొక్కలు, వెడల్పాటి మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకు 80 నుంచి 100 మి.లీ బీస్పైరి బాక్ సోడియంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - విత్తినా, నాటిన 25 నుంచి 30 రోజుల్లో ఎకరాకు 400 గ్రాముల 2.4-డి సోడియం సాల్టుగానీ, 50 గ్రాములు ఇథాక్సి సల్ఫ్యూరాన్నుగానీ 15 శాతం పొడి మందుతో, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఎలాంటి కలుపునైనా సమర్థంగా నివారించుకోవచ్చు. డ్రమ్సీడర్ సాగులో వరి విత్తిన మూడు నుంచి ఐదు రోజుల్లోగా పొలంలో నీరు పలుచగా ఉన్నప్పుడు ఎకరాకు 35 నుంచి 50 గ్రాముల ఆక్సాడయార్టిల్ పొడి మందు చల్లుకోవాలి. లేదంటే 80 గ్రాముల ఫైరజో సెల్ఫూరాన్ ఇథైల్ను అరలీటరు నీటిలో కరిగించి దానికి 20 కిలోల పొడి ఇసుక కలిపి పొలంలో చల్లుకోవాలి. వరి విత్తిన 3 నుంచి 4 రోజుల్లోగా ఎకరాకు 80 గ్రాముల పైరజోసల్ఫూరాన్ ఇథైల్ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.


