సిరిపురంలో విషజ్వరాలు
సిరిపురం (నడిగూడెం) : మండలంలోని సిరిపురం బుడిగజంగాల కాలనీకి చెందిన ప్రజలు 10 రోజులుగా విషజ్వరాలతో బాధపడుతున్నారు. ఆ కాలనీలోని పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో చిన్నారులు, పెద్దలు దాదాపు 15 మందికిపై విషజ్వరాల బారిన పడినా పట్టించుకునే నాథులే లేకుండా పోయారు. దీంతో ఆ కాలనీ వాసులు గ్రామీణ వైద్యులను సంప్రదిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబందిత అధికారులు స్పందించి కాలనీలో వైద్యశిబిరం నిర్వహించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.