unuse
-
అలాంటి బ్యాంక్ అకౌంట్స్ వెంటనే క్లోజ్ చేసుకోండి
సాధారణంగా చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే.. అందులో ఒకటి లేదా రెండు మాత్రమే ఉపయోగిస్తుంటారు. మిగిలినవన్నీ వృధా అన్న మాట. ఇలా వదిలేయడం వల్ల.. కొన్ని నష్టాలు భరించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి నష్టాలేమిటో తెలుసుకుందాం..బ్యాంక్ చార్జీలుఒక బ్యాంకులో అకౌంట్ ఉందంటే.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. ఒకవేళా మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే.. వాటిపై బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తుంది. కొన్ని సార్లు మైనస్ బ్యాలెన్స్లోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తరువాత లావాదేవీలు చేయాలంటే.. ముందు మైనస్ బ్యాలెన్స్ క్లియర్ చేయాల్సిందే.డబ్బు వృధాబ్యాంక్ అకౌంట్ ఉపయోగించకుండా.. అలాగే వదిలేస్తే అందులో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ వంటివి వృధా అవుతాయి. మీకు ఓ ఐదు అకౌంట్స్ ఉన్నాయనుకుంటే.. అందులో మీరు కేవలం ఒకదాన్ని మాత్రం వాడుతూ.. మిగిలినవి ఉపయోగించకుండా వదిలేస్తే అందులో ఉన్న డబ్బు వృధా అయినట్టే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కువ అకౌంట్స్ మెయింటెన్సన్ చేయకుండా ఉండటమే ఉత్తమం.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం.. ఒకేరోజు 52 కార్ల డెలివరీమోసాలకు అవకాశంటెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు ఎక్కువవుతున్నాయి. మీరు ఉపయోగించకుండా ఉంటే.. అలాంటి అకౌంట్లను కొందరు సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇవి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ వృధాగా ఉన్నా.. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదా క్లోజ్ చేసుకోవడం మంచిది.సిబిల్ స్కోరుపై ప్రభావంబ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా లేకుంటే.. మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే దీనర్థం మీరు బ్యాంకుకు అప్పు ఉన్నారన్నమాట. ఇది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. దీంతో సిబల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. యాక్టివ్గా ఉన్న అకౌంట్స్ కాకుండా.. మిగిలినవన్నీ వెంటనే క్లోజ్ చేసుకోవాలి. -
గ్రీన్కార్డు ఆశలు తీరే మార్గం.. భారతీయ అమెరికన్లకు శుభవార్త!
వాషింగ్టన్: గ్రీన్కార్డుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారతీయ అమెరికన్లకు శుభవార్త. 1992 నుంచి నిరుపయోగంగా ఉన్న 2.30 లక్షలకు పైగా గ్రీన్కార్డులను స్వాధీనం చేసుకుని, పునరి్వనియోగించాలన్న సిఫారసుపై అధ్యక్షుడి సలహా మండలి ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా, మరింత మంది గ్రీన్కార్డులను అందుకునేందుకు వీలు ఏర్పడింది. దీని ప్రకారం..ఏటా ఇచ్చే 1.40 లక్షల గ్రీన్కార్డులకు అదనంగా 2.30 లక్షల కార్డుల్లో ఏటా కొన్నిటిని జారీ చేస్తారని ప్రముఖ భారతీయ అమెరికన్ అజయ్ భుటోరియా చెప్పారు. అధ్యక్షుడు బైడెన్కు ఆసియన్ అమెరికన్ల సలహా మండలిలో భుటోరియా సభ్యుడు. ఇందుకు సంబంధించిన సిఫారసులను మండలికి గురువారం అందజేసినట్లు ఆయన తెలిపారు. గ్రీన్కార్డు అంటే అమెరికాలో వలసదారులకు అందజేసే శాశ్వత నివాస పత్రం. ఉపయోగంలో లేని గ్రీన్కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, మున్ముందు గ్రీన్కార్డుల వృథాను అరికట్టేందుకు పలు సిఫారసులను చేశామన్నారు. వీటి అమలుతో గ్రీన్కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి ఎంతో ఊరటనిస్తుందని చెప్పారు. తమ కమిషన్ సిఫారసులకు ఆమోదం తెలిపిన బైడెన్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ, ఉద్యోగ ప్రాతిపదికన వలసదారులకు ఏటా నిరీ్ణత సంఖ్యలో గ్రీన్కార్డులను జారీ చేసే అధికారం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)కి కాంగ్రెస్ ఇస్తుంటుంది. అయితే, పరిపాలనా పరమైన జాప్యంతో జారీ అయిన గ్రీన్కార్డుల్లో కొన్ని నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. అనేక ఏళ్లుగా ఇలా కార్డులు లక్షలుగా పేరుకుపోయాయని భుటోరియా వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు చర్యలను తాము సూచించినట్లు వెల్లడించారు. అందులో ఒకటి...1992 నుంచి ఉపయోగంలో గ్రీన్కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఏటా ఇచ్చే 1.40 లక్షల గ్రీన్కార్డులకు తోడుగా స్వాధీనం చేసుకున్న 2.30 లక్షల కార్డుల్లో ఏటా కొన్నిటినీ జారీ చేయాలి. రెండోది..ఆ ఆర్థిక సంవత్సరంలో సంబంధిత పత్రాలను ఏజెన్సీలు ప్రాసెస్ చేయలేకపోయినప్పటికీ, అన్ని గ్రీన్ కార్డ్లు వార్షిక పరిమితి ప్రకారం అర్హులైన వలసదారులకు అందుబాటులో ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురావడం. కొత్త విధానం అమల్లోకి రాకముందే ఉపయోగించని గ్రీన్ కార్డ్లను తిరిగి పొందేందుకు ఈ విధానాన్ని ముందస్తుగా వర్తింపజేయడం’అని ఆయన వివరించారు. ఈ సిఫారసులు అమల్లోకి వస్తే ఎన్నో కుటుంబాలు, వ్యక్తులతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నిరుపయోగంగా ఉండే గ్రీన్కార్డుల ప్రభావం ముఖ్యంగా భారతీయ అమెరికన్లు, ఫిలిపినో అమెరికన్లు, చైనీస్ అమెరికన్ల కుటుంబాలపైనే ఉంటుందని చెప్పారు. గ్రీన్కార్డుల కొరత ప్రభావం తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే హెచ్–1బీ వీసాదారులపై ఉంటుందని, వారి పిల్లల వలస హోదాపైనా పడుతోందన్నారు. 2020 గణాంకాల ప్రకారం 42 లక్షల కుటుంబాలు సగటున ఆరేళ్లుగా గ్రీన్కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. భారతీయ ఐటీ నిపుణులు గ్రీన్కార్డు కోసం సగటున దశాబ్ద కాలంపాటు ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితులున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
– దిష్టిబొమ్మల్లా తయారైన సబ్కంట్రోల్ కార్యాలయాలు అనంతపురం సెంట్రల్ : ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సబ్ కంట్రోల్ కార్యాలయాలు దిష్టిబొమ్మల్లా తయారయ్యాయి. ఇటీవల నేరసమీక్షా సమావేశంలో ఎస్పీ రాజశేఖరబాబు స్వయంగా సబ్కంట్రోల్ కార్యాలయాలు తెరవాలని ఆదేశించినా క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నేరాలు అదుపు చేసేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్సబ్ కంట్రోల్ కార్యాలయాలు నిర్మించారు. పాతూరులో గాంధీ విగ్రహం సర్కిల్, టవర్క్లాక్, కలెక్టరేట్కు సమీపంలో సర్ థామస్ మన్రో విగ్రహం వద్ద, బళ్లారి బైపాస్ తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఓ కానిస్టేబుల్ నియమించి నిత్యం వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు శాంతిభద్రతల పరిరక్షణ చేపట్టేందుకు వీటిని వినియోగించాలి. కానీ కొన్ని నెలల నుంచి సబ్కంట్రోల్ కార్యాలయాలు తలుపులు తెరుచుకున్న పాపాన పోలేదు. దుమ్ము, చెత్తా, చెదారంతో అవి దీనావస్థకు చేరుతున్నాయి. టవర్క్లాక్ కూడలిలో రాజకీయనాయకుల ప్లెక్సీ కట్టుకునేందుకు సబ్కంట్రోల్ రూం ఉపయుక్తంగా మారుతోంది. అక్కడ పోలీసులకు సంబంధించి ఓ ఆఫీసు ఉందని ప్రజలకు కనిపించని రీతిలో కట్టేస్తున్నారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ ఎక్కడ గాడిలో పడుతుంది అనే ప్రశ్నలు సామాన్య ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.