breaking news
tribs
-
ఆదిలాబాద్లో ఎవరో గిరి‘‘జనుడు’’
సాక్షి, ఆదిలాబాద్: చుట్టూ కొండకోనలు.. ఒత్తుగా పరుచుకున్న పచ్చదనం..దాన్ని చీల్చుకుంటూ ముందుకుసాగే గోదావరి పరవళ్లు..సరస్వతీ క్షేత్రంతో అటు ఆధ్యాత్మికంగా ఇటు ఆదివాసీ జీవన వైవిధ్యంతో భాసిల్లే ప్రాంతం ఆదిలాబాద్. ఔరా అనిపించే నిర్మల్ బొమ్మలు.. ఆకట్టుకునే గిరిజన నృత్యాలకు కేంద్రమిదే. వేసవిలో భానుడి భగభగలు, శీతాకాలంలో ఒంటిని గడ్డకట్టించేంత చలి.. అటువంటి ఆదిలాబాద్లో ఎన్నికల రాజకీయాలు ఇప్పుడు ‘గరిష్ట’ స్థాయిలో మండుతున్నాయి. 1952 నుంచి జనరల్ సీటుగా ఉన్న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం 2009 పునర్విభజనలో ఎస్టీ రిజర్వ్గా మారింది. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 14,78,662 మంది ఓటర్లున్నారు. ఈ లోక్సభ నియోజకవర్గం తొలి ఎన్నికల్లో (1952) సోషలిస్టు పార్టీకి చెందిన సి.మాధవరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత నుంచి 1980 వరకు వరుసగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. 1984 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. ఆ తర్వాత కాంగ్రెస్.. అప్పటి నుంచి 1999 వరకు టీడీపీ వరుసగా గెలుపొందగా.. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తులో భాగంగా టీఆర్ఎస్ పోటీ చేసి ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. 2009లో మళ్లీ టీడీపీ గెలుపొందింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఒంటరిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందింది. గత ఎన్నికల్లో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కారు హవా కొనసాగింది. టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్ 4,30,847 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నరేశ్ 2,59,557, టీడీపీ అభ్యర్థి రమేశ్ రాథోడ్ 1,84,198 ఓట్లు సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, స్వయం పాలన నినాదంతో సాగిన ఎన్నికలు టీఆర్ఎస్కు అనుకూలించాయి. మరోవైపు టీఆర్ఎస్ అధినేత సైతం పలుమార్లు పర్యటించి ప్రచారం చేశారు. దీంతో భారీ మెజార్టీ దిశగా కారు దూసుకెళ్లింది. బరిలో హేమాహేమీలు ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ప్రస్తుతం పోటీ ఉత్కంఠ కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ పేరును పది రోజుల క్రితమే ఆ పార్టీ ఖరారు చేసింది. దీంతో ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. ఈ నెల 21న అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గోడం నగేశ్ను ప్రకటించింది. అధికారిక ప్రకటన ఆలస్యమైనా.. అంతర్గతంగా సమాచారం ఇవ్వడంతో ఆయన అప్పటికే ప్రచారాన్ని ప్రారంభిం చారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కారుదే జోరు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటింది. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ నుంచి 171 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చేశాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకున్నా.. గట్టి పోటీ ఇచ్చేందుకు పావులు కదువుతోంది. త్వరలోనే అభ్యర్థిని ప్రకటించి జాతీయ నేతలను ఇక్కడకు ప్రచారానికి రప్పించాలని ఆ పార్టీ ప్రణాళిక రచిస్తోంది. గిరిపుత్రుల మొగ్గు ఎటుంటే అటే.. అత్యధిక విస్తీర్ణం అడవులు కలిగి.. అడవిబిడ్డల అడ్డా అయిన ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఆదివాసీల ఓట్లే అభ్యర్థి గెలుపోటముల్లో కీలకం కానున్నాయి. ఈ లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లుంటే.. అందులో మూడు నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మిగతా సెగ్మెంట్లలోనూ గిరిజనుల ప్రాబల్యం అధికమే. ఈ లోక్సభ స్థానం కూడా ఎస్టీ రిజర్వు కావడంతో పోటీచేసే అభ్యర్థులకు చెందిన సామాజిక వర్గాలే ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గోండు, నాయక్పోట్, కొలామ్, లంబాడీ తెగలకు చెందిన వారి జనాభా అధికంగా ఉంది. తాజా ఎన్నికల్లో వీరి ఓట్లపైనే జయాపజయాలు ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. వీరిని ఆకట్టుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. 2014 ఎన్నికల ఫలితం అభ్యర్థి వచ్చిన ఓట్లు జీ నగేశ్ 4,30,847 నరేశ్ 2,59,557 రమేశ్ రాథోడ్ 1,84,198 లోక్సభ ఓటర్లు పురుషులు 7,25,961 మహిళలు 7,52,649 ఇతరులు 52 మొత్తం 14,78,662 లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు - సిర్పూర్ కాగజ్నగర్, ఆసిఫాబాద్ (ఎస్టీ), ఖానాపూర్ (ఎస్టీ),ఆదిలాబాద్, బోథ్ (ఎస్టీ), నిర్మల్, ముథోల్. -
మల్లన్న చెంతకు చెంచులు
– గిరిజన చెంచులకు పూర్వవైభవం తెచ్చేలా ఈఓ కృషి – సౌకర్యాలు, దర్శనంలో ప్రాధాన్యత – చెంచులక్ష్మీ కల్యాణపథకం కింద ఘనంగా వివాహం – అర్చకత్వంలో శిక్షణ, భజన బందాలకు చేయూత దట్టమైన నల్లమల అటవీ కీకారణ్యం మధ్య నెలకొన్న శ్రీభ్రమరాంబాసమేత మల్లికార్జునస్వామివార్లను చెంచులు తమ దైవంగా భావించేవారు. తమకు పుట్టిన పిల్లలకు చెంచు మల్లయ్య, చెంచు మల్లమ్మ అని పేర్లు పెట్టుకునే వారు. పూర్వం మహాశివరాత్రి పర్వదినం నాడు స్వామిఅమ్మవార్లకు తమ గిరిజన పద్ధతిలో కల్యాణోత్సవాన్ని నిర్వహించే వారని, అలాగే శ్రీభ్రమరాంబాదేవికి జరిగే కుంభోత్సవం పూర్తిగా చెంచు గిరిజనులకే ఒకప్పుడు పరిమితమైంది. కాలానుగుణ పరిస్థితులలో భాగంగా నాగరికత అభివృద్ధి చెందడంతో చెంచులను మల్లన్నకు నాగరీకులు దూరం చేశారని చెప్పవచ్చు. అయినప్పటికీ నేటికి స్వామివార్ల కల్యాణోత్సవ పల్లకీని ప్రతి నిత్యం మోసేది చెంచులే. అలాంటి చెంచులకు ఈఓ నారాయణభరత్ గుప్త మల్లన్న ఆలయంలో ప్రాధాన్యత ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. – శ్రీశైలం శ్రీశైల మల్లన్నకు చెంచుల మధ్య అనుబంధాన్ని తెలుసుకున్న ఈఓ నారాయణ భరత్ గుప్త వారికి దేవస్థానం తరుపున గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐటీడీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ ఎల్. భాస్కరరావు, శివాజీస్ఫూర్తి కేంద్రం పర్యవేక్షకులు ఎ. వంశీకష్ణ, కర్నూలు జిల్లా సమరసత ఫౌండేషన్ కన్వీనర్ బాలిశెట్టి బాలసుబ్రమణ్యం, శ్రీశైల మండల ప్రతినిధి సంజీవరావులతో కలిసి వివిధ చెంచుగూడాలల చెంచు గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ చెంచులకు దేవస్థానం చేపట్టనున్న పలు అంశాలపై అవగాహన కల్పించారు. అవగాహన సదస్సుకు హాజరైన ప్రతి చెంచుగిరిజనుడికి ఈఓ నారాయణభరత్ గుప్త స్వామివార్ల లడ్డూ ప్రసాదాలు, శేషవస్త్రాలు, దివ్యపరిమళ విభూతి, శ్రీచక్రపూజ కుంకుమ, కైలాస కంకణాలను అందజేశారు. ఆ తరువాత స్వామివార్లకు అభిషేకం, స్పర్శదర్శనంతో పాటు అమ్మవారి దర్శనం, భోజన వసతి సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో దేవస్థానం వివిధ విభాగాల సిబ్బంది, స్వామివార్ల ప్రధానార్చకులు, అర్చకులు , కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల చెంచుగూడాల నుంచి వచ్చిన చెంచులు, పాల్గొన్నారు. చెంచులకు వర్థించే పథకాల వివరాలు: చెంచుల వివాహ సమయంలో దేవస్థానం స్వామిఅమ్మవార్ల ఆశీర్వచనంగా చెంచులక్ష్మీ కల్యాణ పథకం ప్రవేశపెడుతున్నారు. ఈ పథకంలో వివాహానికి దేవస్థానం కల్యాణమండపంతో పాటు వ««దlూవరులకు నూతన వస్త్రాలు, తాళిబొట్లు, మెట్టెలు అందజేస్తుంది. – వధూవరులతో వచ్చిన బంధువర్గానికి దేవస్థానం ఉచిత వసతి సదుపాయం, వివాహ భోజనం ఏర్పాటు చేస్తారు. – వివాహం రోజున నూతన వధూవరులచే స్వామివార్లకు అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించే అవకాశం. – ఈ సౌకర్యాలకు చెంచులు ఐటీడీఏను సంప్రదించాల్సి ఉంది. – ఆయా చెంచుగూడాలలోని ఆలయాలలో అర్చకత్వాన్ని నిర్వహింపజేసేందుకు ఆసక్తిగల చెంచులకు దేవస్థానం తరుపున తగిన శిక్షణ ఇస్తుంది. – చెంచుగూడాలలో భక్తులు, భజన బందాలు ఏర్పడితే అలాంటి బందాలకు హార్మోనియం, తబలా, భజన తాళాలు తదితర వాటిని దేవస్థానం సమకూరుస్తుంది. – దేవస్థానం నిర్వహించే కళా పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి రూ. 10వేలు, రెరండవ బహుమతి రూ. 8వేలు, మూడవ బహుమతి రూ. 5వేలు పారితోషికంగా అందజేస్తారు. పోటీలో పాల్గొన ప్రతి బందానికి రూ. 2వేలు ఇవ్వనున్నారు. – చెంచులు ఎప్పుడు ఆలయాన్ని సందర్శించినప్పటికీ వారికి ఉచిత దర్శనం కల్పిస్తారు. ఇందుకు ఐటీడీఏ ద్వారా గుర్తింపు పొందిన చెంచులు ఆ సంస్థ ద్వారా గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది.