breaking news
Temple demolish
-
దేవుళ్లకు జాతులు, కులాలు ఉండవు!
మల్లెపల్లి లక్ష్మయ్యగారి వ్యాసాన్ని బాధతో చదివాను. ఆయన మేధావి. జ్ఞానసంపన్నుడు. కాలానుగుణ మార్పులను సూక్ష్మంగా చూస్తున్నవారు. అలాంటి వ్యక్తి ‘దేవుడికీ తప్పని కులవివక్ష’ అనే వ్యాసం రాయడాన్ని (సాక్షి 29–08–2019) సున్నితంగా తిరస్కరిస్తున్నాను. వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క కాలంలో సద్గురు రవిదాస్ మహరాజ్ లాంటి అవతార పురుషులు పుడుతూనే ఉన్నారు. వారిని సమాజం గుర్తిం చింది. వారి సందేశాలను భక్తితో స్వీకరించాయి. సాధువుల జాతి, పుట్టుక అడుగకు, వారి జ్ఞానాన్ని స్వీకరించు. ఒరను పట్టించుకోకు కత్తి పదునును చూడు. సంత్ రవిదాస్ జయంతి సమావేశాల్లో చాలాసార్లు నేను పాల్గొన్నాను. ఢిల్లీలో సంత్ రవిదాస్ దేవాలయాన్ని కూలగొట్టినప్పుడు ముందుగా స్పందించిన వాణ్ణి నేనే.. సంత్ రవిదాస్ దళితులకే కాదు.. మానవజాతికే గురుతుల్యులు. 2018 ఏప్రిల్ 16 సాయంత్రం 4 గంటలకు ఒక దళిత శ్రీ వైష్ణవ భక్తుడిని నా భుజాలపై కూర్చోబెట్టుకుని జియాగూడ శ్రీరంగనాథ స్వామి ఆలయంలోనికి మేళతాళాలతో భక్త బృందం వెంటరాగా తీసుకువెళ్లాను. భక్తుల గోవింద నామ స్మరణ, తిరుప్పాణాళ్వారు రచించిన ‘అమలనాది పిరాన్ పాశురగానం,’ అన్నమయ్య రచించిన ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అనే గానాల మధ్య దేవుడిముందు అందరూ సమానమే అని మరోమారు నిజం చేస్తూ, మునివాహన ఉత్సవం బ్రహ్మాండంగా నిర్వహించాం. భగవద్రామానుజులవారి 1000వ జయంతి సంవత్సరంలో ఈ ఉత్సవం జరగడం విశేషం. వైష్ణవాచార్య గురుపరంపరలో నమ్మాళ్వారు ప్రథమాచార్యులు. నమ్మాళ్వారు శూద్రజాతిలో జన్మించారు. శ్రీవైష్ణవులు పన్నెండుగురు ఆళ్వారులను భక్తితో పూజిస్తారు. పన్నెండు మంది ఆళ్వారులు వివిధ వర్ణాలలో జన్మించి పూజలందుకుంటున్నారు. వీరిలో తిరుప్పాణ్ ఆళ్వార్ దళిత కులానికి చెందినవారు. ఈ పరమ భక్తుడు శ్రీరంగనాథునికి తన జీవితాన్ని అంకితం చేసి శాస్త్రబద్ధ జీవనం చేస్తూ శ్రీరంగంలోని ఆలయం వెలుపలి నుండే రంగనాథుని గుణగానం చేస్తూ ఉండేవారు. పరమ భక్తుడైన ఈ ఆళ్వారుని, ఆలయ అర్చకులైన శ్రీలోక సారంగముని గుర్తించారు. శ్రీరంగనాథుని ఆజ్ఞానుసారం శ్రీలోకసారంగముని తిరుప్పాణాళ్వారుని కలుసుకుని, ఆ భక్తాగ్రేసరుని తన భుజాలపై కూర్చుండబెట్టుకుని ఆలయ ప్రవేశం చేయించమని తనను స్వామి ఆదేశించారని తెలి పారు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక ఆళ్వారు అంగీకరించారు. ఈ విధంగా ‘మునివాహనునికి’ సంతోషకరమైన స్వామి దర్శనం లభించింది. ఈ సంఘటన దాదాపు 2,700 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు మన సమాజంలో కులాల మధ్య వివక్ష, అగౌరవం అధికంగా కనిపిస్తున్నాయి. కులాల నడుమ చెలరేగుతున్న అగౌరవం, వివక్షతలు తొలగాలనీ, అందరినీ సమానంగా గౌరవించాలన్న సందే శం ఇచ్చే విధంగా, నేను మునివాహన సేవను నిర్వహించాను. ఒక దళిత భక్తుని తిరుప్పాణాళ్వారు వలె నా భుజాలపై కూర్చుండబెట్టుకుని అమలనాది పిరాన్ పఠిస్తూ ఆలయ ప్రవేశం చేశాను. సమాజంలో ఎస్సీ, ఎస్టీ సోదరులపట్ల చూపుతున్న దుర్వ్యవహారం ఆపివేసి, ప్రజ లకు వారిపట్ల గౌరవభావాన్ని ఇనుమడింప చేయడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది. నేను 2018వ సంవత్సరం జూన్ నెలలో గుంటూరులో, జూలై నెలలో నెల్లూరులో ఈ ఉత్సవాన్ని నిర్వహిం చాను. నేను చేసిన ప్రయత్నాలు తప్పుగా మా ధర్మ శాస్త్రజ్ఞులు పరిగణించలేదు. మనువాదులుగా మీరు నిందించిన వారెవరూ నన్ను దూషించలేదు. మల్లెపల్లి లక్ష్మయ్యగారు తమ వ్యాసంలో పేర్కొన్న అంశాలు సనాతన ధర్మం కానీ, రామానుజ సాంప్రదాయం కానీ ఎన్నటికీ ఒప్పుకోవు. కొంతమంది చేసే దుశ్చర్యలకు మొత్తం సమాజాన్ని నిందించే పని చేయడం సబబు కాదు. మనమందరం కలిసి మంచి సమసమాజ స్పృహను, చైతన్యాన్ని లోకంలో ఆవిష్కరిద్దాం. లక్ష్మయ్యగారూ.. మీరూ రండి. ఇదే మా ఆహ్వానం. వ్యాసకర్త: సీఎస్ రంగరాజన్, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు csranga@gmail.com -
దేవుడికీ తప్పని కుల వివక్ష
కుల వ్యవస్థ ఈ దేశంలోని కోటానుకోట్ల దేవుళ్ళలోనూ దళిత దేవుళ్ళ స్థానాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో 500 ఏళ్ళ కిందట నిర్మితమైన సంత్ రవిదాస్ మందిర్ను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఒక్క ఉదుటున కూల్చివేసింది. అది ప్రభుత్వం గుర్తించిన అడవిలో ఉన్నందువల్ల దానిని తొలగించాలని ఢీడీఏ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కోర్టు కూడా తోసిపుచ్చింది. 1450లో వారణాసిలో అంటరాని కులంలో జన్మించిన సంత్ రవిదాస్ కుల వివక్షను, అంటరానితనాన్ని నిరసిస్తూ, ప్రారంభించిన భక్తి ఉద్యమం కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది. సంత్ రవిదాస్ తన జీవితకాలంలో ఈ సమాజంపై ఎంతో ప్రభావాన్ని కలగజేశారు. ఏ దేవుడైనా దేవుడే అన్నప్పుడు తక్కువ కులాల దేవుడికో నీతి, అగ్రకుల దేవుళ్ళకో నీతి ఎలా ఉంటుంది. ఈ ద్వంద్వ నీతి పేరే కుల వివక్ష. మానవ అభ్యున్నతికి పాటుపడిన మహనీ యులను దేవుళ్ళతో సమంగా తలుస్తారు. రాళ్ళూ రప్పల కంటే సమాజానికి ఏదో ఒకటి చేసి చనిపోయినవారిని కొలవడంలో తప్పుపట్టాల్సిన పనిలేదు. కాకపోతే భారత దేశానికి మాత్రమే పరిమితమైన కుల వ్యవస్థ ఈ దేశంలోని కోటానుకోట్ల దేవుళ్ళలోనూ దళిత దేవుళ్ళ స్థానాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. సరిగ్గా ఇదే కోణంలో సంత్ రవిదాస్ దేవాలయం కూల్చివేతను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో అయిదు వందల ఏళ్ళ కిందట నిర్మితమైన సంత్ రవిదాస్ మందిర్ను ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ ఒక్క ఉదుటున కూల్చివేసింది. 1992లో ఢిల్లీ డెవ లప్మెంట్ అథారిటీ రవిదాస్ మందిర్ను అక్కడి నుంచి తొలగించా లని, మందిర్ నిర్వాహకులకు నోటీసులు జారీచేసింది. ఆ మందిర్ ప్రభుత్వం గుర్తించిన అడవిలో ఉన్నందువల్ల దానిని తొలగించాలని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే మందిర్ నిర్వాహకులు దీనిని వ్యతిరేకిస్తూ, న్యాయస్థానాన్ని ఆశ్ర యించారు. కానీ న్యాయస్థానాలలో సంత్ రవిదాస్ మందిర్ నిర్వా హకుల మాట చెల్లుబాటు కాలేదు. అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి దానిని తొలగించాలని న్యాయస్థానం నిర్ధారించింది. అందుకను గుణంగానే ఈనెల మొదటి వారంలో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ రవిదాస్ మందిర్ను నిలువునా కూల్చివేసింది. ఈ సంఘటన పంజాబ్, హర్యానాలతో సహా ఉత్తర భారతాన్ని ఓ కుదుపు కుదిపే సింది. రవిదాస్ మందిర్ను కూల్చివేసినందుకు ఆగస్టు 21వ తేదీన ఢిల్లీలో వేలాది మంది నిరసన ప్రదర్శన చేశారు. రవిదాస్ సాంప్రదా యాన్ని అవలంభిస్తున్న వాళ్లే కాకుండా, అనేక సంఘాల కార్యకర్తలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పంజాబ్, హర్యానాల్లో రోజుల తరబడి నిరసనలు వెల్లువెత్తాయి. సంత్రవిదాస్ మందిర్ను కూల్చడం వెనుక కుల వివక్ష, సామాజిక అణచివేతలే కారణమని భావించక తప్పదు. సంత్ రవిదాస్ మందిర్ చరిత్రను పరిశీలిస్తే, ఈ వాదనకు బలం చేకూరుతుండడం కూడా సుస్పష్టం. సంత్ రవిదాస్ 1450 సంవత్సరంలో వారణాసిలోని అంటరాని కులంలో జన్మించారు. ఆయన కుటుంబం చర్మకార వృత్తిలో జీవితం సాగిస్తుండేది. అప్పటికే పంజాబ్తో సహా ఉత్తర భారతదేశంలో సిక్కుమతం పురుడు పోసుకుంటోంది. సంత్ రవిదాస్ కూడా అదే తరహాలో కుల వివక్షను, అంటరానితనాన్ని నిరసిస్తూ, తన భక్తి ఉద్య మాన్ని ప్రారంభించాడు. సిక్కు మత వ్యవస్థాపకులైన గురునానక్ను సంత్ రవిదాస్ కలిసినట్టు సంత్ రవిదాస్ రాసిన కొన్ని పద్యాలు సిక్కు మత పవిత్ర గ్రంథమైన ‘‘ఆదిగ్రం«థ్’’లో పొందుపరిచినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. సంత్ రవిదాస్ అనుచరులు క్రమంగా సిక్కుమతంలో చేరిపోయారు. కానీ అక్కడ కూడా కుల వ్యవస్థ పైశాచికత్వం కోరలు చాచింది. అంటరాని కులాల్లో సైతం కుల వివక్ష కొనసాగింది. దానిని నిరసించిన వాళ్ళు ప్రత్యేకంగా రవిదాస్ మందిర్ను నిర్మించుకొని తమ సాంప్రదాయాలను కొనసా గిస్తూ వచ్చారు. వీరంతా చమార్ల నుంచి వచ్చినప్పటికీ. వీరిని రవి దాసియా చమార్లుగా పిలిచారు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాప కులు కాన్షీరాం ఈ సామాజిక నేపథ్యం నుంచి వచ్చినవారే. రవిదాస్ సాంప్రదాయానికి చెందిన రామానంద్దాస్ను 2009లో వియన్నాలో కొంత మంది హత్యచేశారు. సిక్కు అగ్రకుల శక్తులే ఈపని చేశారని భావించిన రవిదాస్ అనుచరులు తమకు తాముగా ప్రత్యేక మతంగా ప్రకటించుకున్నారు. కానీ రవిదాస్ సంప్రదాయాన్ని పాటిస్తున్న వాళ్ళు చాలా కాలంగా ప్రధాన గురుద్వారాలలో భాగస్వాములు కాలేకపోయారు. పదిహేనవ శతాబ్దం నుంచి ప్రారంభమైన సంత్ రవిదాస్ భక్తి ఉద్యమం కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది. కుల వివక్షను బద్దలు కొట్టుకొని, కొన్ని వేల మంది విదేశాలలో ఈ రోజు స్వేచ్ఛా జీవులుగా గడుపుతున్నారు. భారతదేశం నుంచి విదేశాల్లో స్థిరపడిన పంజాబీలలో సగం మందికి పైగా సంత్ రవిదాస్ భక్తులే ఉంటా రంటే ఆశ్చర్యం లేదు. సంత్ రవిదాస్ తన జీవితకాలంలో ఈ సమాజంపై ఎంతో ప్రభావాన్ని కలగజేశారని చెప్పొచ్చు. ఆయన వారణాసి ప్రాంతంలోనే కాదు, దేశంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించి ఎంతో మందిని తన మార్గంలోకి తీసుకొచ్చారు. ఆ క్రమం లోనే ఆయన ఢిల్లీని సందర్శించి, అప్పటి ఢిల్లీ సుల్తాన్ సికిందర్లోడి మన్ననలు పొందారు. అందుకు గాను ఆయన సంత్ రవిదాస్కు ఢిల్లీలో ఇప్పుడున్న ప్రాంతంలో కొంత భూమిని కేటాయించి, ఆశ్రమ నిర్మాణానికి అవకాశమిచ్చారు. అప్పటి నుంచి అదే స్థలంలో సంత్ రవిదాస్ మందిర్ నిర్మాణం జరిగింది. 1949లో గురు రవిదాస్ జయంతి ఉత్సవ సమితి ఏర్పాటై, అక్కడ కొన్ని వసతులతో కూడిన రవిదాస్ మందిర్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. 1949లో ప్రారంభమైన ఆ నిర్మాణం 1954లో పూర్తయ్యింది. అప్పటి రైల్వే శాఖా మంత్రి జగజ్జీవన్ రాం 1954లో దానికి ప్రారంభోత్సవం చేశారు. దాదాపు అయిదు వందల ఏళ్ళకు పైగా గురు రవిదాస్ బోధనలకు కేంద్రమైన ఈ మందిర్ను 1992లో అటవీప్రాంతంలో ఉన్నదని నోటీసులు ఇచ్చి, 2019లో కూల్చి వేశారు. దీన్ని బట్టి చూసినా ఇది కేవలం వివక్షతో చేసిందన్న విషయం సుస్పష్టం. ఒకవేళ గురు రవిదాస్ మందిర్ అటవీ ప్రాంతంలో ఉన్నదంటే, చాలా దేవాలయాలు, ఆశ్రమాలూ, అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఢిల్లీలోనే చూసినట్లయితే ప్రభుత్వం గుర్తించిన ఆరు అటవీ ప్రాంతాలు ఉన్నాయి. పాత ఢిల్లీలోని నార్తరన్ రిడ్జ్, మంగేర్ బని అడవి, రాజోక్రి అటవీప్రాంతం, జహన్పన సిటీ ఫారెస్ట్, తుగ్లక్ బాద్ రిడ్జ్ ఫారెస్ట్, సంజయ్ వనం వాటిపేర్లు. సంజయ్ వనంలో రామ్ తలాబ్ మందిర్, ప్రాచీన గురు గోరఖ్నాథ్ మందిర్, తుగ్లక్ బాద్ అడవిలో కాళి బారిదేవాలయం ఉన్నాయి. వీటిలో వేటికీ కూడా నోటీసులు లేవు. కూల్చివేతలు లేవు. ఒకవేళ రక్షిత అటవీ ప్రాంతంలో ఎటువంటి కట్టడాలూ ఉండకూడదని భావిస్తే ఈ దేవాలయాలను కూడా తొలగించడానికి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ తన అధికారాలను ఉపయోగించి ఆ పనిచేయాలి. కానీ అలా జరగలేదు. అంతేకాదు, ఈ దేశంలోని దేవాలయాలలో సగానికిపైగా రక్షిత అటవీ ప్రాంతంలోనే నిర్మితమై ఉన్నాయి. కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం సహా చాలా దేవాలయాలు మంగళదేవి, దేవియార్ ఫారెన్ టెంపుల్, కర్ణాటకలోని హిమావత్ గోపాలస్వామి దేవాల యం, ఉత్తరాఖండ్లోని అనేక దేవాలయాలు, ఆంధ్రప్రదేశ్లోని తిరు పతి, శ్రీశైలం అహోబిలం ఇట్లా చెప్పుకుంటూపోతే కొన్ని వందల పేర్లు వస్తాయి. ఇక్కడ పొరపాటు పడొద్దు. ఈ దేవాలయాలను కూల్చాలనో, తొలగించాలనో నా అభిప్రాయం కాదు. ఏ దేవుడైనా దేవుడే అన్నప్పుడు తక్కువ కులాల దేవుడికో నీతి, అగ్రకుల దేవు ళ్ళకో నీతి ఎలా ఉంటుంది అన్నదే నా ప్రశ్న. ఈ ద్వంద్వ నీతి పేరే కుల వివక్ష. నిజానికి ఈ పాపంలో కాంగ్రెస్ పార్టీకి భాగమున్నది. 1992లో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నోటీసులు ఇచ్చినప్పుడే ఈ చర్యని అడ్డుకోవాల్సింది. ఆ రోజు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీయే అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి, సానుభూతి తెలి పితే ప్రయోజనమేముంటుంది? పోనీ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమైనా ఎందుకు దీనిని పట్టించుకోలేదో సమాధానం చెప్పాలి. ఇది పూర్తిగా సామాజిక వివక్ష, అణచివేత, వెలివేతలకు ఒక నిలువెత్తు నిదర్శనం. పర్యావరణానికి ఇబ్బంది కలిగించే ఎన్నో ప్రాజెక్టులకు రక్షిత అటవీ ప్రాంతాల్లో రిజర్వు ఫారెస్ట్లలో, అభయా రణ్యాలలో రహదారులకు, రైల్వే లైనులకు, పరిశ్రమలకు అనుమతి ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఒకటì æరెండున్నర ఎకరాల రవిదాస్ మందిరానికి మినహాయింపు ఇవ్వలేకపోవడం ఏ సామాజిక న్యాయాన్ని సూచిస్తున్నది? రోడ్లకి అడ్డంగా కుప్పలుగా పుట్టుకొస్తోన్న దేవాలయాలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విస్తరిస్తోంటే, దాన్ని వదిలేసి, ఎక్కడో అడవిలో కట్టుకున్న ఆలయాన్ని సైతం నిర్దాక్షి ణ్యంగా కూల్చేయడం లోని మతలబుని అర్థం చేసుకోలేనంత వెర్రి జనం కాదుకదా ప్రజలు. కోట్లాది మంది దళితులు, ప్రజాస్వామ్య వాదులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే తప్పును సరిదిద్దుకొని, ఆ స్థలంలోనే గురు రవిదాస్ మందిరాన్ని నిర్మించి ప్రాయశ్చిత్తం చేసు కోవాల్సిన అవసరం ఉంది. లేదంటే దేవాలయాల్లో దళితుల ప్రవే శాన్ని అడ్డుకున్నట్టే, నేడు దళితుల దేవుళ్లని చివరకు అడవినుంచి సైతం తరమికొట్టే ప్రయత్నాలుగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే వాటిని కాపాడుకోవడానికి ఆ వర్గాలు మరో మహోద్య మానికి ఉద్యుక్తులు కావాల్సి వస్తుంది. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
ఢిల్లీలో ఆలయం కూల్చివేత : పంజాబ్లో ప్రకంపనలు
చండీగఢ్ : ఢిల్లీలోని తుగ్లకాబాద్లో 500 సంవత్సరాల శ్రీ గురు రవిదాస్ ఆలయం, సమాధి కూల్చివేతకు నిరసనగా మంగళవారం పంజాబ్ బంద్కు రాష్ట్రంలోని రవిదాసియా వర్గం పిలుపు ఇచ్చింది. బంద్ పిలుపుతో జలంధర్లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. సమస్య పరిష్కారానికి శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్భీర్ సింగ్ బాదల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీ ఎల్జీ అనిల్ బైజల్తో తాము చర్చించామని, గురు రవిదాస్ ఆలయ కూల్చివేతపై తమ అసంతృప్తిని వెల్లడించగా, సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని ఆయన హామీ ఇచ్చారని బాదల్ ట్వీట్ చేశారు. చారిత్రక ఆలయ కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని బాదల్ పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై ఆయన ఢిల్లీలో సీనియర్ నేతలతో సమావేశమయ్యారు.ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అకాలీదళ్ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఇది రవిదాస్ వర్గ మనోభావాలను గాయపరుస్తుందని అన్నారు. పార్టీ ప్రతినిధి బృందం త్వరలో హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈ వ్యవహారం తీవ్రతను ఆయన దృష్టికి తీసుకువెళతామని బాదల్ స్పష్టం చేశారు. -
ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలి
గన్నవరం : విజయవాడలో కూల్చివేసిన దేవాలయలను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చి 20 రోజులు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదని, హామీని నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని విశ్వహిందూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీఎస్ నాయుడు, అఖిల భారత సంయుక్త కార్యదర్శి గరిమెళ్ల సత్యం పిలుపునిచ్చారు. కేసరపల్లి శివారు శ్రీభువనేశ్వరి పీఠంలో మంగళవారం పీఠాధిపతులు సత్యానంద భారతీ స్వామి అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. నాయుడు, సత్యం మాట్లాడుతూ ఆలయాలు, సేవా కేంద్రాలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. త్రేతాయుగం నాటి సీతమ్మవారి పాదాలను కూడా తొలగించడం ప్రభుత్వ అమానుషత్వానికి నిదర్శనమని చెప్పారు. మరో 90 ఆలయాలను కూడా కూల్చివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. పుష్కరాలలోగా ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని, లేకుంటే మహా ఉద్యమ రూపంలో హిందూ శక్తిని రాష్ట్ర ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు. పుష్కరాల్లో 500 మందితో సేవలు రానున్న కృష్ణా పుష్కరాల్లో వీహెచ్పీకి చెందిన 500మంది కార్యకర్తలతో సేవలందించనున్నామని చెప్పారు. పుష్కరాల్లో రోజుకు ఐదు వేల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. వీహెచ్పీతో పాటు శివస్వామి ఆశ్రమ భక్తులు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని వివరించారు. -
ఆలయం కూల్చివేతను అడ్డుకున్న ప్రజలు
- రాజీవ్గృహకల్ప కాలనీలో ఉద్రిక్తత ఘట్కేసర్ (రంగారెడ్డి జిల్లా): నిర్మాణ దశలోఉన్న హనుమాన్ దేవాలయాన్ని కూల్చివేయడానికి అధికారులు యత్నించడంతో మండలంలోని రాజీవ్గృహకల్పకాలనీలో గురువారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాలనీవాసులు ,అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్గృహకల్పకాలనీలో శ్రీహనుమాన్ దేవాలయం నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ పాలకవర్గం కొంత స్థలంకేటాయిస్తూ తీర్మాణించింది. దీంతో కాలనీవాసులు నిధులు ప్రోగుచేసి నిర్మాణంచేపట్టారు.నిర్మాణం స్లాబ్వరకు చేరుకుంది. దీంతో సమీపంలో ఉన్న జీసస్వే ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాని తనకు ఉన్న స్థలాన్ని కబ్జా చేస్తూ శ్రీహనుమాన్ దేవాలయాన్ని నిర్మిస్తున్నారని అధికారులకు ఫిర్యాదుచేశాడు. దీంతో రెవెన్యూ అధికారులు,పోలీసుల బలగాలతోగురువారం రాత్రి చేరుకున్నారు.కూల్చీవేయడానికి రెవెన్యూ సిబ్బందితో స్లాబ్ వేయడానికి బిగించిన కట్టెలు తొలగించారు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కూల్చివేతను అడ్డుకున్నారు. సర్వేనంబర్ 14లో శ్రీహనుమాన్ దేవాలయానికి స్థలం కేటాయిస్తూ తీర్మాణాలు ఉన్నాయని సర్పంచ్ లక్ష్మినారాయణ అధికారులకు తెలపడంతో కూల్చివేత యత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. తహసీల్ధారు విష్ణువర్ధన్రెడ్డి, సీఐ ప్రకాష్, కాలనీ నాయకులు సారగళ్ల రమేష్, బల్రాం,జగన్నాధం, రమేష్,అంజనేయులు,వార్డు సభ్యులు రేణుక,పయ్యావుల లక్ష్మి సంఘటన స్థలంలో ఉన్నారు.దేవాలయ నిర్మాణాన్ని కూల్చవద్దని కాలనీ వాసులు కోరుతున్నారు.