breaking news
telemetry areas
-
నేడు పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న గందరగోళానికి తెరదించేం దుకు ఏర్పాటు చేసిన టెలిమెట్రీ పాయింట్ల పరిశీలన సోమవారం ప్రారంభం కానుంది. కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల వద్ద ఏర్పా టు చేసిన టెలిమెట్రీలను పరిశీలించేందుకు సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు చెందిన ముగ్గురు శాస్త్రవేత్త లు హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లారు. మంగళవారం పోతిరెడ్డిపాడు టెలిమెట్రీపై వారు పరిశీలన చేయనున్నారు. గతంలో హెడ్రెగ్యులేటర్ దిగువన 12.264 కి.మీ వద్ద ఉన్న పరికరంతో కచ్చితమైన లెక్కలు రావని తేలడంతో హెడ్రెగ్యులేటర్ దిగువన 1–3 కి.మీ. పరిధిలోనే పరి కరాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఆ ప్రదేశంలో సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంటు ప్రొఫైలర్ (ఎస్ఎల్డీసీపీ)ని ఎక్కడ ఏర్పాటు చేస్తే పోతిరెడ్డిపాడు నీటి విడుదలపై కచ్చితమైన లెక్కలు వస్తాయనే దానిపై సర్వే చేయనున్నా రు. అనంతరం సుంకేశుల బ్యారేజీ వద్ద కేసీ కెనాల్ను పరిశీలించి, అక్కడ ఏ ప్రదేశంలో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలనే దానిపై సర్వే చేస్తారు. బుధవారం నాగార్జునసాగర్ పరిధిలో టెలి మెట్రీ పాయింట్లకు అనువైన ప్రదేశాలపై సర్వే చేయనున్నారు. బ్రిజేశ్ విచారణ మళ్లీ వాయిదా.. తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణాజలాల పంపిణీ కోసం బ్రిజేశ్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణలో భాగంగా ఏపీ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలు కాకముందే వాయిదా పడింది. ఈ నెల 9–11 తేదీల్లో జరగాల్సిన క్రాస్ ఎగ్జామినేషన్ ఈ నెల 29–31 తేదీలకు వాయిదా పడింది. ఈ తేదీల్లో తమ తరఫు న్యాయవాది విదేశీ పర్యటనలో ఉంటారని ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ను కోరింది. దీంతో విచారణను వాయిదా వేస్తూ ట్రిబ్యునల్ అధికారికంగా సోమవారం 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. -
‘టెలీమెట్రీ’ ప్రాంతాల్లో మార్పులు
ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేలా నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల పరిధిలో ఏర్పాటు చేస్తున్న టెలీమెట్రీ పరికరాలు అమర్చే ప్రాంతాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముందుగా ప్రతిపాదించిన రెండు ప్రాంతాల్లో నెలకొన్న సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటిని మారుస్తూ కృష్ణా బోర్డు నిర్ణయం చేసింది. ఈ మేరకు మార్పులపై ఇరు రాష్ట్రాలకు మంగళవారం బోర్డు లేఖలు రాసింది. తొలి విడత జూరాల, శ్రీశైలం, సాగర్లో 18 చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, రూ.4 కోట్లతో వాటి ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. సాగర్ ఎడమ గట్టు కాల్వలపై ఏపీ, తెలంగాణ సరిహద్దులో 101.36 కిలోమీటర్ వద్ద టెలీమెట్రీ ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించగా, దాన్ని 102.63 కిలోమీటర్కు మార్చాలని నిర్ణయించారు. ఇక పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ దిగువన 600 మీటర్ల వద్ద టెలీమెట్రీకి ప్రతిపాదించగా, దాన్ని శ్రీశైలం కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్ పాయింట్కు మార్చాలని నిర్ణయించారు. ముందుగా నిర్ణయించిన ప్రతిపాదిత ప్రాంతంలో వాటిని అమర్చడం సహేతుకంగా లేని దృష్ట్యానే దీన్ని మార్చాల్సివస్తోందని బోర్డు మంగళవారం ఇరు రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది. అయితే తెలంగాణ అధికారుల వివరణ మాత్రం ఇంకో రకంగా ఉంది. పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలీమెట్రీ పరికరాలు పూర్తిస్థాయి డిశ్చార్జిలను చూపడం లేనందునే మార్పులు జరిగినట్లుగా వారు పేర్కొంటున్నారు. ఇక్కడ పూర్తి స్థాయి ప్రవాహాలను లెక్కించాలంటే పూర్తి ఆటోమెటిక్ సెన్సార్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. రాష్ట్ర వాదనను దృష్టిలో పెట్టుకొని మరో చోట ఏర్పాటుకు బోర్డు నిర్ణయం చేసిందని తెలుస్తోంది. కాగా జూరాల పరిధిలో 7 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉండగా అందులో 6 చోట్ల ఇప్పటికే అమర్చడం పూర్తయింది. సాగర్ పరిధిలో 3చోట్ల త్వరలో పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోంది. శ్రీశైలంలో మాత్రం 4చోట్ల ఏర్పాటుకు సంబంధించి ఇంకా పరిశీలన దశలోనే ఉంది.