telangana kesari
-
మే 4 నుంచి ‘తెలంగాణ కేసరి’ రెజ్లింగ్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ సంఘం (టీఐఎస్డబ్ల్యూఏ) ఆధ్వర్యంలో మే 4 నుంచి 7 వరకు తెలంగాణ కేసరి, సీనియర్ అంతర్ జిల్లా రెజ్లింగ్ చాంపియన్షిప్ జరుగనుంది. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఐఎస్డబ్ల్యూఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ తేదీలను ఖరారు చేశారు. ఈ సమావేశంలో టీఐఎస్డబ్ల్యూఏ అధ్యక్షుడు బి. విజయ్ కుమార్ యాదవ్, కార్యదర్శి అభిమన్యు యాదవ్లు నగరంలోని వివిధ అఖాడాలకు చెందిన ఉస్తాద్ ఖలీఫాలతో పోటీల విషయమై చర్చలు జరిపారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ఈ పోటీల్లో తెలంగాణ కేసరి టైటిల్ విభాగంలో తొలి మూడు స్థానాల్లో నిలిచే వారికి ‘బుల్లెట్ బైక్’తోపాటు వెండి గద, నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. -
ఫైజల్కు తెలంగాణ కేసరి టైటిల్
ఎల్బీ స్టేడియం: బాబయ్య వస్తాద్ స్మారక తెలంగాణ రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఓపెన్ కేటగిరీ (82 -120 కేజీలు) టైటిల్ను సయ్యద్ అబ్దుల్ ఫైజల్ (జై భవాని వ్యాయామశాల) చేజిక్కించుకున్నాడు. బాలకేసరి టైటిల్ను టి.దేవిసింగ్ (లాలా తాలీమ్) గెలుచుకున్నాడు. టి.కిషన్ సింగ్ (రహీం పురా పీజీ)కు రెండో స్థానం లభించింది. ఎల్బీ ఇం డోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఓపెన్ కేటగిరీ ఫైనల్లో ఫైజల్ 5-3 స్కోరుతో జాఫర్ బిన్ ముబారక్పై విజయం సాధించాడు. హబీబ్ ఖాన్ (బాబామ్ అకాడమీ)కు మూడో స్థానం దక్కింది. తెలంగాణ కేసరి నిర్వహిస్తాం: నాయిని రెజ్లింగ్ పోటీల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో మాట్లాడి త్వరలోనే తెలంగాణ కేసరి పోటీలను భారీ ఎత్తున నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు జాఫర్, తెలంగాణ ఇండియున్ స్టయిల్ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు విజయకుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.