-
తణుకులో అగ్ని ప్రమాదం; 50 ఇళ్లు దగ్ధం
సాక్షి,తణుకు(పశ్చిమగోదావరి): తణుకు సజ్జాపురంలోని మల్లికాసులపేటలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో చెలరేగిన మంటలు దాదాపు 2 గంటలపాటు విలయతాండం చేశాయి. నివాసితులంతా ఎక్కువ సంఖ్యలో చర్చికి వెళ్లడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సుమారు 50 ఇళ్లు కాలిబూడిదవ్వడంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. మంటలతో పలు ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. సిలిండర్ల శకలాలు 2 కిలోమీటర్లు దాటి పడటం తణుకు వాసులను భయబ్రాంతులకు గురిచేసింది. మంటలు మర లా మరలా విజృంభించి మొత్తం చుట్టేశాయి. తణుకులోని సజ్జాపురంలో రైల్వేగేటు, జాతీయ రహదారి వంతెన ప్రాంతానికి సమీపంలో ఉండే మల్లికాసులపేటలో సుమారుగా వెయ్యి గజాల ప్రాంతంలో ఇంటికి మరో ఇల్లు చేర్చి ఉండే పరిస్థితి ఉంది. నాలుగు స్తంభాలు మీద షెడ్డు నిర్మాణం చేసి బరకాలే గోడలుగా ఏర్పాటుచేసుకుని ఈ పేదవర్గాలు నివాసం ఉంటున్నాయి. స్వయంశక్తితో బతికేవాళ్లు సుమారు 50 ఏళ్లుగా అదే ప్రాంతంలో నివాసముంటున్న వీరంతా స్వయంశక్తితో బతికే పేదవర్గాలు. ఇంటింటికీ తిరిగి సోఫాలు కుట్టడం, ఫినాయిల్, యాసిడ్ అమ్మడం, ప్లాస్టిక్ పూలు, వ్యర్థాలతో ఫ్లవర్వాజ్లు తయారు చేసి అమ్ము కుంటూ ఆడ, మగా జీవనం సాగిస్తున్నారు. 4 ఫైర్ ఇంజన్లు.. 3 వాటర్ ట్యాంకులు తణుకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కొంతమేర వీరు మం టలు అదుపుచేసినా మరలా మంటలు పెరిగాయి. ఇళ్ల మధ్యకు వాహనం రాలేని పరిస్థితుల్లో జాతీయ రహదారి పైనుంచి నీరు చిమ్ముతూ మంటలను అదుపుచేశారు. మంటల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తాడేపల్లిగూడెం, అత్తిలి, ఏలూరు అగ్నిమాపక వాహనాలు ఇక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశాయి. స్పందించిన అధికార యంత్రాంగం తహసీల్దార్ ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ముందుగా 10 కేజీల బి య్యం, ఆర్థిక సాయంగా రూ.5 వేలు ప్రభుత్వం నుంచి అందచేసినట్లు తెలిపారు. నిత్యావసరాల కొనుగోలు కోసం కలెక్టర్ నుంచి రావాల్సిన రూ.2 వేలు సాయం సోమవారం అందచేస్తామని చెప్పారు. ఇళ్ల మధ్యకు అగ్నిమాపక వాహనం వెళ్లలేని పరిస్థితుల్లో తణుకు మునిసిపల్ కమిషనర్ జి.సాంబశివరావు మూడు వాట ర్ ట్యాంకులను పంపించి మంటలను అదుపుచేయించారు. మునిసిపల్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సజ్జాపురం యువకులు మంటలను ఆర్పడంలో సాయపడ్డారు. రూ.5 లక్షలు సాయం ఇవ్వాలి తణుకు: అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన 73 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి పీవీ ప్రతాప్ డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు గార రంగారావు, కె.నాగరత్నంతో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆయన బాధితులను పరామర్శించారు. బాధితులకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించాలని కోరారు. కట్టుబట్టలే మిగిలాయ్ నా కొడుకు ఇంటికి ఇప్పటివరకు కరెంటులేదు. నిన్నే రూ.10 వేలు అప్పుచేసి మరీ కరెంటు పెట్టించాం. ఇంకా లైటు కూడా వెలిగించలేదు. అగ్నికి మొత్తం ఇల్లంతా కాలిబూడిదయ్యింది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం. –సంగం రంగమ్మ, బాధితురాలు -
పప్పు, ఆవకాయ బాగుందే..!
తణుకు టౌన్ : విదేశీ యువకులు తణుకు పట్టణంలో సోమవారం సందడి చేశారు. ఆధ్యాత్మిక యాత్రలో బాగంగా తణుకు పట్టణం వచ్చిన ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒలీవర్ అతని మిత్రుడు స్థానిక అమూల్య మెస్లో భోజనం చేశారు. కేవలం శాఖాహార భోజనాన్నే వారు స్వీకరించారు. ఆంధ్రా భోజనం రుచిగా ఉందన్నారు. తమ దేశంలోనైతే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వరి అన్నంతో భోజనం చేస్తామని చెప్పారు. ఫ్రాన్స్లో రోజూ రొట్టెలు, స్నాక్స్ తిని జీవించే తమకు ఇక్కడ హోటల్స్లో వడ్డించే ప్రతి కూర రుచికరంగానే వుందని పేర్కొన్నారు. అన్నంలో పప్పు, ఆవకాయ మరీ రుచికరంగా ఉందన్నారు. కాకపోతే తమ దేశంలో పంటలపై పురుగుమందుల వాడకం తక్కువని చెప్పారు. -
తణుకులో చేపల వాన!
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం మేఘాల నుంచి చేపలు పడ్డాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. పెరవలి వై.జంక్షన్ సమీపంలోని డీ-2 విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో చేపలు రోడ్డుపై పడటంతో కొందరు యువకులు వాటిని ఏరుకున్నారు. అయితే, ఇవి ఆకాశం నుంచి పడ్డాయా లేక పక్కనే ఉన్న పంట కాలువలోంచి రోడ్డుపైకి కొట్టుకువచ్చాయా అనేది తెలియరాలేదు. ఆ ప్రాంతంలో వర్షం కురిసినప్పటికీ.. చేపలు మాత్రం ఆకాశం నుంచి కిందపడలేదని స్థానికులు చెబుతున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement