breaking news
tamil culture
-
ఈ రాష్ట్రాన్ని తమిళులు తప్ప ఎవరూ పాలించలేరు: రాహుల్
సాక్షి, చెన్నై: తమిళనాడులో రాహుల్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కన్యాకుమారిలోని ఓ కళాశాలలో విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేశారు. బస్కీలు తీశారు. నాగర్కోయిల్ జిల్లాలో రాహుల్ మాట్లాడుతూ తమిళ ప్రజలు తప్ప తమిళనాడుని ఎవ్వరూ పాలించలేరన్నారు. నిజంగా తమిళ ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో వారిదే విజయమని, వారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని రాహుల్ స్పష్టం చేశారు. మోదీ దగ్గర తలవంచిన తమిళ సీఎం పళని రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహించలేరన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా, తమ రాష్ట్ర ప్రజలకు వినమ్రతను ప్రదర్శించాలని చెప్పారు. ఆర్ఎస్ఎస్, మోదీ తమిళ భాషను, తమిళ సంస్కృతిని అవమానించారని, ఈ రాష్ట్రంలో వారిని అడుగుపెట్టనివ్వొద్దని రాహుల్ తమిళ ప్రజలను కోరారు. మోడీ ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర, ఒకే జాతి, ఒకే నాయకుడి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. మరి తమిళం దేశ భాష కాదా? బెంగాలీ భాష దేశ భాషకాదా? తమిళ సంస్కృతి, బెంగాల్ సంస్కృతి ఈ దేశ సంస్కృతి కాదా? అని రాహుల్ సూటిగా ప్రశ్నించారు. భారత దేశంలోని అన్ని భాషలను, తమిళ భాషను, సంస్కృతినీ, చరిత్రను కాపాడటం తన కర్తవ్యం అని రాహుల్ చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లాగే రాష్ట్రంలో పళని స్వామి ప్రభుత్వం తమిళ ప్రజల భాషని గౌరవించడం లేదన్నారు. విభిన్న భాషా, సంస్కృతికి విరుద్ధంగా ‘‘ఒకే సంస్కృతి, ఒకే జాతి, ఒకే చరిత్ర’’అనే సిద్ధాంతాన్ని ముందుకు తెస్తోన్న వారిని దూరంగా ఉంచడంలో తమిళనాడు దేశానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. కన్యాకుమారిలోని ములగుమూడులో స్కూల్ విద్యార్థులతో మాట్లాడిన రాహుల్ గాంధీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పరీక్షను తమిళనాడు రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయని, నీట్ పరీక్ష విద్యార్థులకు ఉపయోపడేది కాదని రాహుల్ అన్నారు. స్కూల్కి రావడానికి ముందు కొందరు విద్యార్థులతో కలిసి టీ తాగిన రాహుల్, వారిలోని ఒక విద్యార్థి వ్యోమగామి కావాలనుకోవడం చాలా మంచి విషయమని అన్నారు. అతడిని స్పేస్ స్టేషన్లోకి అనుమతించాల్సిందిగా కోరతూ ఇస్రో చైర్మన్కి లేఖ రాస్తానన్నారు. రాహుల్తో మాట్లాడిన విద్యార్థులు రాహుల్ని అన్నా అని సంబోధిస్తూ, మీరు మీ ఆరోగ్యం కోసం ఏమైనా ప్రత్యేక డైట్ తీసుకుంటారా అని ప్రశ్నించారు. దానికి రాహుల్నేను రన్నింగ్ చేస్తాను, స్విమ్మింగ్, సైక్లింగ్ కూడా చేస్తానని సమాధానమిచ్చారు. నేను అకిడో మార్షల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నానని రాహుల్ చెప్పారు. అలాగే, జపాన్ అకిడో మార్షల్ ఆర్ట్లో వారికి ఓ టెక్నిక్ని ప్రదర్శించి చూపించారు. -
ఇక తమిళ సినిమాలు చూస్తా: రాహుల్
తమిళనాడు ప్రజలన్నా, వాళ్ల భాష, సంస్కృతి అంటే తనకు ఎంతో ఇష్టమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. ఇకమీదట తాను తమిళ సినిమాలు చూస్తానని, తమిళ ప్రజల సంస్కృతి గురించి తెలుసుకోడానికి పుస్తకాలు చదువుతానని కూడా చెప్పారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశం సందర్భంగా ఆయనీ విషయాలు తెలిపారు. తాను తన సోదరి ప్రియాంకకు ఒక ఎస్ఎంఎస్ చేశానని, తమిళనాడు వెళ్లడమంటే తనకెంతో ఇష్టమని అందులో చెప్పానని అన్నారు. ఎందుకో తెలియదు గానీ, తమిళ ప్రజలతో తనకు చాలా అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారు. తమిళం అన్నా, తమిళులన్నా తనకెంతో ప్రేమ ఉందని చెప్పినప్పుడు ప్రియాంక కూడా తనదీ అదే ఫీలింగ్ అని చెప్పారన్నారు. ఈ సమావేశంలో తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు తిరునావక్కరసర్, సీఎల్పీ నేత కేఆర్ రామస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు. ఉపనిషత్తులు చదువుకుంటున్నా చదువుకోడానికి వయసుతో పనిలేదంటారు. అందుకే.. రాహుల్ గాంధీ ఇప్పుడు మళ్లీ పుస్తకాలు తీశారు. అయితే ఇవి క్లాసు పుస్తకాలు కాదట, ఉపనిషత్తులు, భగవద్గీత అని స్వయానా ఆయనే చెబుతున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి వీటిని ఎందుకు చదువుతున్నారంటే... ఆర్ఎస్ఎస్, బీజేపీల మీద ఎదురుదాడి చేయడానికట!! ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీయే వెల్లడించారు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతున్న సందర్భంగా ఆయనీ విషయం తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలతో తలపడేందుకు తాను ఈ మధ్య ఉపనిషత్తులు, భగవద్గీత చదువుతున్నానని అన్నారు. ఉపనిషత్తులలో ప్రజలంతా సమానమేనని చెబుతున్నా వాళ్లు మాత్రం కొంతమందిని అణగదొక్కుతున్నారని, తద్వారా మీ సొంత మతం చెప్పేదానికి భన్నంగా ప్రవర్తిస్తున్నారని తాను ఆర్ఎస్ఎస్ వాళ్లను అడుగుతానన్నారు. అసలు బీజేపీవాళ్లకు భారతదేశం అంటే అర్థం కావట్లేదని, వాళ్లకు కేవలం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న 'నాగ్పూర్' మాత్రమే అర్థమవుతుందంటూ చురకలు వేశారు. ప్రపంచంలో ఉన్న విజ్ఞానం అంతా కేవలం ప్రధాని మోదీ నుంచే వచ్చిందని వాళ్లు అపోహ పడుతున్నట్లు చెప్పారు.