breaking news
tailoring workshop
-
ఇంటి వద్దకే టైలరింగ్ సేవలు..! ఐడియా మాములుగా లేదుగా..
ఇప్పడంతా ఆన్లైన్ పుణ్యామా అని డోర్డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆహారం, షాపింగ్, కిరాణ సరుకులు వరకు అన్ని ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవడం..నేరుగా ఇంటికే డెలివరీ అవ్వడం టకటక జరిగిపోతోంది. చెప్పాంలటే..పెద్దపెద్ద బడా కంపెనీలన్నీ ఇంటివద్దకే వచ్చి సేవలందించే బాటలోకి వచ్చేశాయి. ఆ కోవలోకి టైలరింగ్ వంటి సేవలు కూడా వస్తే..ఇక పని మరింత సులవు కదూ..!. అలాంటి వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి..హాయిగా జీవనం సాగిస్తూ..అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఆంద్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాకు చెందిన 58 ఏళ్ల దర్జీ ఎస్.కె. కలీషా. అతడికి ఈ ఆలోచన ఎలా వచ్చింది..?. ఈ ఆలోచనతో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడా అంటే..ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో నివాసం ఉండే ఎస్.కె. కలీషా తొలుత గ్రామంలో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకుని టైలరింగ్ చేసేవారు. దశాబ్ద కాలం వరకూ కుటుంబ పోషణకు ఏ మాత్రం ఇబ్బంది పడేవారు కాదు. ఇద్దరు పిల్లలతో హాయిగా జీవించారు. అలాగే అక్కడ గ్రామస్థులు కూడా కాలేషా దుకాణం వద్దకు వచ్చి బట్టలు కుట్టించుకునేవారు. అయితే కాలం మారి రెడీమేడ్ ట్రెండ్ కావడం, యువత ఆ దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వడంతో కలిషాకి బతుకుదెరువు భారంగా మారింది. ఇలా లాభం లేదనుకుని ఎలాగైనా తనకు తెలిసిన ఈ వృత్తి ద్వారానే అధిక ఆధాయం ఆర్జించాలని స్ట్రాంగ్గా డిసైడయ్యారు కలిషా. అలా పుట్టుకొచ్చింది ఇంటివద్దకే టైలరింగ్ సేవలందించాలనే ఆలోచన. ఎందుకంటే ప్రస్తుతం పలు రకాల సేవలూ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటం తోపాటు కొన్ని సంస్థలు ఈ తరహాలో లాభాలను ఆర్జిస్తున్న విధానాన్ని తెలుసుకుని ఆ పంథాలోకే తన వృత్తిని పట్టాలెక్కించారు కలీషా. ఇక తాను కూడా ఇంటి వద్దకే సేవలందించి ఆదాయాన్ని మరింతగా పెంచుకోవాలనుకున్నారు. అందుకు నాలుగు చక్రాల వాహనం అవసరమవుతుంది. కానీ అదికొనే స్థోమత లేకపోవడంతో ఓ రిక్షాను కొని దానికి కుట్టుమిషన్ను అనుసంధానించారు. ఎక్కడికైనా తీసుకుని వెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేశారు. తొలుత తన గ్రామంలోని కాలనీల్లో తిరిగి ఇంటివద్దకే వెళ్లి పాత, చిరిగిన బట్టలు కుట్టడం ప్రారంభించారు. దీంతో అతని ఆదాయం కూడా పెరిగింది, కుటుంబ పోషణ కూడా హాయిగా సాగిపోయింది. అయితే రానురాను ఆ రిక్షా తొక్కుకుంటూ వెళ్లడం కష్టమైపోవడంతో..కుటుంబ సన్నిహితులు, స్నేహితుల సాయంతో టీవీఎస్ కస్టమ్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి, దానికి మొబైల్ టైలరింగ్ దుకాణంగా సవరించి సేవలందించడం ప్రారంభించానని చెప్పుకొచ్చారు. పెనమలూరు మండలంలో రోజుకో గ్రామం చొప్పున తిరుగుతూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. అవసరం ఉన్న వాళ్లు నేరుగా కాలేషాకు ఫోన్ చేసి మరీ పిలింపించుకుని బట్టలు కుట్టించుకుంటారట. అలా రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ టైలరింగ్ వల్ల అప్పులు బాధలు ఉండవని, ఆదాయం నేరుగా జేబులోకి వస్తోందని అంటున్నారు షేక్ కాలేషా. ప్రస్తుతం ఆయన పెనమలూరు, పోరంకి, వనకూరు ప్రాంతాల వరకే తన టైలరింగ్ సేవలు పరిమితం చేశానని అన్నారు. ఎందుకంటే ఈ వయసులో ఈ ప్రాంతాలను దాటి వెళ్లడం తనకు కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. చివరగా ఆయన.. ఎవ్వరూ కూడా తాము చేపట్టిన వృత్తిని ఆదరించడం లేదని ఆందోళన చెందకూడదని, వినూత్నంగా ఆలోచించి సేవలందిస్తే.. సత్ఫలితాలు వస్తాయని యువతకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు కలేషా. అదే బాటలో మరో జంట..తిరువనంతపురంకు చెందిన అనిష్ ఉన్నికృష్ణన్ గాయత్రి కృష్ణ దంపతులు తమ "సీవ్ ఆన్ వీల్జ్" అనే వెంచర్తో మొబైల్ టైలరింగ్ సేవలందిస్తున్నారు. ఆ దంపతులు దీన్ని టెంపో ట్రావెలర్ సాయంతో నిర్వహిస్తున్నారు. వాళ్లు పెళ్లికూతురు దుస్తుల నుంచి అల్టరేషన్ వరకు అన్ని రకాల సేవలందిస్తారు. సాధారణంగా టైలర్లు ఆల్టరేషన్ పనులు చేపట్టడానికి ఇష్టపడరు , అయితే ఈ దంపతులు ఆల్టరేషన్ పనే ప్రధానంగా.. సేవలందించి కస్టమర్ల మన్ననలను అందుకుంటున్నారు.ఇదంతా చూస్తుంటే ముందు ముందు..ఇంటి వద్ద టైలరింగ్ సేవలు పొందొచ్చన్నమాట. అటు వారికి ఆదాయం, మనకు సమయం ఆదా అవ్వడమేగాక, నచ్చిన విధానంగా కుట్టించుకునే వెసులబాటు దొరుకుతుందన్న మాట. అంతేగాదు పరిస్థితులు సవాలుగా మారినప్పుడూ.. అవకాశాలను దొరకబుచ్చుకోవటం అంటే ఈ కలీషా, ఉన్ని కృష్ణన్ దంపతుల సక్సెస్ని చూస్తుంటో తెలుస్తోంది కదూ..!.(చదవండి: ఆధ్యాత్మికత నుంచి.. ఏకంగా కంపెనీ సీఈవోగా ప్రస్థానం..) -
అన్లైన్ ఫ్యాషన్.. సేవల ఓషన్
శ్రీనగర్కాలనీలో నివసించే దివ్య గచ్చిబౌలిలోని బొటిక్లో డ్రెస్ స్టిచ్చింగ్ కి ఇచ్చారు.. స్టిచ్చింగ్ పూర్తయ్యాక వాళ్ల ఇంటికి ర్యాపిడో ద్వారా పంపారు. తీరా ఇంటికి వచ్చిన డ్రెస్ ధరించి చూస్తే కొన్ని ఆల్టరేషన్స్ అవసరం అని అర్థమైంది.. బొటిక్ వారిని సంప్రదిస్తే.. తమకు ఆ డ్రెస్ని ఇస్తే ఆల్టరేషన్స్ చేసి మరో రెండు రోజుల్లో పంపిస్తామన్నారు. కానీ దివ్య అదే రోజు ఫంక్షన్కు వెళ్లాల్సి ఉంది.. మరేం చేయాలి? ‘ఇలాంటి సమస్య మాతో రాదు మేం డ్రెస్ని మాత్రమే ఇంటికి పంపం. టైలర్, కుట్టుమిషన్తో సహా పంపిస్తాం. ఏవైనా మార్పు చేర్పులు ఉంటే క్షణాల్లో చేసేసి ఇస్తాం’ అంటోంది ఓ ఆన్లైన్ స్టిచ్చింగ్ సంస్థ. అమెరికాలో ఉంటున్న నగరవాసికి సిటీలోని ఓ ప్రముఖ వస్త్ర షోరూమ్లో ఓ చీర నచ్చింది. అయితే అది కొని తన దగ్గరకు పంపించినా, ఆ చీరకు మ్యాచింగ్ బ్లౌజ్, సీకో వర్క్ వగైరాల కోసం అమెరికాలో వెదకడానికి సమయంతో పాటు వ్యయం కూడా ఎక్కువే..! మరేం చేయాలి? ‘అంత కష్టం మీకక్కర్లేదు. ఆ షోరూమ్లో మీరు కొన్న చీర నేరుగా మాకే వస్తుంది. దానికి అవసరమైన బ్లౌజ్, వర్క్స్ పూర్తి చేసి భద్రంగా అమెరికా చేర్చే బాధ్యత మాదే’ అంటోంది మరో స్టిచ్చింగ్ సంస్థ. ఒకటా రెండా.. దుస్తులు/ఫ్యాబ్రిక్స్ కొనడం, వాటిని కుట్టించడం, అంతేనా.. అందంగా చీర కట్టించడం.. దాకా కాదు ఏ సేవాకు ఆన్లైన్లో అసాధ్యం అంటున్నాయి నగరంలో పుట్టుకొచి్చన పలు ఆన్లైన్ ఫ్యాషన్ బ్రాండ్స్. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆన్లైన్ టైలరింగ్ సేవలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విజృంభిస్తూ.. అనూహ్యమైన రీతిలో దూసుకుపోతున్నాయి. ఈ తరహా ఆన్లైన్ విప్లవాలకు సారథ్యం వహిస్తున్న సంస్థల్లో అత్యధిక భాగం మహిళల ఆధ్వర్యంలోనే ఉండడం విశేషం. యాప్లోని మార్కెట్ ప్లేస్ ద్వారా.. ‘పలు చోట్ల పరిమిత విస్తీర్ణంలో ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ ఔట్లెట్స్ ఏర్పాటు చేశాం. వీటిలో ఒక డిజైనర్, ఒక కుట్టుమిషన్ వగైరాలు అందుబాటులోకి తెచ్చాం. కస్టమర్లు నేరుగా సంప్రదింపులు చేసి అక్కడే ఆర్డర్స్ ఇచ్చి వెళ్లొచ్చు. చిన్న చిన్న ఆల్టరేషన్స్ కూడా చేయించుకోవచ్చు.. ఇలాంటివెన్నో కస్టమైజ్డ్ డ్రెస్సింగ్కు జత చేస్తున్నాం. అలాగే కస్టమర్స్ మా యాప్లోని మార్కెట్ ప్లేస్ ద్వారా నగరంలోని పలు షోరూమ్స్ నుంచి కొనుగోలు చేసిన చీరలు, డ్రెస్మెటీరియల్స్ మాకు చేరిపోతాయి. వాటికి అవసరమైన హంగులన్నీ జతచేసి తిరిగి కస్టమర్కు చేరవేసే బాధ్యత మాది. చీరకు బ్లౌజ్ వగైరాలు కుట్టడం మాత్రమే కాదు, అవసరమైతే చీర కట్టడం కూడా మా సిబ్బందే చేస్తారు.. విభిన్న రకాల శారీ డ్రేపింగ్స్ సైతం చేస్తారు. అంటూ నగరవాసులకు తాము అందిస్తున్న సేవల జాబితాను ‘సాక్షి’కి వివరించారు సుషి్మత. నగరవ్యాప్తంగా దాదాపుగా 80కిపైగా డిజైనర్లు, పదుల సంఖ్యలో షోరూమ్స్తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారామె. నగరంలో మాత్రమే కాకుండా బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లోనూ క్లౌడ్ టైలర్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.సాఫ్ట్వేర్ నుంచి డిజైనర్ వేర్ దాకా.. ‘ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు ఏ సంస్థ లేదండీ. అలా చూస్తే ఇప్పుడు అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలే’ అంటారు సుషి్మత. మంచి ఆదాయాన్నిచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని, అంతకు మించిన ఆత్మసంతృప్తిని ఆశిస్తూ.. ఓ రెండేళ్ల క్రితం నగరంలో క్లౌడ్ టైలర్ పేరిట టైలరింగ్ సేవల్ని ప్రారంభించా. ఇంటి దగ్గరకే వచ్చి కొలతలు తీసుకుని ఫ్యాబ్రిక్స్ తీసుకెళ్లి, స్టిచి్చంగ్ పూర్తి చేసి తిరిగి ఇంటికే తెచ్చి ఇవ్వడం అనే ఏకైక సేవతో వేసిన తొలి అడుగుకే అద్భుతమైన స్పందన వచి్చంది. దీంతో ఇనుమడించిన ఉత్సాహంతో మా సేవల్ని కూడా విస్తరించాం. – సుష్మిత లక్కాకుల, ఫ్యాషన్ డిజైనర్కుట్టుమిషన్తో సహా పంపిస్తాం.. విదేశాల్లో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు చేసిన అనుభవం ఉన్న రుహిసుల్తానా.. నగరానికి వచ్చి ఆన్లైన్ టైలరింగ్ సేవల్ని అర్బన్ సిలాయీ పేరుతో ప్రారంభించారు. అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో కస్టమర్లకు చేరువయ్యారు.. పిక్, స్టిచ్, డెలివర్ అనే కాన్సెప్్టతో ఆమె ప్రారంభించిన ఈ సంస్థ పూర్తిగా ఆన్లైన్ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ‘ఇప్పుడీ రంగంలో మరికొందరు కూడా ఉన్నారు. అయితే చెప్పిన సమయానికి ఏ మాత్రం తేడా రాకుండా ఖచ్చితత్వంతో ఇచ్చే డెలివరీలో మాకు సాటి లేదు. అదే విధంగా ఇంటికి డ్రెస్ మాత్రమే కాదు ఆల్టరేషన్స్ అవసరమైతే కస్టమర్ కళ్ల ముందే దాన్ని కంప్లీట్ చేయడానికి ఓ మాస్టర్ని కుట్టుమిషన్తో సహా పంపిస్తాం’ అంటూ చెప్పారు. బంజారాహిల్స్లో ఓ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నా.. విదేశాల్లో సైతం మాకు కస్టమర్స్ ఉన్నారు. వారికి షిప్పింగ్ ద్వారా సేవలు అందిస్తున్నాం. త్వరలోనే ఇతర నగరాలకూ విస్తరించనున్నాం. – రుహిసుల్తానా, అర్బన్ సిలాయీ నిర్వాహకురాలు -
స్రీల శ్రమకు అర్థం లేదా..!
మహిళలకు ఉపాధి దానివల్ల వారికి ఆర్థిక స్వావలంబన సమాజంలో లైంగిక వివక్షను చెరపగలదు. కాని స్త్రీ, పురుషులకు ఉపాధి కల్పించడంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. తమ జీతభత్యాల బేరసారాల్లో స్త్రీల గొంతు బలపడుతున్నా వారు పొందుతున్నది తక్కువే. ఇక పనిచోట వారి శ్రమదోపిడి తీవ్రం. తమిళనాడులో విస్తారంగా ఉన్న రెడిమేడ్ దుస్తుల రంగంలో స్త్రీల పని పరిస్థితులు ఒక నమూనా. శ్రమ తప్ప ఆదాయం లేని ఉపాధి స్త్రీలకు కొనసాగాల్సిందేనా? స్త్రీలు ఉపాధి పొందాలంటే అంత సులభమా? చెంగల్పట్టులో ఉన్న అనేక ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ మాన్యుఫ్యాక్చర్ కంపెనీల్లో ఆ చుట్టుపక్కల పల్లెల్లోని స్త్రీలు వేలాదిగా పని చేస్తారు. వారంతా ఉదయం నాలుగున్నరకే లేచి ఇంట్లో వంట చేసి పిల్లలకు క్యారేజీలు కట్టి తాము టిఫిన్, లంచ్ కట్టుకుని ఏడూ ఏడున్నరకంతా కంపెనీ బస్సు కోసం నిలుచోవాలి. 9 గంటలకు ఫ్యాక్టరీలో డ్యూటీ ఎక్కితే తిరిగి సాయంత్రం 6 గంటల వరకూ నిలుచునే పని చేయాలి. మళ్లీ బస్సెక్కి ఇల్లు చేరి రాత్రి వంటకు పూనుకోవాలి. ఇంతా చేసి వారికి నెలకు దక్కేది ఎంతో తెలుసా? 9,500 రూపాయలు. సీనియర్లకైతే 10,500 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ కటింగు, ఫ్యాక్టరీలో ఇచ్చిన టీ, బిస్కెట్ల కటింగు పోను వచ్చే జీతం ఇంతే. కాని వీరు తయారు చేసిన బట్టలు పోలో, ఇండియన్ టెరైన్ వంటి బ్రాండ్లుగా యూరప్, జపాన్, కెనడా, అమెరికాల్లో ఖరీదైన వెలకు అమ్ముడుపోతాయి. తమిళనాడులో గార్మెంట్ ఫ్యాక్టరీల్లో 5 లక్షల మంది స్త్రీలు పని చేస్తున్నారు. మొత్తం ఆ రాష్ట్రంలో 18 లక్షల మంది టైలరింగ్ ఉపాధిలో ఉంటే వారిలో 60 శాతం మంది మహిళలు. తమిళనాడులో వ్యవసాయం తగ్గాక రైతు కూలీలుగా పని చేసే స్త్రీలు ఫ్యాక్టరీల వైపు అడుగులు వేస్తున్నారు. కాని వారి శ్రమను దోచుకునే సమస్త ఏర్పాట్లు ఇదివరకే జరిగిపోయి ఉన్నాయి. అందుకే ఇటీవల చెన్నైలో ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే స్త్రీలు నిరసన వ్యక్తం చేశారు. కోర్టులు కూడా వీరి జీతం పెంచమని చెప్పినా తమిళనాడులోని 500 మంది గార్మెంట్ ఫ్యాక్టరీల యజమానులు జీతాలు పెంచితే ఖర్చు పెరిగి ఆర్డర్లు తగ్గుతాయని, దుస్తుల కంపెనీలు ఆర్డర్లను శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలకు చీప్ కూలీల కోసం తరలిస్తాయని అభ్యంతరం చెబుతున్నారు. అయితే ఆ మాటలన్నీ సాకులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త జీతాలైనా ఎంతని? 15,000 మాత్రమే. ఆ 15 వేలు కూడా ఇవ్వం అంటున్నారు. స్త్రీలు ఉపాధి పొందితే ఆ ఆర్థిక స్వావలంబనతో వారిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు వారి అభిలాషల మేరకు నెరవేర్చుకోవచ్చు. భర్తమీద ఆధారపడవలసిన పని లేకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని వారికి లభిస్తున్న ఉపాధి వారికి ఏ ఆదాయమూ మిగల్చనిది అయితే ఆ శ్రమకు అర్థం లేదు. జీతాలు ఎప్పుడూ పురుషుల కోసమే అనే మైండ్సెట్ సమాజంలో పోలేదు. స్త్రీల జీతం కోసం పెంపునకు యోగ్యమైనదే అని గ్రహించినప్పుడే పరిస్థితిలో కొద్దిగానైనా మార్పు వస్తుంది. ఇవి చదవండి: మీ అమ్మాయికి చెప్పండి! -
సాక్షి ‘మైత్రి’కి విశేష స్పందన
సాక్షి, సిటీబ్యూరో: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు, స్వయం ఉపాధితో మెరుగైన భవితనందించేందకు ‘సాక్షి’ ప్రారంభించిన ‘మైత్రి మహిళ’కు విశేష స్పందన వస్తోంది. శుక్రవారం మైత్రి మహిళ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ వర్క్షాప్ (కుట్టు శిక్షణ)నకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఉషా మిషన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్షాప్లో అధునాతన డిజైన్లతో టైలరింగ్లో రాణించేందుకు అవసరమైన మెళుకువలను నిపుణుల పర్యవేక్షణలో నేర్పించారు. ‘మైత్రి మహిళ’ ఎంతో మందికి ఉపయోగపడుతోందని కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సంతోషం వ్యక్తంచేశారు. ఈ శిక్షణ ద్వారా టైలరింగ్లో వస్తున్న ఆధునాతన డిజైన్లు, మార్పులను తెలుసుకోగలిగామన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ‘సాక్షి’ మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా... వంటలు, స్వయం ఉపాధి, బోధన, వ్యాపార, ఆరోగ్య, న్యాయ సలహాల వంటి అంశాల్లో మహిళలకు శిక్షణ ఇస్తారు. ఇందులో పాల్గొనాలనుకునేవారు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 95055 55020 నంబర్లో సంప్రదించవచ్చు.