breaking news
The state government employees
-
డీఏపై కనికరించని ఆర్థిక శాఖ
గవర్నర్ ఆమోదించినా, పెండింగ్లో పెట్టిన అధికారులు జీవో జారీలో జాప్యం బిల్లుల సమర్పణకు గడువు 17 వరకే ఐఏఎస్లకు మాత్రం డీఏ వచ్చేసింది హెదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ) ఫైలును ఆర్థిక శాఖ తొక్కిపెట్టింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ మంజూరు చేస్తూ గవర్నర్ నరసింహన్ ఫైలుపై సంతకం చేశారు. ఇది జరిగి నాలుగు రోజులు గడిచినా, ఆర్థిక శాఖ జీవో జారీ చేయకుండా ఫైలును పెండింగ్లో పెట్టింది. వచ్చే నెల 2న రాష్ట్రం రెండుగా విడిపోతున్న నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ను ఈనెల 24నే చెల్లించేందుకు ఆర్థిక శాఖ జీవో కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో జనవరి నుంచి జూన్ వరకు ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే ఇవ్వాలన్న ఉద్యోగుల కోరికను ‘సాక్షి’ వెల్లడించింది. దీంతో ఆర్థిక శాఖ 8.56 శాతం డీఏ మంజూరు ఫైలును గవర్నర్కు పంపింది. గవర్నర్ వెంటనే దానికి ఆమోదం తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, గవర్నర్ సూచన మేరకు ఫైలును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ ఆమోదం కోసం పంపారు. భన్వర్లాల్ వెంటనే ఆమోదించారు. ఈ ఫైలు శుక్రవారం ఆర్థిక శాఖకు చేరింది. అప్పటి నుంచి ఆర్థిక శాఖ జీవో జారీ చేయకుండా ఫైలును పెండింగ్లో పెట్టింది. మరో పక్క ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపునకు బిల్లుల సమర్పణ గడువు ఈ నెల 17తో ముగుస్తోంది. అంటే గడువు ఇంకా 3 రోజులే ఉంది. ఈలోగా డీఏ జీవోను ఇవ్వకపోతే ఉద్యోగులకు కరువు భత్యం శాతం లెక్కకట్టి బిల్లుల సమర్పణ సాధ్యం కాదు. డీఏ ఇవ్వకపోతే గవర్నర్ సంతకానికి విలువ ఉండదని, ఆ ఉద్దేశంతోనే జీవో జారీ చేయకుండా ఆర్థిక శాఖ జాప్యం చేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు డీఏ జీవో జారీ కాకపోతే, వచ్చే నెలలో రాష్ట్ర విభజన జరిగాక సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే డీఏ చెల్లించాల్సి వస్తుంది. అంటే డీఏ మరింత జాప్యమవుతుంది. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని ఉమ్మడి రాష్ట్రంలోనే డీఏ మంజూరుకు వీలుగా వెంటనే జీవో జారీ చేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఐఏఎస్ అధికారులకు మాత్రం డీఏ మంజూరయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఐఏఎస్లు డీఏ తీసుకోనున్నారు. -
జీతాలు ఆలస్యం
30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కష్టాలు మొదటి వారంలో బిల్లులు స్వీకరించే అవకాశం సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు ఆలస్యం కానున్నాయి. ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తేదీకిచ్చే జీతాలు ఖజానా అధికారుల కారణంగా జాప్యమవుతున్నాయి. అధికారిక కారణాలు తెలియలేదుగానీ.. జీతాల బిల్లులేవీ తీసుకోవద్దన్న మౌఖిక ఆదేశాలు రాష్ట్ర ఖజానా అధికారుల నుంచి అందాయి. అక్కడి నుంచి ఉప ఖజానా కార్యాలయాలకు ఇప్పటికే చేరాయి. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీకి జీతాలొచ్చే పరిస్థితులు దాదాపు లేనట్టే! ప్రతి నెలా 25వ తేదీలోగా ఖజానా/ఉప ఖజానా కార్యాలయాలకు జీతా లు, ఇతరత్రా బిల్లులు సమర్పించాలి. 23 వరకు బిల్లులు తీసుకున్నా.. సోమవారం నుంచి బిల్లులపై నియంత్రణపెట్టారు. ఏటా ఆర్థిక సంవత్సరం చివర్లో ఖజానా శాఖ ఆంక్షలు తప్పనిసరి. కానీ అవి బకాయిలు, ఇతరత్రా చెల్లింపులకు మాత్ర మే పరిమితం. ఈసారి ఏకంగా జీతా ల బిల్లులే నిలిపేయాల్సిందిగా ఆదేశించారు. వీటితోపాటు ఉద్యోగుల సరెండర్ లీవు బిల్లులు, లీవ్ ఎన్క్యాష్మెంట్, పదవీ విరమణకు సంబంధిం చిన ఇతర బిల్లులు, గ్రాట్యుటీ బిల్లు లు, పంచాయితీల నిర్వహణకు సం బంధించిన బిల్లులు, పంచాయతీ సిబ్బంది జీతాలు ఆర్థికపరమైన అం శాలతో ఇప్పటికే అనుమతించలేదు. ఇప్పటికే తీసుకున్న బిల్లులకు కూడా జీతాలు పెట్టొద్దన్న ఆదేశాలున్నట్టు తెలిసింది. 010 పద్దు కిందకు వచ్చేవారితోపాటు సుమారు 30 వేల మంది ఉద్యోగులకు తిప్పలు తప్పేలా లేవు. ‘మధ్యాహ్న’ బిల్లులకూ బ్రేక్! మధ్యాహ్న భోజన బిల్లులకూ గత రెండు మాసాలుగా బ్రేక్ పెట్టారు. ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకపోతే అవి ఫ్రీజ్ అయ్యే పరిస్థితులున్నాయి. దీంతో మధ్యాహ్న భోజన కుకింగ్ వ్యయం, కుక్ కమ్ హెల్పర్ల జీతాల్లో మరింత జాప్యం నెలకొనే ప్రమాదముంది. ఒకసారి మధ్యాహ్న భోజన నిధులు ఫ్రీజ్ అయితే వాటిని మళ్లీ జిల్లాకు రప్పించడానికి నానా యాతనలు పడాలని అధికారులు చెప్తున్నారు.