breaking news
Several
-
ఆ దేశాల్లో ‘ఆయుధ ఫ్యాక్టరీలు’ నిర్మించాం.. ఎక్కడున్నాయో సిక్రెట్: ఇరాన్
అనేక దేశాల్లో ఆయుధ ఫ్యాక్టరీలు నిర్మించామంటూ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్తో భీకర యుద్ధం ముగిసి రెండు నెలలు గడవకముందే ఇరాన్ ప్రకటన సంచలనం రేపుతున్నాయి. అయితే, ఆయుధ తయారీ కేంద్రాలు ఎక్కడెక్కడ నిర్మించామనే విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచింది. ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నజీర్జాదే ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్షిపణి అభివృద్ధిపైనే తమ సైన్యం ప్రధాన దృష్టి పెట్టిందన్న ఆయన.. ఇటీవల ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో అత్యాధునిక క్షిపణులను మాత్రం వాడలేదంటూ చెప్పుకొచ్చారు.పలు దేశాల్లో ఆయుధ కర్మాగారాలు ఏర్పాటు చేశాం.. త్వరలోనే వాటిని అధికారికంగా తెరుస్తామంటూ నజీర్జాదే వెల్లడించారు. గత ఏడాది కాలంలో అభివృద్ధి చేసిన క్షిపణులు అత్యాధునిక, అత్యంత శక్తిమంతమైనవిగా ఆయన పేర్కొన్నారు. 12 రోజుల యుద్ధం ఆగకపోతే.. తమ క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకోలేకపోయేవని.. అందుకే అమెరికా జోక్యంతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందన్నారు.కాగా, ఎడతెరిపిలేకుండా భీకరంగా బాంబులేసుకుంటూ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్లు పోరుపంథాలోనే పయనించిన సంగతి తెలిసిందే. పోటాపోటీగా క్షిపణులు జారవిడుస్తూ రెండు దేశాల్లో యుద్ధం హోరాహోరిగా సాగింది. ఇజ్రాయెల్ను మరింత దెబ్బకొట్టేందుకు ఇరాన్ తన వద్ద పోగుబడిన క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. అయితే, ఇరాన్ క్లస్టర్ బాంబుల్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్లోని టెల్అవీవ్, హైఫా, బీర్షెబా, రెహోవోట్ నగరాలు సహా పలు ప్రాంతాలపై క్లస్టర్ బాంబులను వేయడంతో పెద్దసంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. తీరప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. -
కుండపోత.. జల దిగ్బంధంలో విజయవాడ (ఫొటోలు)
-
ఒకేఒక్క వ్యక్తి రోడ్డుపై సృష్టించిన బీభత్సం చూస్తే..వామ్మో! అని నోరెళ్లబెడతారు
-
ఒకేఒక్క వ్యక్తి రోడ్డుపై సృష్టించిన బీభత్సం చూస్తే..వామ్మో! అని నోరెళ్లబెడతారు:
కొంతమంది వేగంగా నడిపో లేక మద్యం తాగో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి వాళ్ల ప్రాణాలనే గాక ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి పడేస్తారు. మరికొందరూ ట్రాఫిక్ రూల్స్పై అవగాహన లేకనో లేక అనుకోకుండానో ప్రమాదవశాత్త ఘోర ప్రమాదాల బారిన పడటం కారణమవ్వటమో జరుగుతుంది.. ఇదంతా ఒక ఎత్తైతే ఇక్కడొక వ్యక్తి కేవలం రోడ్డుపై నడుస్తూ ఏకంగా ఎన్ని ప్రమాదాలకు కారణమయ్యాడో వింటే వామ్మ! అంటారు. అతను మూర్ఖత్వంగానో లేక ట్రాఫిక్ రూల్స్ తెలియక చేశాడో తెలియదు గానీ ఏకంగా రోడ్డు మధ్యలో నడిచి తన ప్రాణాల మీదకే కాకుండా ఇతరుల ప్రాణాలపైకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో సదరు పాదాచారుడి రోడ్డు మధ్యలో నడవడంతో ఒక కారుతో మరొక కారు ఢీ కొని వరుస రోడ్డు ప్రమాదాలకు కారణమయినట్లు కనిపిస్తుంది. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్లో రికార్డు అయ్యింది. ఈ ఘటనలో మొత్తం ఎంత నష్టం వాటిల్లిందనేది తెలియాల్సి ఉంది. Very lucky guy! pic.twitter.com/AC6w7o2NTp — Instant Karma (@Instantregretss) December 31, 2022 (చదవండి: ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు) -
స్కూలు బస్ ప్రమాదం.. చిన్నారుల మృత్యువాత
వాషింగ్టన్: అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. టెనస్సీ లోని ఓ పాఠశాలకు చెందిన బస్సు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రాణాంతకమైన ప్రమాదంలో పలువురు చిన్నారులు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. కిండర్ గార్టెన్ , ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 35 మందితో వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యల్ని చేపట్టారు. గాయపడిన చిన్నారులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంతమంది మరణించారనేది ఇపుడే చెప్పలేమని, తీవ్ర గాయాలపాలైన 20 మందిని ఆసుపత్రికి తరలించినట్టు ఛత్తనూగ పోలీసు అధికారి ట్రేసీ ఆర్నాల్డ్ తెలిపారు. అయితే ఎక్కువమంది చనిపోయి వుంటారని భావిస్తున్నామన్నారు. మరోవైపు హామిల్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఆరుగురు చనిపోయారని నివేదించింది. సుమారు 12 మంది పిల్లలు చనిపోయారని స్థానిక మీడియా వెల్లడించింది. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. We will be shooting for our 1st press briefing @ corner of Howard & Talley Rd @ 5:00 pm. #ChattFire pic.twitter.com/1bpnabsHmJ — Chattanooga FireDept (@ChattFireDept) November 21, 2016 -
ఛండీగడ్లో విషాదం