breaking news
services sectors
-
జీడీపీకి కొత్త జోష్!
న్యూఢిల్లీ: తయారీ, సేవల రంగాల రాణింపుతో దేశ జీడీపీ వృద్ధి రేటు డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 7.8 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4 శాతంతో పోలి్చతే కీలకమైన పండుగల సీజన్లో, అది కూడా జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత వృద్ధి వేగం నిదానించడం గమనార్హం. త్రైమాసికంగా నీరసించినప్పటికీ, 2024–25 సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం జీడీపీ వృద్ధి 7.4 శాతంతో పోలి్చతే మెరుగుపడింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.4 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు జీడీపీ గణాంకాలకు 2011–12 బేస్ సంవత్సరంగా ఉండేది. దీన్ని 2022–23కు మార్చారు. అలాగే, జీఎస్టీ, ఈ–వాహన్ పోర్టల్పై రిజి్రస్టేషన్ల డేటా, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (పీఎఫ్ఎంఎస్) డేటాను కొత్తగా జీడీపీ గణనలోకి చేర్చారు. దీంతో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ఈ వివరాలు విడుదల చేసింది. పాత కాలం నాటి గణనపై విమర్శలకు సమాధానంగా.. ఆర్థిక వ్యవస్థలో కీలకమైన డేటాకు చోటు కలి్పస్తూ, వాస్తవ వృద్ధిని ప్రతిఫలించేలా కేంద్రం సవరణలు తీసుకొచ్చింది. → కొత్త బేస్ సంవత్సరం ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 జీడీపీ వృద్ధి అంచనా 7.8% నుంచి 6.7 శాతానికి తగ్గింది. → క్యూ 2 (సెపె్టంబర్ క్వార్టర్) జీడీపీ వృద్ధి అంచనాను పాత బేస్ సంవత్సరం ఆధారంగా 8.2 శాతంగా అంచనా వేయగా, కొత్త బేస్ సంవత్సరం ఆధారంగా 8.4 శాతానికి సవరించారు. → 2025–26లో రియల్ జీడీపీ (స్థిర ధరల వద్ద) రూ.322.58 లక్షల కోట్లుగా ఉంటుంది. 2024–25 అంచనా రూ.299.89 లక్షల కోట్లతో పోలి్చతే వృద్ధి రేటు 7.6%గా ఉంటుంది. 2025–26 సంవత్సరం నామినల్ జీడీపీ వృద్ధి 8.6 శాతంగా ఉంటుంది. → కొత్త బేస్ సంవత్సరం ఆధారంగా 2023–24లో రియల్ జీడీపీ 7.2 శాతం, 2024–25లో 7.1 శాతానికి సవరించారు. → తయారీ రంగం 2025–26లో డబుల్ డిజిట్ వృద్ధిని సాధిస్తుంది. వాణిజ్యం, రిపెయిర్, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ సేవలు, స్టోరేజ్ రంగాల్లో వృద్ధి 10.1 శాతంగా ఉంటుంది.అంచనాలను మించే..జీడీపీ వృద్ధి గణాంకాలు తమ అంచనాలకు మించి ఉన్నట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. ‘వ్యవసాయం, మైనింగ్, విద్యుత్, నిర్మాణ రంగాల వల్లే జీడీపీ వృద్ధి మోస్తరు స్థాయికి పరిమితమైంది. తయారీ జీవీఏ మాత్రం వరుసగా ఐదో త్రైమాసికంలోనూ డబుల్ డిజిట్ వృద్ధి చెందింది. సేవల రంగం జీవీఏ వృద్ధి 7 త్రైమాసికాల గరిష్ట స్థాయి అయిన 9.5%కి మెరుగుపడింది. అంతక్రితం త్రైమాసికంలో (సెప్టెంబర్ క్వార్టర్) ఇది 9.3%గా ఉంది’ అని నాయర్ వివరించారు. 4 ట్రిలియన్ డాలర్లు దాటుతుంది..వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను కొత్త సిరీస్ ఆధారంగా, 20 బేసిస్ పాయింట్లు పెంచి (0.20 శాతం) 7–7.4 శాతానికి సవరించినట్టు.. జీడీపీ 4 ట్రిలియన్ డాలర్ల మార్క్ను అధిగమిస్తుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. 2026–27 ఆర్థిక సర్వేలో 6.8–7.2%గా అంచనా వేయడం గమనార్హం. నామినల్ జీడీపీ వృద్ధి 11 శాతానికి చేరుకోవచ్చన్నారు. గత మూడేళ్లలో తలసరి ఆదాయం వాస్తవంగా 6.3–6.4 శాతం పెరిగిందని.. అదే నామమాత్ర ప్రమాణంలో 3% కంటే ఎక్కువే ఉంటుందన్నారు. గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ కార్యదర్శి సౌరబ్ గార్గ్ మాట్లాడుతూ.. జీడీపీ గణనలోకి డేటా వనరులను పెంచడం వల్లే బేస్ సంవత్సరాన్ని 2022–23కు మార్చాల్సి వచి్చనట్టు వివరించారు. ఆర్థిక వ్యవస్థలో గత పదేళ్లలో ఎన్నో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, డిజిటల్ ఆర్థిక లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, దీంతో ఎన్నో డేటా వనరులు అందుబాటులోకి వచ్చినట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.3 శాతంగా ఉండొచ్చన్నారు. -
డిసెంబర్లో నెమ్మదించిన ‘సేవలు’
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం డిసెంబర్లో మందగించింది. ఇందుకు సంబంధించి బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 52.3గా నమోదయ్యింది. నవంబర్లో ఈ సూచీ 53.7 వద్ద ఉంది. అమ్మకాల్లో వృద్ధి మందగించడం దీనికి ప్రధానకారణమని ఆర్థిక సమాచార సేవల దిగ్గజ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీనా డీ లిమా పేర్కొన్నారు. నిజానికి బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీని ప్రాతిపదికన డిసెంబర్ వరకూ వరుసగా మూడవనెల బిజినెస్ యాక్టివిటీ సూచీ వృద్ధి ధోరణిలోనే ఉంది. బలహీన వ్యాపార ఆశావాద పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్లో ఉపాధి కల్పన తగ్గిందని, అమ్మకాలు మూడు నెలల కనిష్టానికి పడ్డాయనీ పోలీనా డీ లిమా వివరించారు. బ్రిటన్ కొత్త స్ట్రెయిన్, దీనితో తిరిగి గ్లోబల్ కోవిడ్–19 ప్రయాణపు ఆంక్షలు, డిమాండ్ పరిస్థితులపై ఆయా అంశాల ప్రతికూల ప్రభావం, 2020 చివరిలో భారత్ సేవల రంగాన్ని నెమ్మదింపజేసి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సేవలు, తయారీ రెండూ కలిపినా తగ్గుదలే! కాగా సేవలు, తయారీ రెండు రంగాలూ కలిపిన కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ కూడా నవంబర్తో పోల్చితే డిసెంబర్లో 56.3 నుంచి 54.9కి పడిపోయింది. ‘‘అయితే 2021లో ఉత్పత్తి పెరుగుతుందన్న ఆశావహ అంచనాలను కంపెనీలు కొనసాగిస్తున్నాయి. అయితే 2021 తొలి కాలంలో సవాళ్లు కొనసాగుతాయి. అయితే అటు తర్వాత సుస్థిర రికవరీ కొనసాగుతుంది. కోవిడ్–19 లభ్యత ఒకసారి ప్రారంభమైన తర్వాత మరింతగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయి’’ అని పోలీనా డీ లిమా పేర్కొన్నారు. -
చైనాను అధిగమించిన భారత్ తయారీ, సేవల వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ తయారీ, సేవల రంగాలు ఫిబ్రవరిలో చైనాలోని ఇదే రంగాలతో పోల్చితే మంచి పనితీరును కనబరిచాయి. హెచ్ఎస్బీసీ సర్వే ఒకటి గురువారం ఈ విషయాన్ని తెలిపింది. భారత్కు సంబంధించి హెచ్ఎస్బీసీ కాంపోజిట్ ఇండెక్స్ 53.5 వద్ద ఉంది. చైనా విషయంలో ఈ సూచీ 51.8 వద్ద ఉంది. బ్రెజిల్ సూచీ 51.3 వద్ద, రష్యా 44.7 వద్ద ఉంది. హెచ్ఎస్బీసీ సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే వృద్ధి ధోరణిగా, దిగువన ఉంటే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. మూడు రోజుల క్రితం భారత్కు సంబంధించి ఒక్క తయారీ రంగం పనితీరును హెచ్ఎస్బీసీ సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. హెచ్ఎస్బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) కూర్పు ఆధారంగా రూపొందించిన ఈ గణాంకాల ప్రకారం భారత తయారీ రంగ సూచీ ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2015 ఫిబ్రవరిలో ఈ సూచీ 51.2 పాయింట్లుకాగా, 2015 జనవరిలో 52.9 పాయింట్లు.


