breaking news
sannapureddy suresh reddy
-
కేసీఆర్తో చంద్రబాబు కుమ్మక్కు
నెల్లూరు(బారకాసు): రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అటువంటి వ్యక్తితో చంద్రబాబు సయోధ్య కుదుర్చుకున్నారని, అందులో ఆంతర్యమేమిటని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్రెడ్డి ప్రశ్నించారు. గురువారం నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కుటుంబ పరిపాలన కొనసాగిస్తూ తెలంగాణాలో ఫిరాయింపులు తీసుకొచ్చిన కేసీఆర్ గుణాత్మకమైన రాజకీయాలు గురించి ఎలా మాట్లాడుతారన్నారు. ఇటువంటి వ్యక్తితో చంద్రబాబు చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని ప్రధాని మోదీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు గ్లోబెల్స్ ప్రచారం జరుగుతుందనేది నేడు రుజువైందన్నారు. ఈ ప్రచారమంతా కొద్ది రోజులు మాత్రమేనన్నారు. మోదీని అప్రదిష్టపాలు చేయాలని టీడీపీ ఎప్పుడో స్క్రిప్ట్ రెడీ చేసుకుందని, ఓ పథకం ప్రకారంగానే వ్యవహరిస్తూ నిన్నటి రోజున ఈ పథక రచన బయటపెట్టారన్నారు. అంతేకాకుండా టీడీపీ, కాంగ్రెస్లు దోబూచులాడుతున్నాయని ఇదంతా కేవలం ప్రధాని మోదీ చరిష్మాను దెబ్బతీసేందుకేనని చెప్పారు. తమ పార్టీనీ, నాయకుడిపై అనవసరమైన ఆరోపణలు చేస్తే చేస్తూ ఊరుకోబోమని, తాము కూడా టీడీపీ అక్రమాలను ఎండకట్టేందుకు గ్రామగ్రామాన తిరిగి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్, నాయకులు కరణం భాస్కర్, మొద్దు శ్రీను, మారుతికుమార్రెడ్డి, సునీల్రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, సురేష్నాయుడు పాల్గొన్నారు. -
సీఎంది రెండు నాల్కల ధోరణి
నెల్లూరు(బారకాసు): ప్రధాని నరేంద్రమోదీని కలిసి సంతోషాన్ని వ్యక్తం చేసి తిరిగి అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఏపీ విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని.. ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్తానని సీఎం చంద్రబాబు పేర్కొనడం రెండు నాల్కల ధోరణిని అవలంబించడమేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల తప్పులు, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ, కేంద్రంపై నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టను దిగజార్చేందుకు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, ఇది తగదని హితవు పలికారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనే విషయం ఎక్కడా లేదని, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మాత్రమే కేంద్రం ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి రూ.22 వేల కోట్లను ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, ఇప్పటికే రూ.ఏడు వేల కోట్లను ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై కేంద్రానికి స్పష్టమైన నివేదికలివ్వకుండా కేంద్రం నిధులను మంజూరు చేయడంలేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నేరాలు తగ్గాలి, శిక్షలు పెరగాలని కలెక్టర్ల సదస్సులో సీఎం చెప్పారని, అయితే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్, నాయకులు కరణం భాస్కర్, కోసూరు భాస్కర్గౌడ్, మొద్దు శ్రీను, ముడియాల శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు హామీలు ఏమయ్యాయి'
-
'చంద్రబాబు హామీలు ఏమయ్యాయి'
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ నేతలపై ఆ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి బుధవారం నెల్లూరులో మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిధులిస్తున్నా టీడీపీ నేతలు వ్యతిరేక ప్రచారం చేయడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా పేరుతో మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఢిల్లీలో మోదీని పొగిడి... రాష్ట్రానికి వచ్చి ఏంచేయలేదని టీడీపీ నేతలు చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ ఇంతవరకు అమలు కాలేదని గుర్తు చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని సురేష్ రెడ్డి ప్రశ్నించారు.