-
4 నెలల గరిష్టానికి రూపాయి
ముంబై, సాక్షి: వారాంతాన ఒడిదొడుకులకు లోనైన దేశీ కరెన్సీ హుషారుగా ప్రారంభమైంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 19 పైసలు పుంజుకుని 72.93 వద్ద ప్రారంభమైంది. డాలరుతో మారకంలో తదుపరి 72.90 వరకూ బలపడింది. ఇది నాలుగు నెలల గరిష్టంకాగా.. ఒక దశలో 73.03 వరకూ బలహీనపడింది కూడా. గత వారం పలు దేశాల కరెన్సీ మార్కెట్లకు సెలవుకావడంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య 73.12 వద్ద ముగిసింది. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 32 నెలల కనిష్టం 90 దిగువకు చేరిన విషయం విదితమే. ఇంతక్రితం 2018 ఏప్రిల్లో మాత్రమే డాలరు ఇండెక్స్ ఈ స్థాయిలో కదిలినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. (2020: ఎఫ్పీఐల పెట్టుబడుల స్పీడ్) వ్యాక్సిన్ల ఎఫెక్ట్ కోవిడ్-19 కట్టడికి వీలుగా వారాంతాన ప్రభుత్వం ఒకేసారి రెండు వ్యాక్సిన్లకు ఆమోదముద్ర వేయడంతో దేశీ కరెన్సీకి జోష్ వచ్చినట్లు ఫారెక్స్ నిపుణులు తెలియజేశారు. దీంతో ఆర్థిక వ్యవస్థ వేగవంత రికవరీని సాధించగలదన్న అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. దీనికితోడు అక్టోబర్ 1 నుంచీ చూస్తే దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో సుమారు 20 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడం రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్లో దేశీ ఈక్విటీలలో ఎఫ్పీఐలు గత 12 ఏళ్లలోలేని విధంగా 8.1 బిలియన్ డాలర్లను పెట్టుబడులకు తరలించిన విషయం విదితమే. మరోపక్క డిసెంబర్లో రికార్డ్ స్థాయి జీఎస్టీ వసూళ్లు, కరెంట్ ఖాతా మిగులు వంటి అంశాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. -
రెండో రోజూ రూపాయి పరుగు
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ జోరు చూపుతోంది. ప్రస్తుతం డాలరుతో మారకంలో 25 పైసలు బలపడి 73.06 వద్ద ట్రేడవుతోంది. ఇది రెండున్నర నెలల గరిష్టంకాగా.. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో తొలుత 15 పైసలు పుంజుకుని 73.16 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఒక దశలో 73.05 వరకూ బలపడింది. బుధవారం సైతం డాలరుతో మారకంలో రూపాయి 11 పైసలు లాభపడి 73.31 వద్ద స్థిరపడింది. చదవండి: (2020: ఎఫ్పీఐల పెట్టుబడుల స్పీడ్) కారణాలేవిటంటే.. ఇటీవల కొద్ది రోజులుగా డాలరు ఇండెక్స్ బలహీనపడుతోంది. తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో 90 దిగువకు చేరింది. 89.64 వద్ద 32 నెలల కనిష్టాన్ని తాకింది. ఇంతక్రితం 2018 ఏప్రిల్లో మాత్రమే డాలరు ఇండెక్స్ ఈ స్థాయిలో కదిలినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఆసియా దేశాల కరెన్సీలు పుంజుకోవడం సెంటిమెంటు బలపడేందుకు దోహదం చేసినట్లు తెలియజేశాయి. ప్రధానంగా చైనా తయారీ రంగం జోరందుకోవడంతో డాలరుతో మారకంలో యువాన్ 6.54ను తాకింది. దేశీ ఎఫెక్ట్ సెప్టెంబర్కల్లా కరెంట్ ఖాతా 15.5 బిలియన్ డాలర్ల మిగులుకు చేరినట్లు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా దేశీ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల వెల్లువెత్తడం వంటి అంశాలు రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. దేశీ ఈక్విటీ మార్కెట్లో గత 12 ఏళ్లలోలేని విధంగా ఎఫ్పీఐలు నవంబర్లో 8 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయగా.. డిసెంబర్లోనూ 5 బిలియన్ డాలర్లకుపైగా పంప్చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో 2020లో ఇప్పటివరకూ 22.6 బిలయన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
రూపాయి డీలా.. ఎందుకు ఇలా?
ముంబై: ఆర్థిక రికవరీ సంకేతాలు బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో దేశీ కరెన్సీ మార్చికల్లా జోరందుకోగలదని రీసెర్చ్ సంస్థ నోమురా హోల్డింగ్స్ అంచనా వేసింది. వెరసి డాలరుతో మారకంలో రూపాయి తిరిగి కోవిడ్-19కు ముందు స్థాయి 72కు చేరుకోగలదని అభిప్రాయపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూపాయి 72 స్థాయిలో ట్రేడయ్యింది. ఇందుకు 2004 తదుపరి కరెంట్ ఖాతాలోటు నుంచి బయటపడటంతోపాటు మిగులుదిశగా పయనించడాన్ని ప్రస్తావించింది. ఇటీవల చమురు ధరలు పతనంకావడం, బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ పరిస్థితులు మెరుగుపడటం రూపాయికి బలాన్నివ్వగలవని పేర్కొంది. నేలచూపులో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహాయ ప్యాకేజీ ప్రకటన, పసిడి, ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో తాజాగా దేశీ కరెన్సీ వెనకడుగు వేస్తోంది. ప్రస్తుతం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 33 పైసలు (0.4 శాతం) కోల్పోయి 74.70ను తాకింది. ఇది రెండు నెలల కనిష్టం కాగా.. తొలుత 7 పైసలు తక్కువగా 74.44 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి మరింత క్షీణించింది. బుధవారం కన్సాలిడేషన్ బాటలో సాగిన రూపాయి 74.37 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి 4.2 శాతం నష్టపోవడం గమనార్హం! -
కొనసాగుతున్న రూపాయి పతనం
గత వారం సాంకేతికంగా కీలకమైన 74 ఎగువకు క్షీణించిన దేశీ కరెన్సీ మరోసారి డీలాపడింది. ప్రస్తుతం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 37 పైసలు(0.4 శాతం) కోల్పోయి 74.78ను తాకింది. ఇది రెండు నెలల కనిష్టంకాగా.. మంగళవారం రూపాయి కన్సాలిడేషన్ బాటలో ఫ్లాట్గా ముగిసింది. దేశీ ఈక్విటీ మార్కెట్ హైజంప్ చేసినప్పటికీ అక్కడక్కడే అన్నట్లుగా 74.41 వద్ద ముగిసింది. యూఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 94 దిగువకు బలపడింది. మరోపక్క అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ అంశాల నేపథ్యంలో ఇటీవల రూపాయి బలహీనపడినట్లు ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. సమీక్షలో భాగంగా ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించే వీలున్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా చర్యలు ప్రకటించవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అభిప్రాయపడింది. రూపాయి సమీప భవిష్యత్లో 75.20- 74.20 మధ్య ప్రతికూల ధోరణిలో కదిలే వీలున్నట్లు అంచనా వేసింది. -
రూపాయి బోర్లా- 74 ఎగువకు
సెకండ్ వేవ్లో భాగంగా పలు యూరోపియన్ దేశాలతోపాటు.. యూఎస్లోనూ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో దేశీ కరెన్సీకి సైతం ఆ సెగ తగులుతోంది. తాజాగా డాలరుతో మారకంలో సాంకేతికంగా కీలకమైన 74 ఎగువకు చేరింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 17 పైసలు కోల్పోయి 74.05ను తాకింది. ఆగస్ట్ 27 తదుపరి ఇది కనిష్టంకాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో ఇటీవల డాలరు బలపడుతూ వస్తున్న విషయం విదితమే. తాజాగా డాలరు 0.3 శాతం పుంజుకుని 93.41ను తాకింది. ఇది రూపాయిని దెబ్బతీసినట్లు ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. బుధవారం డాలరుతో మారకంలో రూపాయి 73.88 వద్ద ముగిసింది. ఇతర అంశాలూ.. కోవిడ్-19 భయాలతో స్టాక్ మార్కెట్లు పతనంకావడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు వంటి అంశాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా వైరస్ కట్టడికి వీలుగా బ్రిటన్ బాటలో తాజాగా జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలలోనూ ఆంక్షలు విధిస్తుండటంతో ఆర్థిక వ్యవస్థ రికవరీకి దెబ్బతగిలనున్న అంచనాలు బలపడుతున్నాయి. దీనికితోడు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మరో భారీ ప్యాకేజీని ప్రకటించే అంశంలో యూఎస్ కాంగ్రెస్ విఫలంకావడం ఇన్వెస్టర్లను నిరాశపరచినట్లు తెలియజేశారు. కాగా.. సమీపకాలంలో రూపాయి 73.40- 74.05 మధ్య ప్రతికూలంగా కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నగదు సీజ్
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement