breaking news
Rs .4
-
ఫ్యూచర్ రిటైల్ లాభం రూ.73 కోట్లు
రూ.4,130 కోట్ల నికర అమ్మకాలు ముంబై: ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన ఫ్యూచర్ రిటైల్ సంస్థ స్టాండ్ అలోన్ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.73 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో తమ కంపెనీకి రూ.57 కోట్ల నష్టాలు వచ్చాయని ప్యూచర్ రిటైల్ తెలిపింది. గత క్యూ2లో రూ.360 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ2లో రూ.4,130 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఈ క్యూ2లో మొత్తం వ్యయాలు రూ.4,071 కోట్లుగా ఉన్నాయని వివరించింది. విలీన స్కీమ్ కారణంగా ఈ క్యూ2 ఫలితాలను, గత క్యూ2 ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి రూ.144 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) సాధించామని పేర్కొంది. నికర అమ్మకాలు రూ.769 కోట్ల నుంచి రూ.8,021 కోట్లకు పెరిగాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఫ్యూచర్ రిటైల్ షేర్ 2 శాతం లాభపడి రూ.124 వద్ద ముగిసింది. -
‘ఫీజు’ ఇచ్చేదెప్పుడు?
-
‘ఫీజు’ ఇచ్చేదెప్పుడు?
* రెండేళ్ల ఫీజు రీయింబర్స్మెంట్కు కావాల్సింది రూ.4,800 కోట్లు * ఈ ఏడాది ఇప్పటిదాకా ఇచ్చింది రూ.వెయ్యికోట్లే * రెండున్నర నెలల్లో మరో రూ. 3,800 కోట్లు అవసరం * ఈ మార్చికల్లా గతేడాది ఫీజు బకాయిలు మాత్రమే చెల్లించే అవకాశం సాక్షి, హైదరాబాద్: మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం (2015-16) ముగియబోతున్నా.. బడుగు, బలహీన, అణగారిన వర్గాల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు మాత్రం నిధులు విడుదల కావడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద గత ఏడాది (2014-15) బకాయిలే సుమారు రూ.2,400 కోట్లు ఉండగా... ఈ ఏడాది (2015-16) చెల్లించాల్సినవి మరో దాదాపు రూ.2,400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అంటే మొత్తంగా రూ. 4,800 కోట్ల వరకూ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు విడుదలైన నిధులు సుమారు రూ. వెయ్యి కోట్లే కావడం గమనార్హం. మిగతా సుమారు 3,800 కోట్లను వచ్చే రెండు నెలల్లో చెల్లించడం సాధ్యమయ్యేనా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. బకాయిలే చెల్లించలేదు.. గత ఏడాది మొత్తం 13,76,026 మంది విద్యార్థులకు సంబంధించి కాలేజీలకు ట్యూషన్ ఫీజు (ఆర్టీఎఫ్) కింద రూ. 1,900 కోట్లు, విద్యార్థులకు మెయింటెనెన్స్ ఫీజు (ఎంటీఎఫ్)కింద రూ. 500 కోట్లు అవసరమని ఈ పథకానికి నోడ ల్ ఏజెన్సీగా ఉన్న ఎస్సీ అభివృద్ధిశాఖ అంచనాలను రూపొందించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం(2015-16)లో మొత్తం 13,69,564 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. వీరికి పూర్తిస్థాయిలో ఫీజులను చెల్లించేందుకు దాదాపుగా రూ. 2,400 కోట్ల మేర నిధులు అవసరం. మరో రెండు నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుండగా... గత ఏడాది బకాయిలే సగం వరకు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాదికి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులే మొదలుపెట్టలేదు. విడుదలైనవి రూ. 1,070 కోట్లే.. ఈ నెల 11వ తేదీ వరకు అందుబాటులో ఉన్న వివరాలను పరిశీలిస్తే... 2014-15 ‘ఫీజు’ బకాయిల కోసం రూ.1,070 కోట్లను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. అంటే గతేడాది బకాయిలను పూర్తిగా చెల్లించడానికే ఇంకా రూ. 1,400 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది. ఇక 2015-16కు సంబంధించి ఇంకా కాలేజీలకు ట్యూషన్ ఫీజులు, విద్యార్థులకు స్కాలర్షిప్ల చెల్లింపే మొదలుకాలేదు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తుంటే మార్చి చివరికల్లా గతేడాది బకాయిలను విడుదల చేయడమే కష్టంగా కనిపిస్తోంది. ఈ లెక్కన ప్రస్తుత ఏడాది నిధుల విడుదల వచ్చే ఏడాదికే వాయిదా పడే అవకాశం కనిపిస్తోందనే అభిప్రాయాలు వస్తున్నాయి. -
యాపిల్ చీఫ్ టిమ్ కుక్...రూ.4,700 కోట్ల విరాళం
న్యూయార్క్: టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ (54).. సామాజిక సేవా కార్యక్రమాల కోసం యావదాస్తిని దానం చేయనున్నట్లు తెలిపారు. తన సోదరుని కుమారుడి కాలేజీ చదువుకు అయ్యే ఖర్చులను పక్కన పెట్టి, మిగతాదంతా ఇచ్చివేయనున్నట్లు వెల్లడించారు. సాధారణంగా పబ్లిసిటీకి దూరంగా ఉండే టిమ్ కుక్.. ఫార్చూన్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలిపారు. ఫార్చూన్ అంచనాల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 785 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 4,710 కోట్లు) ఉంటుంది. యాపిల్లో ప్రస్తుతం ఆయనకి ఉన్న షేర్ల విలువ 120 మిలియన్ డాలర్లు కాగా, మరో 665 మిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లు ఆయనకు దఖలుపడనున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాలకు బిలియనీర్ ఇన్వెస్టరు వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తదితరులు ఇప్పటికే బిలియన్ల కొద్దీ డాలర్లు వితరణ చేస్తున్న సంగతి తెలిసిందే.