-
రబీ పంట రుణాలు 39 శాతమే
సాక్షి, హైదరాబాద్: రైతులను ఆదుకోవాల్సిన బ్యాంకులు వారిని పట్టించుకోవడంలేదు. సకాలంలో ఇవ్వాల్సిన పంట రుణాలు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నాయి. ఈ రబీలో ఇప్పటికే 31.18 లక్షల ఎకరాల్లో (99%) పంటలు సాగు కాగా, ఇప్పటి వరకు ఇచ్చిన పంట రుణాలు 39.12 శాతమే. రబీలో రూ.19,496 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, బ్యాంకులు ఇచ్చింది రూ. 7,627 కోట్లేనని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. 7.60 లక్షల మంది రైతులకు పంట రుణాలు ఇచ్చినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) ఇటీవల వ్యవసాయ శాఖకు ఇచ్చిన నివేదికలో తెలిపింది. బ్యాంకుల్లో రుణం దొరకకపోవడంతో రైతులు వ్యవసాయ పనులకు అవసరమైన డబ్బు కోసం ప్రైవేటు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్లోనూ లక్ష్యం మేర పంట రుణాలు ఇవ్వలేదు. గడిచిన ఖరీఫ్లో రూ.29,244 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.18,711 కోట్లు మాత్రమే ఇచ్చాయి. అంటే ఖరీఫ్ లక్ష్యంలో 63.98 శాతం మాత్రమే ఇచ్చాయి. -
రుణ మాఫీ కోసం ఎదురుచూపు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఈసారి జిల్లాలో ఖరీఫ్, రబీ పంటల రుణాలను అధికారులు లక్ష్యానికి మించి ఇచ్చారు. 2,26,282 మంది రైతులకు రూ.1,863.65 కోట్ల పంట రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్ల నివేదికలు తెలుపుతున్నాయి. 2013-14 వార్షిక రుణ లక్ష్యం 94.22 శాతం నెరవేరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రూ.53 కోట్ల మేరకు బంగారం తాకట్టుపై రుణాలిచ్చిందని నివేదికలిచ్చారు. 2013-14 ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.1152.6 కోట్లు కాగా రూ.1,075.24 కోట్లు ఇచ్చినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అదే విధంగా రబీ లక్ష్యం రూ.768.4 కోట్లు కాగా రైతులకు రూ.734.77 కోట్లు పంపిణీ చేసి 95.65 శాతం లక్ష్యం చేరుకున్నారు.. మొత్తంగా 2013-14లో రూ.1,921 కోట్లకు గాను రూ.1,810.01 కోట్లు పంపిణీ చేశారు. పంటల రుణాలకు ఈసారి కూడ ప్రభుత్వం కనిష్టంగా, గరిష్టంగా ఎకరానికి ఎంత రుణం ఇవ్వచ్చన్న ప్రతిపాదనలను సూచించింది. పత్తి పంట వేస్తే ఎకరం విస్తీర్ణానికి రూ.20 వేల నుంచి రూ.21,500 ఇవ్వాల్సి ఉండగా రూ.12 వేల నుంచి 13 వేలు ఇచ్చారు. అలాగే వరి పంటలు వేసిన రైతులకు ఎకరానికి రూ.19 వేల నుంచి రూ.20 వేల వరకు పంట రుణం ఇవ్వాల్సి వుండగా అధికంగానే ఇచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement