breaking news
Primary teachers
-
32 వేల మంది టీచర్ల కొలువులు భద్రం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో 32 వేల మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు భారీ ఊరట లభించింది. వారి నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ బుధవారం తోసిపుచ్చింది. టీచర్ల నియామక పరీక్షలో విజయం సాధించలేని కొందరు అభ్యర్థుల కారణంగా మొత్తం వ్యవస్థ ప్రభావితం కావడానికి వీల్లేదని స్పష్టంచేసింది. పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఇప్పటిదాకా నిరూపణ కాలేదని పేర్కొంది. తొమ్మిదేళ్లపాటు టీచర్లుగా కొనసాగిన వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తే వారిపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించింది. పరీక్షల్లో అక్రమాల కేసులో కొనసాగుతున్న విచారణను ఆధారంగా చేసుకొని వారి నియామ కాలను రద్దు చేయలేమని వివరించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వును సమర్థించేందుకు నిరాకరించింది. ఆ 32,000 మంది ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుబాటు అవుతాయని తేల్చిచెప్పింది. సింగిల్ బెంచ్ తీర్పు పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు. వేలాది మంది టీచర్ల కుటుంబాలకు న్యాయస్థానం గొప్ప ఓదార్పును ఇచ్చిందని పేర్కొన్నారు. యువత కోసం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం తప్ప వారి ఉద్యోగాలను తొలగించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. న్యాయమూర్తులు మానవతా దృక్పథంతో ఆలోచించి, తీర్పు ఇచ్చారని తెలిపారు. -
ప్రభుత్వ నిర్ణయంతో వణికిపోతున్న టీచర్లు!
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయంతో ఢిల్లీలోని ప్రైమరీ స్కూళ్ల టీచర్లు వణికిపోతున్నారు. కరోనాకు నెలవైన ప్రాంతాల్లో సర్వే విధులు నిర్వర్తించాలని సర్కార్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. కోవిడ్ కేసులతో హాట్స్పాట్లు ఉన్న చోట పీపీఈ కిట్లు కూడా లేకుండా ఎలా పనిచేస్తామని వాపోతున్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో తగ్గినట్టే కనిపించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఇంటింటి సర్వే చేసి బాధితుల వివరాలు కనుక్కొని వృద్ధులు, గర్భిణీ మహిళలకు సంరక్షణకు చర్యలు చేపట్టాలని ఢిల్లీ ప్రభుత్వం భావించింది. నిర్ధారణ పరీక్షలు చేయించుకునేలా ప్రజల్లో అవగాహన పెంచనుంది. దానికోసం 9525 బృందాలని ఏర్పాటు చేసింది. (చదవండి: మళ్లీ మహమ్మారి విజృంభణ) ఒక్కో బృందంలో ఒక ప్రైమరీ టీచర్/బూత్ లెవల్ ఆఫీసర్, ఒక నర్స్, ఒక పోలీస్ సిబ్బంది ఉంటారు. ఐదు రోజులపాటు సాగనున్న ఈ సర్వే నేడు ప్రారంభమైంది. ప్రతి బృందం రోజుకు 30 ఇళ్లను సర్వే చేయాల్సి ఉంటుంది. ప్రతి 10 లేక 15 బృందాలకు ఒక టీజీటీ/పీజీటీ టీచర్ పర్యవేక్షకుడిగా ఉంటారు. ‘నవంబర్ 19 రాత్రి 10.30 గంటలను నా మొబైల్ నెంబర్ను కోవిడ్-19 సర్వే డ్యూటీ 2020 అనే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. రేపటి నుంచి ఫలానా హాట్స్పాట్ ప్రాంతంలో విధులు నిర్వహించాలని వాట్సాప్ మెసేజ్లో పేర్కొన్నారు. మరైతే మా రక్షణ కోసం పీపీఈ కిట్లను ప్రభుత్వం సమకూర్చనుందా? అని ప్రశ్నిస్తే.. అలాంటిదేం లేదనే సమాధానం వచ్చింది. మాకు ఒకలాంటి గందరగోళ, ఆందోళనకర పరిస్థితి ఇది’అని ఒక ప్రైమరీ టీచర్ మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే కోసం థర్మల్ గన్, పల్స్ ఆక్సీ మీటర్, టిష్యూ పేపర్, శానిటైజర్లు ఇస్తే సరిపోతుందా? అని మరికొంతమంది టీచర్లు ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ బాధితుల సర్వే చేయిస్తున్న ప్రభుత్వం టీచర్ల సేఫ్టీని మరిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: మాస్కు ధరించకుంటే రూ.2 వేలు ఫైన్!) -
ప్రాథమికోన్నత టీచర్లకు 11 నుంచి శిక్షణ
ఒంగోలు వన్టౌన్ : జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతులకు గణితం, సామాన్యశాస్త్రం బోధిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఈ నెల 11వ తేదీ నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి వల్లభనేని శ్రీనివాసరావు తెలిపారు. గణితం, సామాన్యశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయులు వారికి కేటాయించిన కేంద్రాల్లో ఆయా తేదీల్లో మూడు రోజుల పాటు శిక్షణకు హాజరుకావాలని ఆయన కోరారు. మొత్తం 18 మండల కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దీనికోసం హైదరాబాద్లో శిక్షణ పొందిన రిసోర్స్పర్సన్లు, కోర్స్ డెరైక్టర్లకు శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో ప్లానింగ్ సమావేశం జరుగుతుందన్నారు. రిసోర్సుపర్సన్లు, కోర్సు డెరైక్టర్లు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని ఆయన సూచించారు. జిల్లాలో శిక్షణ కేంద్రాలు, సబ్జెక్టు టీచర్లు, తేదీల వివరాలు... చీరాలలో చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల టీచర్లకు శిక్షణ ఇస్తారు. 11 నుంచి 13వ తేదీ వరకు గణితం, 18 నుంచి 20వ తేదీ వరకు సైన్స్ టీచర్లకు శిక్షణ ఇస్తారు. పర్చూరులో పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు మండలాల టీచర్లకు శిక్షణ ఇస్తారు. 11 నుంచి 13 వరకు సైన్స్, 18 నుంచి 20 వరకు గణితం మార్టూరులో మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు, యద్దనపూడి మండలాలు. 21 నుంచి 23 వరకు గణితం, 25 నుంచి 27 వరకు సైన్స్ అద్దంకిలో అద్దంకి, ముండ్లమూరు, జె.పంగులూరు, కోరిశపాడు మండలాలు. 21 నుంచి 23 వరకు సైన్స్, 25 నుంచి 27 వరకు గణితం ఒంగోలు-1లో ఒంగోలు, మద్దిపాడు మండలాలు. 11 నుంచి 13 వరకు గణితం, 18 నుంచి 20 వరకు సైన్స్ ఒంగోలు-2లో కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు మండలాలు. 11 నుంచి 13 వరకు సైన్స్, 18 నుంచి 20 వరకు గణితం చీమకుర్తిలో తాళ్లూరు, చీమకుర్తి, సంతనూతలపాడు మండలాలు. 21 నుంచి 23 వరకు గణితం, 25 నుంచి 27 వరకు సైన్స్ పొదిలిలో పొదిలి, దర్శి, మర్రిపూడి, కురిచేడు, దొనకొండ, కొనకనమిట్ల మండలాలు. 21 నుంచి 23 వరకు సైన్స్, పొదిలి, దర్శి, మర్రిపూడి మండలాల టీచర్లకు 25 నుంచి 27 వరకు గణితం దొనకొండలో కురిచేడు, దొనకొండ, కొనకనమిట్ల మండలాలు. సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు గణితం కందుకూరులో కందుకూరు, పొన్నలూరు, కొండపి మండలాలు. ఈ నెల 11 నుంచి 13 వరకు గణితం. కందుకూరు, పొన్నలూరు, కొండపి, వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల సైన్స్ టీచర్లకు 18 నుంచి 20 వరకు... సింగరాయకొండలో ఉలవపాడు, గుడ్లూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాలు. ఈ నెల 11 నుంచి 13 వరకు సైన్స్, 18 నుంచి 20 వరకు గణితం వలేటివారిపాలెంలో వలేటివారిపాలెం, లింగసముద్రం, పామూరు మండలాలు. ఈ నెల 21 నుంచి 23 వరకు గణితం కనిగిరిలో కనిగిరి, పీసీ పల్లి మండలాలు. ఈ నెల 25 నుంచి 27 వరకు గణితం, కనిగిరి, పీసీపల్లి పామూరు మండలాల సైన్స్ టీచర్లకు 21 నుంచి 23 వరకు... వెలిగండ్లలో హనుమంతునిపాడు, వెలిగండ్ల, సీఎస్ పురం మండలాలు. ఈ నెల 25 నుంచి 27 వరకు సైన్స్, సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు గణితం మార్కాపురంలో తర్లుపాడు, పెద్దారవీడు, మార్కాపురం మండలాలు. ఈ నెల 11 నుంచి 13 వరకు గణితం, 18 నుంచి 20 వరకు సైన్స్ యర్రగొండపాలెంలో యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాలు. ఈ నెల 11 నుంచి 13 వరకు సైన్స్, 18 నుంచి 20 వరకు గణితం కంభంలో కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాలు. ఈ నెల 21 నుంచి 23 వరకు గణితం, 25 నుంచి 27 వరకు సైన్స్ గిద్దలూరులో గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలాలు. ఈ నెల 21 నుంచి 23 వరకు సైన్స్, 25 నుంచి 27 వరకు గణితం.


