breaking news
nuclear attacks
-
చిన్నారిని వీపుకి తగిలించుకున్న బాలుడెవరో తెలుసా!
చిన్నారిని వీపుకి తగిలించుకుని నుడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక బాలుడు. అతన్ని చూసిన ఒక సైనికుడు ఆ చిన్నారిని కిందకి దించి వెళ్లిపో అన్నాడు. ఐతే ఆ బాలుడు చెప్పిన మాటలు ప్రపంచ గతిని మార్చే చక్కటి సందేశం ఇచ్చాడు. ఇంతకీ ఆ బాలుడెవరు ఏంటా కథ! వివరాల్లోకెళ్తే... ఒక చిన్నారిని వీపుకి తగిలించుకుంటూ వెళ్తున్న బాలుడి చిత్రాన్ని డిసెంబర్ 30 2017న వాటికన్ప్రెస్ తర పత్రికలో ప్రచురించింది. ఇది నాగసాకిపై అణుదాడి తర్వాత జరిగిన పరిణామాల ఫోటోలలో ఒకటి ఇది. జపాన్ యుద్ధ సమయంలో దాదాపు 10 ఏళ్ల బాలుడు చనిపోయిన తన తమ్ముడిని ఖననం చేసేందుకు వీపుకి తగలించుకుని వెళ్తున్నాడు. అప్పుడూ అక్కడే ఉన్న ఒక సైనికుడు ఆ చిన్నారి చనిపోయాడు కాబట్టి ఇక్కడ వదిలి వెళ్లిపోమని సలహ ఇచ్చాడు. ఆ బాలుడు ఆ చిన్నారిని మోసుకుని వెళ్లలేక నీరసించిపోతాడని అలా చెబుతాడు సైనికుడు. కానీ ఆ చిన్నారి తన తమ్ముడని, ఇది తనకు బరువు కాదని చెబుతాడు. పడిపోతే సాయం చేయండి, ఎత్తండి, తప్పు చేస్తే క్షమించండి అని ఏడుస్తూ చెబుతాడు. ఐనా ఆ చిన్నారి బరువుగా ఉండడు కాబట్టి మీ భుజాలపైకి తీసుకుని సాయం చేయండి అని అర్థిస్తాడు. ఆ బాలుడి మాటలకు సైనికుడి కళ్లలో నీళ్లుతిరుగతాయి. అప్పటి నుంచి ఈ చిత్రం జపాన్లో ఐక్యతకు చిహ్నంగా మారింది. ఈ చిత్రాన్ని యూఎస్కి చెందిన మెరైన్ కార్ప్స్ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రోజర్ ఓడొనెల్ తన కెమారాలో బంధించారు. 1945లో హిరోషిమా, నాగసాకిపై అణు బాంబు దాడుల తర్వాత దృశ్యాలను డాక్యుమెంట్ చేసే బాధ్యతను ఓడొనెల్కు అప్పగించడంతో ఆయన ఈ చిత్రాన్ని తీశారు. ఆ ఫోటో వెనుక పోప్ ఫ్రాన్సిస్ 'ది ఫ్రూట్ ఆఫ్ వార్' అని రాసి సంతకం చేశారు. నాటి విషాధ ఘటన ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చిదనడంలో సందేహం లేదు. (చదవండి: దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్ పౌరుల తరలింపు) -
అణు వినాశనం ముంగిట ప్రపంచం: గుటెర్రస్
ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్లో యుద్ధం, మధ్యప్రాచ్యం, ఆసియా దేశాల్లో ఉద్రిక్తతలు ప్రపంచాన్ని అణు వినాశనం వైపుగా నడిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క అపోహ, పొరపాటు అంచనాతో మానవాళి మొత్తాన్ని అణ్వస్త్రాలు కబళించి వేస్తాయని హెచ్చరించారు. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ) అమలుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన సదస్సులో ఆయన మాట్లాడారు. వివిధ దేశాల వద్ద ప్రస్తుతం 13 వేల అణ్వాయుధాలు పోగుపడ్డాయని చెప్పారు. -
Sakshi Cartoon: ఆల్రెడీ! ఆర్థికంగా, రాజకీయంగా దేశంలో అదే పరిస్థితి ఉంది సార్! మళ్లీ..
ఆల్రెడీ! ఆర్థికంగా, రాజకీయంగా దేశంలో అదే పరిస్థితి ఉంది సార్! మళ్లీ వేయాల్సిన అవసరం లేదు! -
మేము తలచుకుంటే అరగంటలో నాటో దేశాలన్నీ ధ్వంసం: రోస్కోస్మోస్ చీఫ్
కీవ్/మాస్కో: రష్యా విక్టరీ డే వేడుకల నేపథ్యంలో ఉక్రెయిన్, రష్యా దేశాల ముఖ్య నేతల వ్యాఖ్యలు కలవరం పుట్టిస్తున్నాయి. తాజాగా రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము గనుక నిజంగా అణు యుద్ధం ప్రారంభిస్తే నాటో దేశాలన్నీ కేవలం అరగంటలో పూర్తిగా ధ్వంసమైపోతాయని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న దిమిత్రి రోగోజిన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. శత్రువు (పశ్చిమ దేశాలు)ను ఓడించడమే పుతిన్ లక్ష్యమని పేర్కొన్నారు. నాటో తమపై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతోందని మండిపడ్డారు. బహిరంగంగా అంగీకరించకపోయినప్పటికీ పశ్చిమ దేశాలు లోలోపల రష్యాపై యుద్ధం సాగిస్తున్నాయని ఆరోపించారు. శత్రువుపై అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం తమకు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అణు యుద్ధం ప్రపంచ పరిణామాలతోపాటు మన భూగోళం స్థితిగతులనే మార్చేస్తుం దని, అందుకే అది తమకు ఇష్టం లేదని వెల్లడిం చారు. బలవంతుడైన శత్రువును ఆర్థిక, సైనికపరమైన మార్గాల ద్వారా, సంప్రదాయ యుద్ధరీతులతోనే ఓడిస్తామని దిమిత్రి రోగోజిన్ పేర్కొన్నారు. చదవండి👉 రష్యా ‘విక్టరీ డే’.. పుతిన్ కీలక ప్రకటన? కాగా, 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యాలో ప్రతిఏటా మే 9న విక్టరీ డే జరుపుకుంటారు. ఈసారి ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో విక్టరీ డేకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. మే 9 రష్యా విక్టరీ డేను ఉద్దేశించి.. ‘చెడు మళ్లీ తిరిగొచ్చింది. అయితే, అది వేరే రూపంలో, వేర్వేరు నినాదాలతో వచ్చింది. కానీ, ప్రయోజనం మాత్రం అదే’ అని పేర్కొన్న సంగతి తెలిసిదే. కాకపోతే ఈసారి ఉక్రెయిన్ దాని మిత్రదేశాలు గెలుస్తాయని జెలెన్ స్కీ ధీమా వ్యక్తం చేశారు. మంచిపై చెడు ఎన్నడూ విజయం సాధించలేదని అన్నారు. చదవండి👉🏻 వేలంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి జాకెట్.. ఎంత ధర పలికిందంటే? -
Sakshi Cartoon: అణుయుద్ధం తప్పదు-నార్త్ కొరియా
అణుయుద్ధం తప్పదు-నార్త్ కొరియా -
Sakshi Cartoon: ...మీకు నాశనం చేయడమంటే ఎంతిష్టమో మాకు తెలుసు సార్!
...మీకు నాశనం చేయడమంటే ఎంతిష్టమో మాకు తెలుసు సార్! -
War: అమెరికాకు రష్యా కౌంటర్.. అణ్వాయుధాలు వాడుతాం
మాస్కో: ఉక్రెయిన్లో రష్యా బలగాలు దాడుల పర్వం పీక్ స్టేజ్కు చేరుకుంది. ఇరు దేశాల సైన్యం హోరహోరీగా పోరాడుతోంది. కాగా, యుద్దంలో రష్యా అణ్వాయుధాలను వాడుతున్నట్టు అమెరికా ఇప్పటికే పలు సందర్బాల్లో ఆరోపించింది. జీవాయుధాలను సైతం వాడినట్టు అగ్రరాజ్యం పేర్కొంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి దిమిత్ర పెస్కోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్తో జరుగుతున్నయుద్ధంలో అణ్వాయుధాలను వాడాల్సిన అవసరం లేదన్నారు. ఉక్రెయిన్తో పోరులో ఎటువంటి పరిస్థితి ఎదురైనా, అది అణ్వాయుధ వినియోగానికి కారణం కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తమ దేశం రష్యా మనుగడకు ప్రమాదం వస్తే తప్పకుండా అణ్వాయుధాలకు వాడుతామని తెలిపారు. అనంతరం తమకు భద్రతాపరమైన అంశాలు స్పష్టంగా ఉన్నాయని, దేశానికి ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే అప్పుడు కచ్చితంగా ఆయుధాలను వాడుతామని పరోక్షంగా హెచ్చరించారు. మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కసాయి అన్న వ్యాఖ్యలపై పెస్కోవ్ స్పందించారు. బైడెన్ వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. రష్యా అధ్యక్షుడిగా ఎవరు ఉండాలని అమెరికా అధ్యక్షుడు నిర్ణయించలేరని, రష్యా ప్రజలే నిర్ణయం తీసుకుంటారని కౌంటర్ ఇచ్చారు. బైడెన్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవని.. అది ఆయన వ్యక్తిగతమంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగానే వాణిజ్యంలో ప్రపంచ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలపై మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్న నాయకత్వానికి మద్దతు ఇస్తున్నాయన్నారు. దీంతో ఆయా దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. -
ఆ అణు ప్లాంట్ పేలి ఉంటే పెను వినాశనమే!
ఉక్రెయిన్లో జపోరిజియా అణు విద్యుత్కేంద్రంపై రష్యా క్షిపణి దాడులతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రేడియో ధార్మికత విడుదల కాకుండా ప్లాంట్లో పకడ్బందీ భద్రత ఉండడంతో పెను ప్రమాదమే తప్పింది. అలాగాక అణు రియాక్టర్లు పేలి ఉంటే యూరప్ సర్వనాశనమై పోయేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గగ్గోలు పెడుతున్నారు. గతంలో జరిగిన చెర్నోబిల్, ఫుకుషిమా వంటి ఘోర అణు ప్రమాదాలను తలచుకొని యూరప్ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో యూరప్ మాత్రమే గాక యావత్ ప్రపంచమే ప్రమాదంలో పడిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చెర్నోబిల్లో ఏం జరిగింది ? అది 1986 ఏప్రిల్ 26. తెల్లవారుజామున 1:23 గంటలు. అందరూ గాఢ నిద్రలో ఉన్న వేళ. ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలోని నాలుగు అణు రియాక్టర్లలో ఒకటి ప్రమాదవశాత్తూ పేలిపోయింది. అణు విద్యుత్కేంద్రం భద్రతపై పరీక్షలు జరిపిన ఇంజనీర్లు కరెంటు సరఫరా ఆగిపోతే ఏమౌతుందన్న అంచనాలతో చేపట్టిన ప్రయోగం విఫలమై అతి పెద్ద అణు వినాశనానికి దారితీసింది. ఈ ప్రమాదం వల్ల చెలరేగిన మంటలు తొమ్మిది రోజుల పాటు ఎగసిపడుతూనే ఉన్నాయి. వాటిని అదుపు చేయడానికి మిలటరీ హెలికాప్టర్ల ద్వారా 2,400 టన్నుల సీసం, 1800 టన్నుల ఇసుకను విరజిమ్మారు. అణు రియాక్టర్ పేలుడు జరిగినప్పుడు ప్లాంట్లో 130 మంది ఉన్నారు. అక్కడికక్కడే ఇద్దరే మరణించినా రేడియేషన్ దుష్ప్రభావాలతో తర్వాత 50 మంది ప్లాంట్ కార్మికులు, అగ్నిమాపక దళ సభ్యులు మరణించారు. మిగతా వారంతా అక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్ (ఏఆర్ఎస్)తో బాధపడుతూ జీవచ్ఛవాలుగా మిగిలారు. ప్రమాదం జరిగిన వెంటనే 30 వేల మందిని తరలించారు. తర్వాత మరో 3.5 లక్షల మంది తరలివెళ్లారు. వీరిలో 6 వేల మంది రేడియేషన్ కారణంగా థైరాయిడ్, కేన్సర్ బారిన పడినట్టు తేలింది. రేడియేషన్ వల్ల చర్మం, గొంతు కేన్సర్తో 2 లక్షల మంది వరకు మరణించినట్టు అంచనా. రేడియేషన్ దుష్ప్రభావాలతో ఎంతమంది మరణించారో ఇప్పటికీ పక్కాగా లెక్కల్లేవు. ఈ రేడియేషన్ రష్యా నుంచి ఐర్లాండ్ దాకా 13 దేశాలకు వ్యాపించింది. చెర్నోబిల్ చుట్టుపక్కల 2,600 చదరపు కిలోమీటర్లను నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించారు. ప్రపంచంలో అత్యధిక అణుధార్మికత ఉన్న జోన్ ఇదే. రేడియో ధార్మికతని తట్టుకునే ఎలుగుబంట్లు, తోడేళ్లు వంటి జంతుజాలం మాత్రమే అక్కడ జీవిస్తోంది. అక్కడ మళ్లీ మనుషులు జీవించే పరిస్థితులు నెలకొనాలంటే 3,000 ఏళ్లు పడుతుందని అంచనా. చెర్నోబిల్ను డార్క్ టూరిజం ప్లేస్గా మార్చి సందర్శకులకు అనుమతిస్తున్నారు. యూరప్ గజగజ రష్యా దాడి చేసిన జపోరిజియా అణు విద్యుత్కేంద్రంలోని ఆరు అణు రియాక్టర్లలో ప్రస్తుతం ఒక్కటే వాడకంలో ఉంది. మిగతా ఐదింటిని మూసేసినా వాటిలో తీవ్రమైన రేడియేషన్ వెలువడే అణు ఇంధనం నిల్వలున్నాయి. రష్యా దాడుల్లో రియాక్టర్లు పేలి ఉంటే యూరప్ దేశాలన్నీ సెకండ్లలో నాశనమై ఉండేవి. చెర్నోబిల్లో ప్రమాదం కంటే పది రెట్లు ఎక్కువ విధ్వంసం జరిగేదని అణు శాస్త్రవేత్తలు చెబుతున్నారు! ఈ కేంద్రంలోని అణు రియాక్టర్లకు భద్రత చాలా ఎక్కువగా ఉంది. యుద్ధ ట్యాంకులు, శతఘ్నులు దాడి చేసినా తట్టుకునే కాంక్రీట్ డోమ్స్ రక్షణ కవచంలా ఉన్నాయి. అయినా అణు ప్లాంట్లలో మంటలు చెలరేగడం చాలా ప్రమాదకరం. అణు విద్యుత్కేంద్రాల్లో మరో ప్రమాదం ఏమిటంటే అణు ఇంధన రాడ్స్ను చల్లార్చడానికి వాడే చిన్న చిన్న నీటి కొలనులు. వీటిలో అణు ఇంధనం నిండి ఉంటుంది. వాటిపై బాంబులు పడితే రేడియేషన్ విడుదలై ప్రమాదం ముంచుకొస్తుంది. రియాక్టర్లు మూతపడి ఉన్నా వాటిని చల్లగా ఉంచే కూలింగ్ వ్యవస్థ నిరంతరం పని చేస్తూ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని సిడ్నీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ ఫ్లెచర్ అన్నారు. లేదంటే పెను ప్రమాదమేనని ఆందోళన వ్యక్తం చేశారు. అణు విద్యుత్పై ఆధారపడి ఉన్న ఉక్రెయిన్లో మరో నాలుగు స్టేషన్లలో 15 రియాక్టర్లున్నాయి. జపోరిజియా అణు విద్యుత్కేంద్రం ప్రత్యేకతలు యూరప్లోనే అతి పెద్ద అణు విద్యు త్కేంద్రం. ప్రపంచంలో తొమ్మిదోది. ప్లాంట్లో 6 వీవీఈఆర్–1000 పీడబ్ల్యూఆర్ అణు రియాక్టర్లున్నాయి. ఒక్కోదాని విద్యుదుత్పత్తి సామర్థ్యం 950 మెగావాట్లు. డాన్బాస్, కీవ్ మధ్య ఎనర్హోడార్ నగరంలోని కఖ్వోకా రిజర్వాయర్ సమీపంలో ఉన్న ఈ ప్లాంటు 40 లక్షల గృహ అవసరాలను తీరుస్తోంది. ఉక్రెయిన్కు అవసరమైన విద్యుత్ సరఫరా లో సగం అణు ప్లాంట్ల నుంచే వస్తోంది. జపోరిజియా ప్లాంట్ నుంచి దేశ అవసరాల్లో ఐదో వంతు ఉత్పత్తవుతోంది. 1984–1995 మధ్య దీని నిర్మాణం జరిగింది. దీని డిజైన్ చెర్నోబిల్ ప్లాంట్ కంటే ప్రత్యేకంగా ఉంటుంది. అగ్నిప్రమాదం తలెత్తినా అణుముప్పు సంభవించకుండా భద్రత ఏర్పాట్లున్నాయి. -
రష్యా- ఉక్రెయిన్ మధ్య ముగిసిన చర్చలు..
-
Russia-Ukraine War: ముగిసిన చర్చలు.. అమెరికా కీలక నిర్ణయం
ముగిసిన చర్చలు.. అమెరికా కీలక నిర్ణయం ► ఉక్రెయిన్-రష్యా మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటూ తేలకుండా ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు చర్చల ముగిసిన కాసేపటికే అగ్ర రాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా ఎంబసీ సిబ్బంది రష్యాను వీడేందుకు అనుమతిచ్చింది. రష్యాలో ఉన్న అమెరికా పౌరులు సైతం వెంటనే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. కాగా, భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం ►ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ దేశాలు వెంటనే కాల్పులు విరమించుకోవాలని ఐరాస పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించనున్నారు. యుద్ధంపై 193 దేశాలు తమ అభిప్రాయాన్ని తెలపనున్నాయి. తగ్గేదేలే.. 36 దేశాల విమానాలపై నిషేధం ► ఇప్పటికే పలు దేశాలు రష్యా పై పలు రకాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా మాత్రం వాటికి ఏ మాత్రం బెదరక పోగా తాజాగా బ్రిటన్, జర్మనీ, తదితర 36 దేశాలకు చెందిన విమానాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం ►ఉక్రెయిన్లో పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఉక్రెయిన్లోని భారతీయలు తరలింపు ప్రక్రియపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే భారతీయుల తరలింపును మరింత వేగవంతం చేయడంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెలారస్లో ముగిసిన చర్చలు ►బెలారస్లో ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య చర్చలు ముగిశాయి. సుమారు 4 గంటల పాటు ప్రతినిధుల మధ్య ఈ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, క్రిమియా నుంచి కూడా బలగాలను తొలగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా.. నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా పట్టుబడినట్టు సమాచారం. అయితే, ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్కు మద్దతుగా వైట్ హౌస్ వద్ద నిరసనలు ► ఉక్రెయిన్-రష్యా సంక్షోభం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ను తాకింది. రష్యా అధ్యక్షుడు పుతిన్కు వ్యతిరేకంగా, ఉక్రెయిన్కు మద్దతుగా ఆ దేశ జెండాలు పట్టుకుని ఉక్రేనియన్లు నిరసనలు తెలిపారు. తమ స్వదేశానికి మద్దతుగా వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ ముందు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ఉక్రెయిన్లో పుట్టి రష్యాలో పెరిగిన ఓ వ్యక్తి కూడా పాల్గొనడం విశేషం. #WATCH | With Ukrainian flags, prayers & slogan chanting against Russian President Putin, protesters gathered in front of the White House in Washington, DC in a show of support for Ukraine pic.twitter.com/1nBYZHcl2x— ANI (@ANI) February 28, 2022 స్వదేశం చేరుకున్న 1400 మంది భారతీయులు ► ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా కేంద్రం భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. కాగా, ఇప్పటి వరకు 6 ప్రత్యేక విమానాల్లో 1400 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు భారత విదేశాంగ శాఖకు చెందిన అధికారి అరిండమ్ బాగ్చీ తెలిపారు. ఆరు విమానాల్లో 4 బూచారెస్ట్(రొమేనియా), మరో 2 బుడాపెస్ట్(హంగేరీ) నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. As of now, six flights have arrived carrying around 1400 Indian citizens. Four flights have arrived from Bucharest (Romania) and two flights from Budapest (Hungary): MEA Spokesperson Arindam Bagchi pic.twitter.com/2K7EjEacHF — ANI (@ANI) February 28, 2022 ఉక్రెయిన్కు ఈయూలో సభ్యత్వంపై భిన్నాభిప్రాయాలు: చార్లెస్ మిచెల్ ► ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో తమ దేశానికి ఈయూలో సభ్యత్వం ఇవ్వాలని జెలెన్ స్కీ అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారి చార్లెస్ మిచెల్ స్పందిస్తూ.. ఈయూ కూటమిలో ఉక్రెయిన్ చేరడంపై కూటమిలోని 27 దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. ఈయూలో ఉక్రెయిన్కు వెంటనే సభ్యత్వం ఇవ్వండి: జెలెన్ స్కీ ► ఉక్రెయిన్పై రష్యా దాడుల చేస్తున్న వేళ తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యర్థించారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది తమ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ న్యాయమైన హక్కు అని తాను అనుకుంటున్నానని, ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నట్టు జెలెన్ స్కీ పేర్కొన్నారు. బెలారస్లో చర్చలు ప్రారంభం ► బెలారస్లో ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. బెలారస్లో ఇరు దేశాల విదేశాంగ శాఖ అధికారులు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్.. రష్యా తక్షణమే యుద్ధం విరమించుకోవాలని కోరింది. రష్యా దాడుల్లో 102 మంది మృతి : UN ► ఉక్రెయిన్లో రష్యా దాడులతో మృత్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ దాడుల్లో మొత్తం 102 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి (UN) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నట్టు వెల్లడించారు. ► అహింస ఒక్కటే మార్గం : దలైలామా ఉక్రెయిన్పై రష్యా మిలిటరీ దాడులపై ఆధ్యాత్మిక నేత దలైలామా స్పందించారు. యుద్ధాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని అన్నారు. రెండు దేశాల మధ్య హింసాత్మక ఘటనలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలకు సూచించారు. యుద్ధాన్ని ఆపడానికి పుతిన్పై ఒత్తిడి తీసుకురండి: ఇగోర్ పోలిఖా ► ఉక్రెయిన్లో రష్యా యుద్ధాన్ని ఆపడానికి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఒత్తిడి తీసుకురావాలని భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలీఖా తెలిపారు. ఈ క్రమంలో తమ దేశ విదేశీ భాగస్వాములందరి సాయాన్ని పోలిఖా అభ్యర్థించారు. మీ ప్రాణాలు కాపాడుకోండి.. రష్యా సైన్యానికి జెలెన్ స్కీ విజ్ఞప్తి ► ఉక్రెయిన్పై రష్యా సైనం దాడులు కొనసాగిస్తున్న వేళ జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా బలగాలను ఉద్దేశించి మీ ప్రాణాలు కాపాడుకోండి.. ఉక్రెయిన్కు వదిలివెళ్లిపోండి అంటూ విజ్ఞప్తి చేశారు. ► బెలారస్లోని ఫ్యాపిట్ వేదికగా కాసేపట్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు.. షరతులు లేకుండా ముందుకొచ్చిన రష్యా. మరోవైపు ఉక్రెయిన్లో కొనసాగుతున్న దాడులు. ► ఉక్రెయిన్కు ఊహించని సాయం!: యుద్ధ సంక్షోభ సమయంలో ఉక్రెయిన్కు ఊహించని సాయం అందింది. నాటో దళాలు, ఈయూ దేశాలు పరోక్ష సాయానికి పరిమితమైన వేళ.. యూరప్ దేశం లాట్వియా (లాత్వియా) నుంచి ఉక్రెయిన్కు ప్రత్యక్ష మద్ధతు లభించింది. ఈ మేరకు సోమవారం పార్లమెంట్లో ఓ కీలక తీర్మానం ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్లో ఉన్న లాట్వియా పౌరులు అవసరమైతే యుద్ధంలో ఉక్రెయిన్ తరపున పాల్గొనవచ్చని తెలిపింది. ఇందుకోసం పార్లమెంటు సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తమ పౌరులు ఉక్రెయిన్లో పోరాడేందుకు వీలు కల్పిస్తున్నందుకు గర్వంగా ఉందని పార్లమెంటు ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘‘ఉక్రెయిన్కు మద్దతివ్వాలనుకునే, ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, మా ఉమ్మడి భద్రత కోసం స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే మా పౌరులు తప్పనిసరిగా అలా చేయగలరు" అని పార్లమెంటరీ రక్షణ, హోం వ్యవహారాలు, అవినీతి నిరోధక కమిషన్ ఛైర్మన్ జూరిస్ రాంకానిస్ తరపున ఒక ప్రకటన విడుదల అయ్యింది. లాట్వియా, బాల్టిక్ పొరుగున ఉన్న ఎస్టోనియా -లిథువేనియాతో కలిసి ఒకప్పుడు రష్యా పాలనలోనే ఉండేవి. రష్యాను భద్రతా ముప్పుగా చాలా కాలంగా చూసింది. చివరికి.. ఉక్రెయిన్ మాదిరిగా కాకుండా, ఆ మూడు దేశాలు యూరోపియన్ యూనియన్, NATO లో చేరాయి. అయినప్పటికీ ఉక్రెయిన్తో లాట్వియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ► బెలారస్కు చేరిన ఇరు దేశాల విదేశాంగ ప్రతినిధులు. మధ్యాహ్నాం 3గంటలకు చర్చలు మొదలయ్యే అవకాశం. ►ఉక్రెయిన్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు: సోమవారం రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగే చర్చలు సానుకూల ఫలితం ఇస్తుందని తాను అనుకోవట్లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. పరిస్థితులు అందుకు ఆశాజనకంగా లేవని కీలక వ్యాఖ్యలు చేశారాయన. చర్చలపై ఆదివారం హైడ్రామా సాగగా.. ఓవైపు రష్యా దళాలను ఎదుర్కొంటూనే చర్చలకు సిద్ధమని ప్రకటించాడాయన. అయితే ఉక్రెయిన్ ప్రతిఘటనను రష్యా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే దాడులను తీవ్ర తరం చేస్తూనే.. చర్చల ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఈ క్రమంలో ఉక్రెయిన్తో పాటు రష్యా తీవ్రంగా నష్టపోతోంది కూడా. ► కీవ్లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత. విద్యార్థులు పశ్చిమ వైపు ప్రాంతాల రైల్వే స్టేషన్లకు వెళ్లాలని సూచన. అక్కడి నుంచి ప్రత్యేక రైళ్ల ఏర్పాటు చేసిన ఉక్రెయిన్ ప్రభుత్వం. ► ఉక్రెయిన్కు ఈయూ విమానాలు: రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్కు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడు వైపుల నుంచి చుట్టుముట్టి దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై చేతనైనంత మేర పోరాడుతున్న ఉక్రెయిన్కు యుద్ధ విమానాలు పంపాలని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు కూటమి విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ తెలిపారు. ► రష్యాకు సౌత్ కొరియా షాక్: రష్యాను ఆంక్షలతో ఇరకాటంలో పెడుతున్న పాశ్చాత్య దేశాలకు ఆసియా దేశం దక్షిణ కొరియా తోడైంది. రష్యా ఎగుమతులపై దక్షిణ కొరియా నిషేధం విధించింది. వ్యూహాత్మక వస్తువుల ఎగుమతులను నిషేధించడం ద్వారా.. రష్యాకు వ్యతిరేకంగా ఎగుమతి నియంత్రణలను కఠినతరం చేయాలని దక్షిణ కొరియా భావించింది. ఇప్పటికే SWIFT అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ నుంచి కొన్ని రష్యన్ బ్యాంకులను సౌత్కొరియా బ్యాన్ చేసింది. ఈ మేరకు రాజధాని సియోల్ నుంచి విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ► రష్యాకు మద్ధతుగా ఉన్న బెలారస్పై ఆంక్షలకు జపాన్ సిద్ధమైంది. ► సంచలనం.. పుతిన్పై ట్రావెల్ బ్యాన్: మొండిగా ఉక్రెయిన్పై దూసుకెళ్లి.. ఘోర విధ్వంసానికి తెర తీసిన రష్యా అధ్యక్షుడు పుతిన్కు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా సంచలన ప్రకటన చేసింది. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, ఆయన సెక్యూరిటీ కౌన్సిల్లోని సభ్యులపై ఆస్ట్రేలియా మరిన్ని ఆంక్షలు ప్రకటించింది. వీరందరిపై ఆర్థిక, ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్వయంగా ప్రకటించారు. ‘‘మేము రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఉక్రెయిన్పై చేసిన అన్యాయమైన యుద్ధాన్ని ఖండిస్తున్నాం. ఆర్థిక ఆంక్షలు, ప్రయాణ నిషేధాలు రష్యా అధ్యక్షుడు మరియు రష్యా భద్రతా మండలిలో మిగిలిన శాశ్వత సభ్యులపై గత అర్ధరాత్రి నుంచే మా(ఆస్ట్రేలియా) తరపు నుంచి అమలులోకి వచ్చాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సహా 350 మందికి పైగా రష్యన్ వ్యక్తులపై ఈ ఆంక్షలు వర్తిస్తాయి’’ అని మోరిసన్ చెప్పారు. ఇదిలా ఉండగా.. యుద్ధంలోనూ ఆస్ట్రేలియా ఉక్రెయిన్కు బాసటగా.. రష్యా దాడిని ఎదుర్కొనేందుకు ప్రాణాంతకమైన సైనిక సామగ్రిని అందజేయనుంది. అయితే ఆస్ట్రేలియా తాజా ప్రకటనలో.. ఏ మెటీరియల్ను పంపుతుందనే దానిపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ముట్టడి చేయబడిన ఉక్రెయిన్కు మద్దతుగా నాటో ట్రస్ట్ ఫండ్.. ప్రాణాంతకం కాని సైనిక పరికరాలు, వైద్య సామాగ్రి, 3 మిలియన్ డాలర్ల విరాళాన్ని శుక్రవారం అందించిన విషయం తెలిసిందే. ► రష్యా దాడుల్లో 350 మందికి పైగా మా పౌరులు మృతి చెందారు: ఉక్రెయిన్ ► ఆపరేషన్ గంగా.. ఐదో విమానం రాక: ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ గంగను నిర్వహిస్తోంది భారత్. ఇందులో భాగంగా ఐదో విమానం.. 249 మందితో బుచారెస్ట్(రొమేనియా) నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్వయంగా గాంధీనగర్ వెళ్లి వంద మంది విద్యార్థులకు స్వాగతం పలికారు. Close to 100 students from Gujarat were welcomed back by CM Bhupendra Patel this morning at Gandhinagar. These students landed from Ukraine in Mumbai and Delhi & were brought to Gujarat by Volvo buses.#RussiaUkraineCrisis pic.twitter.com/AsPR48chXO — ANI (@ANI) February 28, 2022 ► బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్.. కార్కీవ్ నగరం ► దాడులను తక్షణమే నిలిపివేయాలి- భారత్: భద్రతా మండలిలో రష్యా దాడులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. వీటో అధికారంతో అడ్డుకుంది రష్యా. దీంతో అగ్రరాజ్యాలు ప్రత్యామ్నాయ చర్యలకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంగా.. ఉక్రెయిన్లోని తమ పౌరుల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రష్యా దాడులను వెంటనే ఈ మేరకు భద్రతా మండలిలో ప్రకటన విడుదల చేసింది. అయితే భారత్ ఓటింగ్కు దూరంగా ఉండడంపై పలు దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ► ఈ 24 గంటలే కీలకం: ఉక్రెయిన్ పరిణామాలపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ.. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. రాబోయే 24 గంటలు ఉక్రెయిన్కు కీలకమని ఈ సందర్భంగా జెలెన్స్కీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ► ఐరాస అత్యవసర భేటీ: ఉక్రెయిన్పై రష్యా దాడులు.. ఇవాళ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం. 11 దేశాల ఓటింగ్తో అత్యవసర భేటీకి తీర్మానం. భారత్, చైనా, యూఏఈ దూరం. ► రెడీగా ఉండండి-పుతిన్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగి ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అవసరమైతే అణ్వాయుధాల ప్రయోగానికీ సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారు. ఏ క్షణంలోనైనా ‘యుద్ధ విధులకు’ దిగేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాల్సిందిగా రష్యా అణ్వాయుధ దళాలను పుతిన్ ఆదివారం ఆదేశించారు. రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ తదితరులతో ఆయన అత్యున్నత స్థాయి సమావేశం జరిపారు. నాటో దేశాధినేతల దుందుడుకు వ్యాఖ్యలకు, రష్యాపై, తనపై విధించిన కఠినమైన ఆంక్షలకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. పుతిన్ ప్రకటనతో అమెరికా, పాశ్చాత్య దేశాలు కలవరపడుతున్నాయి. వివాదం చివరికి అణు యుద్ధానికి దారితీస్తుందేమోనని భయపడుతున్నాయి. అదే జరిగితే వినాశకర పరిణామాలకు దారి తీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ► అమెరికా ఆందోళన: ఈ వివాదంలో తలదూర్చే దేశాలపై అత్యంత కఠినంగా ప్రతి చర్యకు దిగుతామని యుద్ధానికి దిగిన సందర్భంగా పుతిన్ గట్టిగా హెచ్చరించడం తెలిసిందే. రష్యా తిరుగులేని అణు శక్తి అంటూ ఆ సందర్భంగా బెదిరించారు కూడా. ఉక్రెయిన్ను ఎలాగైనా ఓడించేందుకు రసాయనిక, జీవ రసాయన ఆయుధాల ప్రయోగానికి కూడా రష్యా దిగినా ఆశ్చర్యం లేదని ఇంగ్లండ్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలపై అమెరికా ఆందోళన వెలిబుచ్చింది. యుద్ధోన్మాదాన్ని అస్సలు అంగీకారం కాని స్థాయికి పుతిన్ తీసుకెళ్తున్నారని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ దుయ్యబట్టారు. ఆయన చర్యలను అత్యంత కఠినంగా ఖండించాల్సిన అవసరముందన్నారు. ► వామ్మో ‘అణు’మానాలు: రష్యా, అమెరికా ప్రస్తుతం అతి పెద్ద అణ్వాయుధ దేశాలు. ఇవి రెండూ తమ వ్యూహాత్మక భూతల, జలాంతర్గామి అణ్వాయుధ సంపత్తిని నిరంతరం అప్రమత్తంగా, ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగేందుకు సన్నద్ధంగా ఉంచుతాయి. అయితే అణ్వాయుధాలను మోసుకెళ్లగల బాంబర్లు, యుద్ధ విమానాలు మాత్రం అవసరమనుకున్నప్పుడే రంగంలోకి దిగుతాయి. ఈ సమయంలో పుతిన్ గనక తన బాంబర్లు, యుద్ధ విమానాలను అణు దాడికి సన్నద్ధం చేసే పక్షంలో అది విపరిణామాలకే దారి తీయొచ్చు. అమెరికా కూడా అదే మాదిరిగా స్పందించక తప్పని పరిస్థితి తలెత్తుతుందని ఫెడరేసన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్లో న్యూక్లియర్ అనలిస్టు హన్స్ క్రిస్టెన్సన్ అభిప్రాయపడ్డారు. అది అంతర్జాతీయంగా పెను ఉద్రిక్తతలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ► అణు ఆటలొద్దు: ఐఏఈఏ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్లోని అణు విద్యుత్ కేంద్రాల భద్రతపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ఆందోళన వెలిబుచ్చింది. వాటికి ప్రమాదం కలిగించే చర్యలకు దిగొద్దని రష్యాకు సూచించింది. అలాంటి చర్యలు భారీ ప్రాణ, పర్యావరణ నష్టానికి దారి తీయవచ్చని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో గ్రోసీ హెచ్చరించారు. వాటివద్ద పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నట్టు ఉక్రెయిన్ నుంచి తమకు సమాచారముందని చెప్పారు. ఉక్రెయిన్లో నాలుగు అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలోని 15 రియాక్టర్లు దేశ విద్యుత్ అవసరాల్లో సగం మేరకు తీరుస్తున్నాయి. ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రాన్ని గురువారం రష్యా స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. తాజాగా దానినుంచి కాస్త హెచ్చు స్థాయిలో రేడియో ధార్మికత వెలువడుతోందని ఐఏఈఏ తెలిపింది. -
'పాక్, చైనాలపై దాడి కోసమే రఫేల్ విమానాలు'
రఫేల్ యుద్ధ విమానాలను భారత దేశం ఎందుకు కొనుగోలు చేస్తోంది.. తమ అణ్వస్త్రాలను పాకిస్థాన్, చైనాల మీద ప్రయోగించడానికేనా? అందుకేనని చైనా మీడియా అంటోంది. ప్రపంచంలో ఆయుధాల కొనుగోళ్లలో భారతదేశమే అగ్రగామిగా ఉందని చెబుతోఉంది. రఫేల్ జెట్ విమానాలకు అణు వార్హెడ్లను తీసుకెళ్లగల సామర్థ్యం ఉందని, అంటే భారత అణ్వస్త్ర సామర్థ్యం మరింత పెరుగుతుందని గ్లోబల్ టైమ్స్ అనే పత్రికలో ప్రచురించిన కథనంలో పేర్కొన్నారు. భారత్ దాదాపు రూ. 85వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. మూడేళ్ల తర్వాత అందే ఈ విమానాలతో పాకిస్థాన్, చైనాలలో ఉన్న లక్ష్యాలపై భారత భూభాగం నుంచే దాడులు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత వైమానిక దళంలో 33 ఫైటర్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. ప్రతిదాంట్లో 18 చొప్పున యుద్ధవిమానాలున్నాయి. కానీ.. చైనా, పాకిస్థాన్ రెండు దేశాల నుంచి ఉన్న ముప్పును ఎదుర్కోవాలంటే కనీసం 45 యుద్ధ యూనిట్లు కావాల్సి ఉంటుందని అంచనా. 'చైనా బూచి'ని చూపించి తమ ఆయుధ సంపత్తిని పెంచుకోడానికి భారతదేశంతో సహా చైనా పొరుగుదేశాలు ప్రయత్నిస్తున్నాయని గ్లోబల్ టైమ్స్ కథనం పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలోనే ఈ కథనం వెలువడటం విశేషం. ఈ దాడుల గురించి చైనా ఇంతవరకు స్పందించలేదు. ఇన్నాళ్లూ పాకిస్థాన్కు గట్టి మద్దతుదారుగా ఉన్న చైనా దీనిపై స్పందించకపోవడం ఒకరకంగా పాకిస్థాన్కు ఎదురుదెబ్బే అవుతుంది. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లోనే రఫేల్ యుద్ధ విమానాలను భారతదేశం మోహరిస్తుందని అంచనా వేస్తున్నట్లు చైనా పత్రిక పేర్కొంది. నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు 6.66 లక్షల కోట్ల రూపాయలను ఆయుధాల కొనుగోలుకు, సైనిక సామర్థ్యాన్ని పెంచుకోడానికి ఖర్చుపెట్టారని ఆ కథనంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. భారతదేశంతో పాటు వియత్నాం, దక్షిణ కొరియా కూడా టాప్ 10 ఆయుధాల కొనుగోలుదారుల్లో ఉన్నాయని చెప్పారు.