breaking news
nqp
-
ఎన్క్యూపీ విధానంతో విజ్ఞానం
∙సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్కుమార్ స్టేషన్ ఘన్ పూర్ : ఎన్క్యూపీ విధానంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల్లో విజ్ఞా నం, శాస్త్రీయ దృక్ఫథం పెంపొందుతుందని సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్కుమార్ అన్నారు. స్థానిక సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఏర్పాటుచేసిన ఎన్క్యూపీ సెమినార్ ఆయన పరిశీలించారు. ఆ తర్వాత ప్రవీణ్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్క్యూపీ విధానాన్ని ఒక్క శాతం మంది ఉపాధ్యాయులే వ్యతిరేకించారని, ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. కాగా, ఎన్క్యూపీ విధానం ఉపాధ్యాయులు, విద్యార్థులకు లాభదాయకమని, ఈ విధానాన్ని తొలిసారి స్టేషన్ ఘన్ పూర్ లో ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఉ పాధ్యాయులు హాజరైన ఈ సెమినార్లో లక్ష్మ య్య, గీతాలక్ష్మి, హైమావతి, డీసీఓ రూపాదేవి, ప్రిన్సిపాల్ కాళహస్తి పాల్గొన్నారు. -
ఎన్క్యూపీ సెమినార్ బహిష్కరణ
స్టేషన్ఘన్పూర్ టౌన్ : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో గురువారం నిర్వహించిన ఎన్క్యూపీ (న్యూ క్వాలి టీ పాలసీ) సెమినార్ను ప్రభుత్వ సాంఘిక సంక్షే మ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బహిష్కరించారు. సెమినార్కు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి 22 మంది ఉపాధ్యాయులను ఎంపిక చే శారు. కేవలం ఇద్దరే హాజరుకాగా.. మిగిలినవారు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల జేఏసీ నాయకులు కె. వెంకట్రెడ్డి, రవీందర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులను భయాందోళనకు గురి చేసే విధంగా సీసీ కెమెరాల నిఘాలో ఎన్క్యూపీ సెమినార్ నిర్వహించడం సమంజసం కాదన్నారు. దీనిని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నరేందర్రెడ్డి, యాదయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.